breaking news
lanka dahanam
-
రాజమౌళి మీకు ‘లంకా దహనం సీన్లు చూపిస్తాం’
సాక్షి,హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి. వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానించాయని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) సహా పలు హిందూ సంస్థలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావినూతల శ్రీధర్ రాజమౌళిపై మండిపడ్డారు. ‘ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీశాయి. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదంటే లంకా దహనం సన్నివేశాలు ప్రదర్శిస్తాం’అని హెచ్చరించారు. జిహాదీ నిధులతో సినిమాలు తీసి హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని రావినూతన శ్రీధర్ ఆరోపించారు. -
కనుల పండువగా లంకాదహనం
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలు శుక్రవారం నాటి లంకాదహనం కార్యక్రమంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు లంకాదహనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ ఆనంద్కుమార్, ధర్మకర్త సుగుణమ్మ, ఇతర పాలకమండలి సభ్యుల చేతులు మీదుగా స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ వేద పండితులు రామకృష్ణావధాని, అనంత పద్మనాభశర్మ ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు రాఘవచార్యులు, అనంతాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఉత్సవమూర్తికి విశేష అర్చన, వేద గోష్ఠి పూజలు నిర్వహించారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామి చేతులమీదుగా లంకాదహనం కార్యక్రమం ప్రారంభించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన లంకాదహనం వేడుకలను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు గుంతకల్లు జేఎçఫ్సీఎం జడ్జి కె.వాసుదేవరావు, వైఎస్సార్సీపీ సర్పంచ్ తిక్కస్వామి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి సోమిరెడ్డి, బెస్త మనోహర్, శ్రీరాములు పాల్గొన్నారు.


