breaking news
KHANDAVALLI
-
Haimanti Sen: అ అంటే ఆకాశ బడి
అ అంటే అమ్మ. కాని అమ్మ పనికి పోతుంది. ఆ అంటే ఆకలి. నాన్న పనికి వెళ్లమంటాడు. చదువు ఇప్పటికీ కొందరికి అందదు. అక్షరాలు, పుస్తకాలు, క్లాస్రూములు చూడకుండా వాళ్లు పెద్దవాళ్లై మురికివాడలకు పరిమితమవుతారు. ‘వెర్రి కోరికే కావచ్చు. కాని నా ప్రయత్నం నేను చేస్తాను’ అనుకుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం ముంబైలో ‘జునూన్’ (వెర్రి కోరిక) అనే సంస్థ స్థాపించి వారికి ‘స్కైవాక్’ల మీద అక్షరాలు నేర్పే పని చేస్తోంది. ఒక రకంగా ఆమె నడుపుతున్నది ఆకాశబడులు. ముంబైలో పాదచారుల కోసం స్కైవాక్లు ఏర్పాటు చేయడం హైమంతి సేన్కు మేలు చేసింది. స్కూల్ కోసం బిల్డింగ్ను అద్దెకు తీసుకోవడం, బల్లలు పెట్టడం, లైట్లు వెలిగించడం లాంటి ఖర్చులేమీ పెట్టే అవసరం లేకపోయింది. నాలుగు చాపలు పట్టుకుని వెళ్లి, వస్తూ పోతున్న వారిని పట్టించుకోకుండా ఒక వైపుగా పరిస్తే, రెయిలింగ్కి నాలుగు చార్టులు బిగిస్తే అదే బడి. అలాంటి బడే వీధిపిల్లలను ఆకర్షిస్తుంది అని భావించిందామె. గత రెండేళ్లుగా ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది కూడా. ముంబై కండీవాలి రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న స్కైవాక్ మీదకు వెళితే ఏ పని దినాల్లోనైనా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూలు నడుస్తూ కనిపిస్తుంది. స్కూల్ అంటే ఒకటి రెండు చాపలు పరువగా ఐదు పది మంది వీధి బాలలు కూచోగా నడిచే స్కూలు. ఇలాంటి స్కూళ్లు ముంబైలోని స్కైవాక్ల మీద హైమంతి ఆధ్వర్యంలో ఇప్పుడు నాలుగు నడుస్తున్నాయి. రోజూ ‘జునూన్’ తరఫున వాలంటీర్లు ఈ స్కూళ్లు నడుపుతారు. వీధి బాలలు వాటిలో చదువుకుంటారు. ఇలా నడుస్తున్న స్కూళ్లు ఇవే కావచ్చు. ‘నేను కొన్నాళ్లు టీచర్గా, పర్సనాల్టీ డెవలప్మెంట్ కౌన్సిలర్గా పని చేశాను. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కనిపించలేదు. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్డు మీద ఏవో కొన్ని చిల్లర వస్తువులు అమ్మే బాలలు, భిక్షాటన చేసే బాలలు కనిపించేవారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. కాని ఆ చట్టం వచ్చాక కూడా చాలామంది పిల్లలకు చదువు అబ్బడం లేదు. అందరం సమస్యను గమనిస్తూ ఉంటాం. కాని దాని పరిష్కారానికి ఎంతో కొంత పని చేయడం అవసరం. నేను ఆ పని చేయాలనుకున్నాను’ అంటుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం పని చేయాలి అని 2018లో అనుకున్నాక మురికివాడల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లోకి వెళ్లి అక్కడి హెడ్మాస్టర్లతో మాట్లాడింది ఆమె. ‘ఆ పిల్లలతో వేగలేము. వాళ్లు సరిగ్గా స్కూళ్లకు రారు. వచ్చినా సాటి పిల్లలను చెడగొడతారు. యూనిఫామ్లు పుస్తకాలు తీసుకెళ్లి పత్తా ఉండరు.’ అని వారు చెప్పారు. అదొక్కటే కాదు... ఆరేడేళ్ల వయసు వచ్చాక కూడా స్కూల్కు పంపకపోవడం వల్ల ఆ వయసు పిల్లలను నేరుగా రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో వేయడం సమస్య అవుతోంది. ఆ క్లాసును వాళ్లు అందుకోలేరు. చిన్న క్లాసులో కూచోలేరు. ‘ఇవన్నీ చూశాక ఆ పిల్లలను చదివించి బ్రిడ్జ్ కోర్స్లాంటిది చేయించి నేరుగా స్కూళ్లలో చేర్పించాలి అనుకున్నాను’ అంది హైమంతి. ముందు ఆమె ఏదైనా స్థలం వెతికి ఆ పని చేయాలనుకుంది కాని పిల్లలను ఆకర్షించాలంటే వాళ్లు స్వేచ్ఛగా నేర్చుకుంటున్నాము అనుకోవాలంటే స్కైవాక్లే సరైనవి అనుకుంది. ‘అయితే పిల్లలను పట్టుకురావడం అంత సులభం కాదు. మురికివాడల్లోని తల్లిదండ్రులు వారి చేత పని చేయిద్దామనుకుంటారు. వారిని ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది’ అందామె. ఈ రెండేళ్లలో దాదాపు 35 కుటుంబాల పిల్లలు ముంబైలోని నాలుగు స్కైవాక్ స్కూళ్లలో చదువుకున్నారు. ‘ఉషిక అనే అమ్మాయి మా బడి చూశాక వాళ్ల అమ్మా నాన్న మీద పెద్ద యుద్ధం చేసి మా దగ్గర చదువుకుంది. ఈ సంవత్సరం స్కూల్లో చేరనుంది. ఇంతకు మునుపు మట్టిలో ఆడుకుంటూ మురిగ్గా ఉండే తమ పిల్లలు ఇప్పుడు అక్షరాలు చదవడం చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఉషిక చదువుకోవడం మొదలెట్టాక మా సహాయంతో ఆమె తల్లిదండ్రులు ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అంది హైమంతి. స్కైవాక్ల మీద వచ్చే పోయేవారిలో ఈ పిల్లల పట్ల ఇలాంటి పిల్లల పట్ల సానుభూతి ఏర్పడి సాయానికి ముందుకు రావాలని కూడా హైమంతి ఆలోచన. హైమంతి చేస్తున్న పని చాలా ప్రశంసలకే పాత్రమైంది. కాని ‘ఈ పిల్లలు ఏం చేసినా బాగుపడరు’ అనే నిరాశ కూడా వ్యక్తమైంది. కాని హైమంతితో కలిసి నడిచే వాలంటీర్లు వస్తున్నారు. పిల్లలను వెతికి వెతికి వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు చెబుతున్నారు. వారి చేతికి అక్షరాలు అనే దారి దీపాలు ఇవ్వడానికి చూస్తున్నారు. నగరాల్లో ఇలాంటి పిల్లలను వెతికి ఈ పని చేసే ఇలాంటి వారు మరింత మంది ఉంటే బాగుణ్ణు. -
బామ్మకు టోకరా
ఖండవల్లి (పెరవలి) : మనవడు ఇచ్చిన సొమ్ము బ్యాంకులో వేద్దామని వచ్చిన ఓ బామ్మకు సినీఫక్కీలో మస్కా కొట్టి ఓ దొంగ సొమ్ముతో ఉడాయించిన ఘటన పెరవలి మండలం ఖండవల్లి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మూరి లక్ష్మమ్మ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి ఈ బామ్మ వద్దకు వచ్చి ‘నేనూ బ్యాంకులోనే పనిచేస్తున్నాను.. ఫారం రాసి ఇస్తాను..’ అని చెప్పి ఒక ఫారం రాసి ఇచ్చాడు. ఆ వృద్ధురాలు అదే నిజమని నమ్మి నగదు తీసి లెక్కిస్తుండగా ‘నేను లెక్కపెడతాను.. ముందు బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురా’ అని చెప్పి బామ్మ వద్ద నుంచి రూ.60 వేలు తీసుకుని ఆమెను బయటకు పంపించేశాడు. ఆమె అలా వెళ్లగానే ఇచ్చిన సొమ్ముతో ఉడాయించాడు. జిరాక్స్ కాపీతో బ్యాంకు లోపలికి వచ్చిన బామ్మ ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించకపోయే సరికి జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంది. బ్యాంకులోని వారంతా విషయాన్ని గ్రహించి చుట్టుపక్కల గాలించినా దొంగ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానా స్థలానికి పెరవలి ఎస్సై పి.నాగరాజు చేరుకుని బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించారు. దొంగను పట్టుకోవటానికి ప్రత్యేక టీమ్ను పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ఖండవల్లిలో భారీ చోరీ
ఖండవల్లి(పెరవలి): తల్లి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉండగా కార్యక్రమం కోసం తీసుకోచ్చిన సొమ్ము ఇంట్లో పెడితే దానిని దొంగలు అపహరించుకోవటంతో ఆకుటుంభం కన్నీరు మున్నీరుగా విలపించారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో పేరూరి సత్యనారాయణ ఇంట్లో సోమవారం రాత్రి జరిగిన చోరీలో 30కాసులు బంగారం రూ.25 వేలు నగదు అపహరణకు గురైయ్యింది. కన్నతల్లి రుణం తీర్చుకోవటం కోసం కార్యక్రమానికి తీసుకు వచ్చిన నగదు దొంగలు పట్టుకుపోవటంతో ఏమ చెయ్యాలో తెలియక కన్నీటి పర్యంతం అయ్యారు. వారం రోజుల క్రితం కన్నతల్లి కానిరాని లోకాలకు వెళ్ళిపోవటంతో ఇల్లంతా చుట్టాలతో ఉన్నారు. తల్లి ఇంట్లో చనిపోవటంతో ఇంట్లో ఉండకూదన్నారని ప్రక్కనే ఉన్న ఇంట్లో నివశిస్తున్నారు. సోమవారం అప్పుచేసి తెచ్చిన సొమ్ము ఇంట్లో బీరువాలో పెట్టి ప్రక్కనే ఉన్న ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంట్లోకి వెళ్ళేసరికి బీరువా తలుపులు తెరిచి వస్తువులు చిందర వందరగా పడిఉండటంతో దొంగతనం జరిగిందని ఊహించి వెంటనే స్దానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పెరవలి ఎస్ఐ పి నాగరాజు తన బందంతో హుటాహుటిన సంఘటనా స్దలానికి చేరుకుని విచారణ చేసారు. దొంగతనంలో రూ.25వేల నగదు, 30 కాసుల బంగారం పోయిందని సత్యనారాయణ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయటంతో కేసును నమోదు చేసారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే ఈ ఇంటి ఆనుపాను తెలిసిన వారే చేసారని అనుకుంటున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో నగదు పెట్టి రాత్రి 11 గంటలకు ప్రక్కనే ఉన్న ఇంట్లో నిద్రకు ఉపకరించామని దీనితో ఆతరువాత దొంగతనం జరిగి ఉంటుందని తెలిపారు. దొంగలు ఎటువంటి చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించటానికి కిటికీ నుండి ఊచతో తలుపులు గొనెం తీసారని దీనితో ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బీరువా బద్దలు కొట్టి అందులో ఉండే నగదు, నగలు పట్టుకుని వెళ్ళారు. పెరవలి పోలీసులు రంగ ప్రవేశం చేసాక, ఎవ్వరీనీ గదిలోకి రాకుండా నిలుపుదల చేసి ఏలూరు నుండి వచ్చిన ప్రత్యేక క్లూస్ టీమ్ వేలిముద్రలు చేకరించారు. తణుకు సిఐ చింతా రాంబాబు సంఘటన స్దలానికి వచ్చి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.