breaking news
Kerala Governor Sathasivam
-
'త్వరలోనే జయమ్మ పగ్గాలందుకుంటుంది'
-
'త్వరలోనే జయమ్మ పగ్గాలందుకుంటుంది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారని కేరళ గవర్నర్ పీ సదాశివం అన్నారు. వైద్య చికిత్సలకు జయ స్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో జయలలితను చూసేందుకు ప్రముఖులు ఆస్పత్రికి తరలి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెను చూసేందుకు లోపలికి అనుమతించని వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని మాత్రం విజిటర్లు వివరించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆ రాష్ట్ర గవర్నర్ సదాశివం ఆస్పత్రికి జయలలితను పరామర్శించేందుకు వచ్చారు. 'వైద్య చికిత్సలకు జయలలిత స్పందిస్తున్నారని మాకు వైద్యులంతా తెలిపారు. ఆమె త్వరలోనే డిశ్చార్జి అవుతుంది కూడా. అంతేకాదు.. అతి త్వరలోనే ఆమె పాలనా పగ్గాలు కూడా చేపడుతుంది' అని గవర్నర్ సదాశివం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని మొత్తం కేరళ ప్రజలంతా కోరుకుంటున్నారని, తాము ఆశించినట్లే ఆస్పత్రికి వచ్చి వైద్యుల నుంచి శుభవార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉందని, వైద్యులు చాలా ఆత్మవిశ్వాసంతో ఆమె త్వరలోనే కోలుకుంటుందని చెప్పారని వివరించారు.