breaking news
Kochadaiiyan
-
ఈ సారి బావ హీరోగా సినిమా..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సౌందర్య రజనీ కాంత్, కొచ్చాడయాన్ సినిమాతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో పలు చిత్రాలకు గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసిన సౌందర్య, కొచ్చాడయాన్తో నిర్మాత, దర్శకురాలిగానూ మారింది. అయితే ఈ సినిమా నిరాశపరచటంతో మెగాఫోన్ను పక్కనపెట్టి బిజినెస్ పనులు చూస్తూ కాలం గడుపుతోంది. తాజాగా మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది ఈ స్టార్ వారసురాలు. గతంలో తండ్రి హీరోగా సినిమా తెరకెక్కించిన సౌందర్య, ఈ సారి తన అక్క భర్త, ధనుష్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉందట. అయితే ఈ సినిమాకు కేవలం స్క్రిప్ట్ అందిస్తుందా లేక దర్శకత్వం కూడా తానే చేస్తుందా..? అన్న విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ధనుష్ కూడా ఇప్పట్లో సౌందర్యకు డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్లు చేతిలో ఉన్న ధనుష్, ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ హీరోగా ప్రభు సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొడరి రిలీజ్కు రెడీ అవుతోంది. -
రజనీ కూతురుపై అమితాబ్ ప్రశంసల వర్షం!
'కొచ్చడయాన్' దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య అశ్విన్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా సాధికారతకు సౌందర్య నిదర్శనమని బిగ్ బీ వ్యాఖ్యలు చేశారు. భారత దేశపు తొలి మోషన్ క్యాప్చర్ ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ చిత్రాన్ని సౌందర్య అశ్విన్ తెరకెక్కించారు. నిజంగా భారత దేశం గర్వించదగిన విషయమని బిగ్ బీ అన్నారు. కొచ్చడయాన్ చిత్ర హిందీ ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం విడుదల చేయడం గర్వంగా ఉంది అని ఆయన అన్నారు. దేశంలో తొలి అత్యుత్తమ సాంకేతికత కలిగిన చిత్రాన్ని ఓ మహిళ ప్రయత్నించి, సఫలం కావడం తనకు గర్వంగా ఉందన్నారు. తన కూతురిపై విశ్వాసం ఉంచి, సపోర్ట్ చేయడం అభినందనీయమని అమితాబ్ అన్నారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆదీ పినిశెట్టి, నాజర్, రుక్మిణి లు ప్రాధాన పాత్రలో నటించారు. -
రజనీ స్టయిల్కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్ఖాన్
‘‘నేను రజనీకాంత్కి వీరాభిమానిని. తెరపై రజనీ స్టయిల్ చూసి మెస్మరైజ్ అయిపోయా. ఇరవై ఏళ్ళక్రితం ఓ షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వచ్చినప్పుడు సిగరెట్ కాల్చే స్టయిల్ స్వయంగా చూశాను. ఆయనలా స్టయిల్గా కాల్చాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను’’ అని షారుక్ఖాన్ చెప్పారు. రజనీకాంత్, దీపికా పదుకునే జంటగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కోచడయాన్’ (తెలుగులో విక్రమసింహా). ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం చెన్నైలో షారుక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ- ‘నాకు రాజుల కథలంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. ఆ తరహా కథతో సినిమా చేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. నా అభిమానులని కచ్చితంగా అలరించే సినిమా ఇది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకునే, ఏఆర్రెహమాన్, బాలచందర్, శంకర్, శరత్కుమార్, వెరముత్తు, కేయస్ రవికుమార్, ఆది పినిశెట్టి, నాజర్, రసూల్, సౌందర్య, ఏవీయమ్ శరవణన్ తదితరులు పాల్గొన్నారు.