breaking news
kubera
-
కుబేర మూవీ హిట్టా...ఫట్టా?
-
ఏపీలో 'కుబేర' సినిమా టికెట్ ధరలు పెంపు..
ధనుష్- నాగార్జున-రష్మిక కలిసి నటించిన 'కుబేర' సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా రూ. 150 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్కినేని ఫిదా, లవ్స్టోరీ వంటి భారీ విజయాల తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'కుబేర' కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.ఏపీలో టికెట్ ధరలు ఇలాఏపీలోని అన్ని మల్టిప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్స్లలో టికెట్ ధరపై రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 10 రోజులపాటు కొనసాగించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, హయ్యర్ (1st) క్లాస్ టికెట్స్కు మాత్రమే ధరలు పెంచాలని సూచించింది. కుబేర టికెట్ ధరల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా ఆ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమా టికెట్ ధరలును పెంచలేదు. పాత ధరలనే యథాతథంగా ఉంచింది. ఏపీలో కుబేర సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్లలో అయితే రూ. 270, సింగిల్ స్క్రీన్స్లలో రూ. 240 వరకు చెల్లించాల్సి ఉంటుంది. #Kuberaa AP Tickets Hiked!Single screens upto ₹236!!Multiplexes upto ₹265.50! pic.twitter.com/ZhFLAFA2TH— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 19, 2025 -
రష్మిక మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ!
నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బిగ్ స్క్రీన్పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్కు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.Wishing #Kuberaa all the very best as it heads to the big screen. @sekharkammula sir will always be a special name in my journey — he gave many actors like me hope. To see him now telling a story on this scale, with a cast filled with personal favourites like @dhanushkraja,…— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2025 -
చిరుతో పోటీకి ధనుష్..! కుబేర రిలీజ్ డేట్ లాక్
-
నో కాంప్రమైజ్ అంటున్న శేఖర్ కమ్ముల: Kubera Movie
-
వీల్ఛైర్లో రష్మిక మందన్న.. వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజు క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయం అయింది. చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ఛైర్లో కనిపించింది అందరినీ షాక్కు గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం ఆమె ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఇలా గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించడంతో.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో రష్మిక తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్లో టాప్ హీరోయిన్గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె కొద్దిరోజుల క్రితం ఇలా పంచుకున్నారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అని పేర్కొంది. 'ఛావా' (Chhaava) ప్రమోషన్స్లతో రష్మిక బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాపై ఫ్యాన్స్లలో భారీ అంచనాలు ఉన్నాయి.It's painful to see @iamRashmika like this. But at the same time, I'm also happy to see that she hasn't given up. She's showing her fans that she's a fighter, strong and unstoppable. That's why we call her our inspiration. Proud of you #RashmikaMandanna. Your strength &… pic.twitter.com/WVWjdDz2XC— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 22, 2025 -
వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత?
బెంగళూరు : సామాన్యుడికి ఆయుధంగా మారిన సమాచార హక్కు చట్టం... ఇప్పుడు 'దేవుడు' తీసుకున్న అప్పు ఎంత అనే లెక్క కూడా అడుగుతోంది. 'తిరుపతి వెంకటేశ్వరస్వామి తన వివాహం కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? భక్తుల కానుకల ద్వారా ఇప్పటివరకూ తీర్చిన అప్పు లెక్క చెప్పండి? ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది..' అని బెంగళూరుకు చెందిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త టి.నరసింహమూర్తి తిరుమల తిరుపతి దేవస్ధానానికి ప్రశ్నలు సంధించారు. బెంగళూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ...'చాలా కాలంగా వెంకటేశ్వరుడి అప్పు తీర్చడం కోసం భక్తులు హుండీలో డబ్బులు వేస్తున్నారు. ఇలా ఇంకెంత కాలం వేయాలి. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి 2012 ఫిబ్రవరి 6న దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. సమాధానం వచ్చే వరకూ పోరాటం సాగిస్తాను' అని చెప్పారు.