breaking news
maremma
-
రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ ‘మారెమ్మ’ మూవీ టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మారెమ్మ’ అనే టైటిల్ ఖరారు చేశారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు కథానాయిక. మోక్ష ఆర్ట్స్ బ్యానర్పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మారెమ్మ’ టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మారెమ్మ’. మాధవ్ను ఫెరోషియస్ రగ్డ్ లుక్లో ప్రజెంట్ చేస్తున్నారు నాగరాజ్. ఈ పాత్ర కోసం ఆయన పూర్తీగా మేకోవర్ అయ్యారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి కందాలా, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి. -
గంటల మారెమ్మ హుండీ చోరీ
పుట్టపర్తి అర్బన్: మండలంలోని బత్తలపల్లి సమీపంలోని కనుమలో వెలసిన గంటల మారెమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి నెలా హుండీని లెక్కించి బ్యాంకులో పొదుపు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈనెల ఇంకా లెక్కించక పోవడంతో సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ కానుకలు ఉండవచ్చన్నారు. చోరీపై పుట్టపర్తి రూరల్పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఆలయంలో రెండో సారి చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.


