Mandal President
-
టీడీపీ మండలాధ్యక్షుడిపై కేసు
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లెకు చెందిన టీడీపీ మండలాధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పులిశేఖర్ ఆదివారం తెలిపారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి గొర్విమానుపల్లె సమీపంలోని 1221 సర్వే నెంబర్లో మైనింగ్ లీజుంది. ఈనెల 1న కంపెనీకి చెందిన స్థలం చుట్టూ సరిహద్దు ఫిల్లర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే సమయంలో రామేశ్వరరెడ్డి అక్రమంగా ప్రవేశించి ఇక్కడ తమకు స్థలం ఉందంటూ సరిహద్దు పిల్లర్లను పడగొట్టారు. అల్ట్రాటెక్ కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెస్కెఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు మూలె రామేశ్వరరెడ్డి, మరో 20 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అల్ట్రాటెక్ ప్రతినిధులపై కౌంటర్ కేసు.. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎంఎస్ఆర్కె ప్రసాద్తో పాటు మరో ఆరుగురిపై టీడీపీ మండలాధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ నెల 1న కంపెనీ ప్రతినిధులు తన పొలంలో గుంతలు తవివ్వ వ్యవసాయం చేసేందుకు వీలు లేకుండా చేశారంటూ రామేశ్వరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. అల్ట్రాటెక్ కంపెనీ, రామేశ్వరరెడ్డి మధ్యనున్న వివాదస్పద భూమిని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి పరిశీలించారు. -
‘టీఆర్ఎస్ అధ్యక్షుడిని మార్చాలి’
దేవరుప్పుల : టీఆర్ఎస్ పార్టీ నియమావాళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీ మండల అధ్యక్షుడు మొలుగూరి రమేష్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జెరిపోతుల సాయిలు, కొత్త జలంధర్రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది గ్రామాలకుగానూ పదహారు గ్రామ శాఖ అధ్యక్షులు తిరస్కరిస్తున్న క్రమంలో ఇంకా ఆయననే అధ్యక్షుడిగా కొనసాగడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆయన పదవిని రద్దు చేసీ సమన్వయ కమిటి వేయాలని కోరారు. సర్పంచ్లు భీముడు, మేడ సునీత సోమనర్సయ్య, నాయకులు తీగల సత్తయ్య, జోగు ఐలయ్య, ఖాసీమ్, పరుశరాములు, చంద్రభాను, వీరాచారీ, కృష్ణమూర్తి, బబ్బూరి యాదగిరి, చిలుపురం సోమయ్య, కాశబోయిన యాకన్న, ఠాగూర్, సోమయ్య ఉన్నారు. -
కానిస్టేబుల్ను దూషించాడంటూ..
కేతేపల్లి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను దూషించి, అతడి విధులకు ఆటంకపరిచాడన్న అభియోగంతో అధికారపార్టీ మండల అధ్యక్షుడిపై బుధవారం కేతేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కోట ఈదమ్మకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్ మంజూరు కాలేదు. ఇందుకు స్థానికంగా ఉన్న టీడీపీ నేత, వైస్ ఎంపీపీ కోట ము త్తయ్య కారణమంటూ ఆమె మనువడు కోట శ్రీనివాస్ మంగళవారం జరిగిన గ్రామసభలో వారిని దూషించా డు. దీంతో ఆగ్రహించిన ముత్తయ్య బుధవారం శ్రీనివాస్పై కేతేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌం టర్గా కోట ఈదమ్మ పేరిట రాసిన ఫిర్యాదును కోట శ్రీనివాస్ తమ్ముడు కిరణ్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చాడు. ఈసమయంలో స్టేషన్లో గార్డు డ్యూటీలో ఉన్న హెడ్కానిస్టేబుల్ యాట రమేష్ ఫిర్యాదును పరిశీలించా డు. బాధితులు లేకుండా ఫిర్యాదు తీసుకోమని స్పష్టం చేశాడు. దీంతో కిరణ్ పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్కు తెలిపాడు. ఈ విషయమై పోలీస్స్టేషన్కు వచ్చిన శ్రీనివాస్యాదవ్ హెడ్కానిస్టేబుల్తో వాదనకు దిగాడు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. సంఘటనపై రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు నల్లగొండ డీఎస్పీ బి.రాములునాయక్ సాయంత్రం కేతేపల్లి పోలీస్స్టేషన్ సందర్శించారు. ఎస్ఐ శ్రీనివాస్తో పాటు విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ హెడ్కానిస్టేబుల్ విధులకు అటంకం కలిగించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట నకిరేకల్ రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ ఎ.శ్రీనివాస్లు ఉన్నారు.