breaking news
Kingfisher company
-
మాల్యా ఒక మర్డరర్..!!
సాక్షి, న్యూఢిల్లీ : జీతాలు చెల్లించకుండా హింసపెట్టిన విజయ్ మాల్యాపై కింగ్ఫిషర్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సకాలంలో జీతాలు చెల్లించక ఇబ్బంది పెట్టడం లండన్లో నేరంగా పరిగణిస్తారనీ, ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగిందని అంటున్నారు. నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయిన ఒక ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. మాల్యాను ఈ కారణంతోనైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహరాల మంత్రి సుష్మాస్వరాజ్కు బహిరంగ లేఖ రాశారు. నేరస్తుడు, ఎగవేతదారుడైన విజయ్ మాల్యాను వెంటనే విదేశాల నుంచి రప్పించి నేర విచారణ చేపట్టాలని కోరారు. ‘మీ విదేశాంగ విధానాలు బాగానే ఉన్నాయి. మీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంద’ని మోదీ పాలనపై వారు ప్రశంసలు కురిపించారు. అయితే మాల్యా లాంటి చీడ పురుగులతో దేశానికీ, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. వేల కోట్ల రూపాయల ఎగవేతలకు పాల్పడ్డ మాల్యా వల్ల తమ బతుకులు బజారున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనక బడా నేతలున్నానీ, బ్యాంకులు అరిచి గీపెట్టినా 5 శాతానికి మించి తన నుంచి రాబట్టలేరని మాల్యా ఒక కంపెనీ సమావేశంలో చెప్పినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇంతటి భారీ కుంభకోణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంలో వ్యవస్థ విఫలమవడం శోచనీయమన్నారు. వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెడుతున్న వారిని వదిలిపెట్టి ఉద్యోగాలు చేసుకునే వారిపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టడం సబబు కాదని అన్నారు. జీతాలు రాక సతమతమవుతున్న తమకు ఇన్కం ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయని వాపోయారు. కాగా, బ్యాంకు రుణాల పేరుతో మాల్యాకు చెందిన లిక్కర్ సంస్థల నుంచి విదేశాల్లో పెట్టుబడులకు, ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోళ్లకు 3700 కోట్లు మళ్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం కేసు నమోదు చేసింది. ఆ మరునాడే ఈ లేఖ వెలువడడం గమనార్హం. -
కింగ్ఫిషర్ వల్లే చెడ్డపేరు
కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు విజయనగరం: కింగ్ఫిషర్ సంస్థ వల్లే విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు చెప్పారు. విజయనగరంలో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కింగ్ఫిషర్ సంస్థ పన్నులు కట్టకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. సీమాంధ్ర లో విమానయాన అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఉన్న విమానాశ్రాయాల అభివృద్ధికి కృషిచేస్తామని, పాతవి తొలగించే ఆలోచన లేదని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యే క హోదా కల్పించాలని కోరుతున్నామన్నారు. యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, దాన్ని 15 ఏళ్లకు పొడిగించాలని తమపార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. బంధుప్రీతిపై మంత్రి గరం! న్యూఢిల్లీ: విమానయూన రంగంలో.. ఆ రంగానికి చెందిన పలువురు అధికారుల బంధువుల ఉద్యోగితపై మంత్రి అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎరుుర్ ఇండియూ, భారత విమానాశ్రయూల సంస్థ (ఏఏఐ) పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, విమానాశ్రయూల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ), ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బంధువుల వివరాలను తెలియజేయూల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.