breaking news
Loved One
-
మీ మనసుని అర్థం చేసుకునే రోబో
నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ UBTECH తన వినియోగదారు బ్రాండ్ కింద UWORLD U1 అనే హ్యూమనాయిడ్ కంపానియన్ (సహచర) రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల అల్ట్రా-బయోనిక్ రోబోగా ఇది రికార్డు సృష్టించింది.మనిషికి ప్రతిరూపంఈ రోబో కేవలం యంత్రంలా కాకుండా అచ్చం మనిషి లాంటి రూపాన్ని, హావభావాలను కలిగి ఉంటుంది.మనిషి స్పర్శను తలపించేలా బయోమిమెటిక్ సిలికాన్ చర్మంతో దీనిని రూపొందించారు. దీనికి మేకప్ వేయడం, జుట్టును అమర్చడం కూడా సాధ్యమే.మనుషుల శారీరక కదలికలను 90 శాతం వరకు అనుకరించేందుకు ఇందులో 88 సర్వో జాయింట్లు, ప్రత్యేక మెడ భాగం అమర్చారు.కేవలం మాట్లాడటమే కాదు, మనుషుల వాయిస్ టోన్, ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితిని 90% కచ్చితత్వంతో గ్రహించి దానికి తగ్గట్టుగా ఓదార్పు మాటలు చెప్పగలదు.ఈ రోబో వంట చేయడం, ఇల్లు ఊడ్చడం వంటి గృహ పనులు చేయదు. కేవలం ఒక మంచి స్నేహితుడిలా సంభాషించడం, మందుల వేళలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని అందించడమే దీని ఉద్దేశం.చైనాలో ఒంటరిగా ఉంటున్న దాదాపు 12 కోట్ల మంది సింగిల్స్, 32 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు.ధర ఎంతంటే..ఈ రోబోల ప్రారంభ ధర 1,19,800 యువాన్లు (సుమారు రూ. 14 లక్షలు) కాగా, అత్యంత అధునాతన ఫీచర్లు గల ఆల్ట్రా వెర్షన్ ధర 9,90,000 యువాన్ల (సుమారు రూ. 1.15 కోట్లు) వరకు ఉంది. ఖరీదైన మోడల్స్లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా లేదా గతంలో మరణించిన తమ ప్రియమైన వారి ముఖ రూపాలను (3డీ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, వాయిస్ప్రింట్ ద్వారా) రీ-క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి రోజే ఈ సిరీస్ కోసం ఏకంగా 13,361 యూనిట్ల ప్రీ-ఆర్డర్లు రావడం గమనార్హం. దీని డెలివరీలు రాబోయే సెప్టెంబర్ మధ్య నాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మానవ సంబంధాల కొరతను ఎంతవరకు తీరుస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
ఏఐ వింతలు: చనిపోయినవారితో జూమ్ కాల్, మాటామంతీ
అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?అదంతా ‘గ్రీఫ్బాట్స్’ మహిమ!‘గ్రీఫ్బాట్స్’ (Griefbots) లేదా ‘డెట్బాట్స్’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి. ప్రాజెక్ట్ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్ యూ, వోన్లీ వర్చువల్... మొదలైన స్టార్టప్లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్లతో మాట్లాడించే టూల్స్పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)జస్టిన్ హారిసన్ స్టార్టప్ ‘అండ్ యూ’ యూజర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్ సృష్టించిన ఏఐ–పవర్డ్ ఆడియో వెర్షన్స్ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్ హరిసన్.చనిపోయిన వారితో ‘జూమ్ కాల్’లాంటి సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్’ స్టార్టప్. కీర్తిశేషుల ఏఐ అవతార్లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్బాట్స్’ స్టార్టప్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్రేమ వివాహం వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామానికిచెందిన యలమకురు చరణ్కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ జె.రవికుమార్ కథనం మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కె. సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన యలమకురు యల్లప్ప కుమారుడు ఎస్సీ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమవివాహం చేసుకోవద్దని తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడిని కలవనివ్వలేదని ఆత్మహత్యాయత్నం
అనంతపురం(గోరంట్ల): తమ ప్రేమను ప్రియుడి తల్లిదండ్రులు నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గోరంట్ల మండలానికి చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన తన క్లాస్మేట్ అశోక్, సదరు యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అశోక్ను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ప్రియుడిన కలిసేందుకు ఆ యువతి అనంతపురం మండలం బుదిలికి వెళ్లింది. అయితే యువతిని ఇంట్లోకి రాకుండా యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన యువతి 18 బ్రూఫిన్ ట్యాబ్లెట్లు మింగి బుదిలి బస్టాండ్లో ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు.


