breaking news
late Chief Minister Dr. YS Rajasekhara Reddy
-
73వ వైఎస్ఆర్ జయంతి వేడుకలపై స్పెషల్ స్టోరీ
-
రేపటి నుంచి రంగారెడ్డి జిల్లాలో షర్మిల యాత్ర
-
రేపటి నుంచి షర్మిల యాత్ర
వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు పరామర్శ మంద మల్లమ్మ చౌరస్తాలో రాజశేఖరరెడ్డికి నివాళి జిల్లెలగూడ నుంచి రంగారెడ్డి జిల్లా పర్యటన ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను మహానేత తనయవైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర చేపడతారు. తొలుత సరూర్ నగర్ మండలం జిల్లెల గూడలో మరణించిన బచ్చనబోయిన అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంద మల్లమ్మ చౌరస్తాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు మహేశ్వరం మండలం మంఖాల్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామాల్లోని మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. మంగళవారం ఉదయం మేడ్చల్ నియోజకవర్గంలోని కొండ్లకోయ నుంచి యాత్రను ప్రారంభించి... మేడ్చల్, కేసారం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్లలో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. బుధవారం మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి, పరిగి మండలం రంగాపూర్, గొట్టిఖుర్దు, తాండూరులలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి, మోమిన్పేట, ఎన్కతలను సందర్శిస్తారు. భారీగా స్వాగతం పలుకుదాం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా రంగారెడ్డి జిల్లానే ఎంచుకునే వారని... ప్రస్తుతం ఆయన కుమార్తె షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఆమెకు భారీగా స్వాగతం పలకాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, జిల్లా అధ్యక్షులు సురేష్రెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ విగ్రహ ధ్వంసానికి విఫలయత్నం
వైఎస్సార్సీపీ నేతల ఆందోళన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ పోలీసుల అదుపులో నలుగురు యువకులు తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారు. గ్రామంలో కొద్ది రోజులనుంచి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు గ్రామంలో కులాల వారీగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం రాత్రి కమ్మ కులస్థులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు దాటిన తరువాత స్థానిక జయభారత్ కాలనీ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద నలుగురు యువకులు మద్యం సేవించి, బండరాయితో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహం ముఖాన్ని రాయితో కొట్టడంతో పెచ్చులూడాయి. ఆదివారం ఉదయం స్థానికులు తెలుసుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విగ్రహ ధ్వంసానికి తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులే కారణమని పేర్కొన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కొంతసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ జె అనూరాధ సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులకు హామీ ఇచ్చారు. తమ నాయకుడి విగ్రహం ధ్వంసం చేయడంతో నిందితులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉయ్యూరు వెంకటరెడ్డి, ఆరేకూటి లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నూతక్కి నరేంద్రబాబుతోపాటు నేతలు షేక్ జానీ, డి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో ఎస్సీ, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.