breaking news
Louvre Museum
-
Louvre heist: ఎట్టకేలకు దొరికిన మ్యూజియం దొంగలు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూవ్ర్(లౌవ్ర్) మ్యూజియం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పారిస్ పోలీసులు ధృవీకరించారు. అయితే వీళ్లు పింక్ పాంథర్ ముఠా సభ్యులేనా? అనేది మాత్రం ఇంకా ధృవీకరణ కాలేదు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 19న పారిస్లోని లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది(louvre museum Heist). మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. కన్స్ట్రక్షన్ కార్మికుల వేషాలు దుండగులు ఓ భారీ క్రేన్ ద్వారా వెనకభాగం నుంచి లోపలికి చొరబడ్డారు. ఉదయం 10గం. ప్రాంతంలో సరుకు రవాణా ఎలివేటర్(Basket Lift) ద్వారా అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించి బయటపడ్డారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాల్లోనే జరిగిపోవడం గమనార్హం.ఆ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం అదుపులోకి తీసుకుంది అనుమానితులా? లేదంటే దొంగలేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. అలాగే నగల రికవరీ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చోరీకి సంబంధించి మరో ఇద్దరు, ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, వాళ్లే ఈ చోరీకి ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది. New footage shows thieves using chainsaws to execute robbery at The Louvre in Paris. A manhunt is now underway. pic.twitter.com/0w0Uu6MJyn— Pop Crave (@PopCrave) October 20, 2025పింక్ పాంథర్ ముఠా గురించి.. లూవ్ర్ మ్యూజియం చోరీ వెనుక పింక్ పాంథర్ ముఠా హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు కారణం.. చోరీ జరిగిన విధానమే!. 2001లో సెర్బియా బెల్గ్రేడ్ కేంద్రంగా డ్రాగన్ మైకిక్ అనే వ్యక్తి ఈ ముఠాను ప్రారంభించారు. ఆభరణా దొంగతనాలకు ఈ ముఠా పెట్టింది పేరు. స్మోక్ బాంబులు, గేట్వే కార్లు ఉపయోగిస్తూ సినీ ఫక్కీలో చోరీలు చేయడం ఈ ముఠా స్టైల్. అందుకే 1963లో వచ్చిన ది పింక్ పాంథర్ అనే సినిమా ఆధారంగా ఇంటర్పోల్ ఈ గ్యాంగ్కు ఆ పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ గ్యాంగ్లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నారని, యుగోస్లావియా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్లో ఇప్పటిదాకా 370కి పైగా దొంగతనాలు చేయగా.. చోరీ చేసిన వాటి విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4200 కోట్లు) ఉండొచ్చని అంచనా. దుబాయ్ మాల్లో 2007లో పట్టపగలే చేసిన భారీ చోరీ, 2004లో టోక్యోలో కాస్ట్లీ డైమండ్ దొంగతనంతో పాటు లండన్, జెనీవా మ్యూజియాల్లో విలువైన చోరీలు చేసింది ఈ పింక్ పాంథర్ గ్యాంగ్. అయితే.. ఈ ముఠా చేసిన చోరీల్లో వస్తువులు రికవరీ కావడం చాలా తక్కువ. ఆభరణాలను ముక్కలు చేసి అమ్మేస్తుండడంతో చాలా కేసులు సాల్వ్కాకుండా ఉండిపోయాయి.ఇదీ చదవండి: చరిత్రలో కాస్ట్లీ దొంగతనం ఏదో తెలుసా? -
చోరీకి గురైన వజ్రాభరణాల విలువ రూ.900 కోట్లు !
పారిస్: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీ న పారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్ రాజుల కా లంనాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెల్సిందే. దీనిపై 100 మంది పోలీసు, ఇంటెలిజెన్స్ అధి కారులు సమగ్రస్థాయిలో కేసు దర్యాప్తు మొదలెట్టిన విషయం తెల్సిందే. చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రా భరణాల వివరాలను పారిస్ ప్రాసిక్యూ టర్ లారే బెకావూ వెల్లడించారు. ‘‘పచ్చ లు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దు లు, 1,354 వజ్రాలు, 56 మరకతమణు లు, పుష్యరాగం పొదిగిన రెండు స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే రెండు పెద్ద పిన్నులు, నీలమణులు, ము త్యాలు, 2,000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకు పోయారు. ఈ ఆభరణాల్లోని నీలమణు లు, వజ్రాలు, బంగారం విడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.900 కోట్లు ఉండొచ్చు. ఫ్రాన్స్ ప్రాచీన ఘన వారసత్వం, రాజరిక హోదా, అరు దైన డిజైన్ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువను ఊహించలేం’’ అని అధికారి బెకావూ వ్యాఖ్యానించారు. చోరీ జరిగిన తర్వాత ఎట్టకేలకు బుధవారం మ్యూజి యంను సందర్శకుల కోసం తెరచారు. అయితే చోరీకి గురైన అపోలో గ్యాలరీలోకి మాత్రం ఎవరినీ అనుమతించట్లేరు. అయి తే చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కను గొనడం అసాధ్యమని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీలు చేసే చోరశిఖామణులు అత్యంత తెలివిగా వ్యవ హరిస్తారు. చోర తర్వాత నకిలీ పాస్పోర్ట్ తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రా లు, విలువైన రత్నాలను విడివిడిగా వేర్వే రు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు’’ అని చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్, లాయర్ అయిన క్రిస్టఫర్ ఏ మ్యారినెల్లో అభిప్రాయపడ్డారు. -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్బీఐ, ఇంటర్పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
ఫ్రాన్స్లో భారీ చోరీ
పారిస్: ఫ్రెంచ్ ్రౖఫైస్ దుంపల వేపుడును తినాలన్నా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. అంతకంటే తక్కువగా అంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే చోరశిఖామణులు వెలకట్టలేని చారిత్రక వజ్రాభరణాలను దొంగలించిన ఉదంతం ఫ్రాన్స్లో జరిగింది. పారిస్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరీ చోటుచేసుకుంది. నెపోలియన్ చక్రవర్తి, రాణి సేకరించిన అరుదైన, పురాతన వజ్రాభరణాలను దొంగలు అలవోకగా కాజేసి ఎంచక్కా బైక్లపై ఉడాయించిన ఉదంతం ఇప్పుడు ఫ్రాన్స్సహా యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. విశ్వవిఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ చిత్రరాజం సైతం ఇదే మ్యూజియంలో కొలువై రోజూ వేలాది మంది ప్రపంచపర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. వందేళ్ల క్రితం ఇదే మ్యూజియంలో ఇదే మోనాలిసా పెయింటింగ్ సైతం చోరీకి గురై రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దొరికింది. ఇప్పుడు ఆదివారం చోరీకి గురైన అత్యంత విలువైన వజ్రాభరణాలు ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదోనన్న చర్చ ఇప్పుడు ఫ్రాన్స్లో ఎక్కువైంది. మ్యూజియం తలపులు తెరచిన అరగంట తర్వాత ఈ చోరీ జరగడం గమనార్హం. అపోలో గ్యాలరీలోకి ఇంకా ఎవరూ రాకముందే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బాస్కెట్ లిఫ్ట్తో వచ్చి, కట్టర్తో కత్తిరించి..దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చడీచప్పుడులేకుండా తమ పని కానిచ్చేశారు. ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు ఈ చోరీ చేశారు. మ్యూజియంకు కుడివైపున ‘సీన్’ నది ప్రవహిస్తోంది. అటువైపు మ్యూజియం గోడ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అదే ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలచుకున్నారు. వీధుల్లో ఎత్తయిన వీధిలైట్లను మార్చేందుకు వాడే ‘బాస్కెట్’ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9.30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పదునైన రంపపు కోత మెషీన్లతో దానిని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఈ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తుల సంబంధిత 23 కిరీటాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతారు. అందులోనే నెపోలియన్–3 రాజు, రాణిలకు సంబంధించిన వజ్రా భరణాలు ఉన్నాయి. ప్రదర్శన పేటికలను బద్దలు కొట్టి వీటిల్లో తొమ్మిదింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే వాటిల్లో రాణి యుజెనీకి చెందిన ఒక కిరీటంలోంచి విరిగిపడిన కొన్ని ముక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మ్యూజియం వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఈ స్వర్ణకిరీటంలో 1,354 చిన్న వజ్రాలు, 56 మరకతమణులు పొదిగి ఉన్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంవిస్తీర్ణంపరంగా లౌరీ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే ఏకంగా 10 ఫుట్బాల్ స్టేడియాల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంటుంది. ఏకంగా 35,000 పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉన్న మ్యూజియం కూడా ఇదే.ఇంటిదొంగల పనా?మ్యూజియంలోని ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఉపయోగించిన బాస్కెట్ లిఫ్ట్ను పారిస్లో సర్వసాధారణంగా వాడతారు. అపార్ట్మెంట్లలో మూడు, నాలుగు అంతస్తుల ఫ్లాట్లలోకి ఫర్నీచర్ను తరలించేందుకు దీనినే వాడతారు. ఈ హైడ్రాలిక్ నిచ్చెనను చెర్రీ పికర్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లకు ఎలాంటి అనుమానం రాలే దని తెలుస్తోంది. అపోలో గ్యాలరీలో అత్యంత విలువైన రీజెంట్, సాన్సీ, హోర్టెన్సియా వజ్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఇవి చోరీకి గురయ్యాయో లేదో తెలియరాలేదు. ఇది మాత్రమేకాదు ప్రాన్స్లో మ్యూజియంలలో చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో వాటి కోసం దొంగలు మ్యూజియంలపై పడుతున్నారు. ఇదీ చదవండి:హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్ -
షాకింగ్ ఘటన: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం!
ప్యారిస్: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసాను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. కళా ప్రియులు, సందర్శకుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. వృద్ధురాలి గెటప్లో వీల్చైర్లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. వీల్చైర్ నుంచి ఒక్కసారిగా బయటకు దూకి.. పెయింటింగ్ వైపు దూసుకెళ్లాడు. ఆపై కేక్ను పెయిటింగ్ మీదకు విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ పెయింటింగ్ దగ్గరగా దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పెయింటింగ్ మీద ఉన్న గ్లాస్కు ఆ కేక్ అంటడంతో పెయింటింగ్కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సుప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ఈ పెయింటింగ్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. ప్రస్తుతం దాడి వీడియో వైరల్ అవుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తి పర్యావరణవేత్తగా తెలుస్తోంది. ఈ భూమిని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఫ్రెంచ్లో అతను నినాదాలు చేయడం విశేషం. Can anybody translate what ole dude was saying as they where escorting him out?😂 pic.twitter.com/Uy2taZ4ZMm — Lukeee🧃 (@lukeXC2002) May 29, 2022 అతను పెయింటింగ్ ధ్వంసం కోసమే యత్నించాడా? లేదంటే కేక్ పూయడం ద్వారా నిరసన తెలపాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సెక్యూరిటీ కళ్లు గప్పి అసలు కేకును అతను లోపలికి ఎలా తీసుకెళ్లడన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మోనాలిసా పెయింటింగ్ ఇలా దాడులకు లక్ష్యంగా మారడం ఇదేం కొత్త కాదు. 1956లో ఓ ఆగంతకుడి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడిలో పెయింటింగ్ కింది భాగంగా.. బాగా డ్యామేజ్ అయ్యింది కూడా. అప్పటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసులో ఆ పెయింటింగ్ను భద్రపరిచారు. -
8 వేల ఏళ్ల నాటి ముత్యం
అబుధాబి: యూఏఈలోని మరవాహ్ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న లౌవ్రె అబుధాబి ఎగ్జిబిషన్లో ఈ ముత్యాన్ని ప్రదర్శించనున్నారు. ముత్యపు పొరలపై జరిపిన కార్బన్ డేటింగ్లో ఇది క్రీ.పూ 5800–5600 కాలానికి సంబంధించిందిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈలో దొరికిన అత్యంత ప్రాచీన వస్తువు కూడా ఇదే కావడం గమనార్హం. -
పారిస్ లౌరీ మ్యూజియం మూసివేత
ఉత్తర యూరోప్ లోని బెల్జియం, జెర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ గుండా ప్రవహించే సీన్ నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతోంది. సాధారణ స్థాయి కంటే సుమారు ఆరు మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఫ్రాన్స్లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పారిస్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ, ఆర్సే మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపింది. ఆ మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేదుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దక్షిణ పారిస్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత వారం నుంచి కురుస్తున్న వానలు గురువారం మరింత భీకరంగా మారాయి. దీంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు రావడంతో ఆయా యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సీన్ నది ప్రవాహ స్థాయి ఈ వారాంతంలో మరింత పెరగనుందని వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎరిక్ సూచించారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.


