breaking news
Kanha Shanti Vanam
-
ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం..
చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోనున్న మొక్క జాతుల నర్సరీ ఇది.. ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతి వనం.. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట, ఒకే సారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకూ ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ప్రాధాన్యతను గర్తించాలి..ఈ నేపథ్యంలో కన్హా శాంతి వనం గురించిన మరిన్ని విశేషాలు.. కన్హా శాంతి ఆశ్రమం పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం. సరళమైన జీవనానికి డెస్టినేషన్గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్తో పాటు ఆధ్యాతి్మక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్నెస్ సెంటర్, ఆయుర్వేద, నేచురోపతి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషనకేంద్రం నిర్మాణంలోనే ఓ ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్ ఫ్లోర్ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం, అన్నీ ఉచితంగా అందజేస్తారు. వివిధ దేశాల నుంచి.. ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించడం, రీ ట్రీట్ ప్రొగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచి్చన వారు ఇక్కడి మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములవుతున్నారు.ప్రముఖులు సైతం.. రెండేళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోటా నానుతోంది.. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు కన్హా శాంతి వనం సొంతం కావడంతో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. పోస్టల్ పిన్ కోడ్ ఆధారిత సేవలు.. హార్ట్ఫుల్గా మెడిటేషన్లో శిక్షణ తీసుకోవాలనుకునే సులువైన పద్ధతిలో శిక్షకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ వెబ్సైట్లో తపాలా శాఖ పిన్కోడ్ నమోదు చేయగానే అక్కడ ఉండే శిక్షకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా కన్హా శాంతి వనంలో వారంలో రెండు బ్యాచ్లకు మెడిటేషన్ శిక్షణ పొందవచ్చు.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. కన్హా శాంతి వనం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్కు అద్దం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుత కన్హా వనం ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం నెర్రెలు వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు ఈ వనంలో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాకుండా చుట్టూ కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్, మొక్కలు, రన్నింగ్ వాటర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇలా చేరుకోవచ్చు.. నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్గంజ్, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సరీ్వసులు నడిపిస్తోంది. సొంత వాహనాల్లో రావాలనుకునే వాళ్లు హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్ వద్ద చేగూరు రోడ్డుకు తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు. మొదటి సారి వచ్చాను.. నా మిత్రులు శాంతి వనానికి పోదామన్నారు. ఇక్కడి వాతావరణం, మెడిటేషన్ కేంద్రం, అన్నీ బాగున్నాయి. వనంలో వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉచిత వాహనం ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, నాగోల్ట్రైనర్గా 24 ఏళ్ల నుంచి.. కనీసం మూడు రోజులు మెడిటేషన్ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె, మెదడు రెండూ కలసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు. గత 24 ఏళ్లుగా మెడిటేషన్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. బెంగళూరులో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ ఇస్తుంటాను. ఆన్లైన్లోనూ తరగతులు చెబుతాను. – సునీతా ప్రసాద్, మెడిటేషన్ ట్రైనర్ఇది సెక్యులర్ సిటీ.. కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. హైదరాబాద్ సెక్యులర్ సిటీ. సందర్శకుల్లో అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తున్నాం. కేవలం రూ.10లకు భోజనం లభిస్తుంది. మూడు స్టార్ హోటల్స్ లోనూ భోజనం చేయవచ్చు. – కరుణాకర్, కన్హా శాంతివనం కో–ఆర్డినేటర్ -
కన్హా శాంతివనం రాష్ట్రానికే గర్వకారణం
నందిగామ: తెలంగాణలో కన్హా శాంతివనం ఏర్పాటు కావడం రాష్ట్రానికే గర్వకారణమని ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పరిధిలోని కన్హా శాంతి వనాన్ని ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, సీఎం సలహా దారు వేం నరేందర్రెడ్డితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు, కన్హా శాంతివనం గురూజీ కమ్లేశ్ డి.పటేల్ (దాజీ)ని కలసి శాంతివనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్పై సీఎం ఆరా తీశారు. కళ్లకు గంతలు కట్టుకొని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి నైపుణ్యాలను పిల్లలు ప్రదర్శించడం చూసి ఆయన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఎంతో మంది తమ జీవితాలను మెరుగుపరచుకోవడంలో దాజీ మార్గదర్శకత్వం గొప్ప విషయమని అన్నారు. తర్వాత శాంతివనంలోని మెడిటేషన్ హాల్ సమీపంలో ముఖ్యమంత్రి మొక్కను నాటారు. దాజీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాంతివనాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు. -
యుగానికి అత్యుత్తమ మార్గం క్రియాయోగం: స్వామి చిదానందగిరి
హైదరాబాద్: నిరంతరం దైవంతో ఉండడమే నిజమైన సఫలతకు మార్గమని, నిద్రించే ముందు భగవంతుణ్ణి ధ్యానించాలని, తెల్లవారుజామున దైవ సన్నిధిలోనే మేల్కొని, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని యోగదా సత్సంగ సొసైటీ/ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానందగిరి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కన్హా శాంతి వనంలో జరిగిన ఐదు రోజుల సంగం కార్యక్రమాల ముగింపు సమావేశంలో వేలాదిమంది భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కేవలం తర్కం మీదే ఆధారపడితే అజ్ఞానంలో కూరుకుపోతామని, తర్కాన్ని ఉపయోగించి, ఈ అవిద్య, మాయ నుంచి పూర్తిగా బయటపడటం కష్టమని, అంతకంటే ఉన్నతమైనదీ, శక్తిమంతమైన ఆయుధం అవసరమని స్వామి చిదానంద గిరి సూచించారు. క్రియాయోగం అత్యున్నతంగా ప్రక్షాళన చేసే శక్తులలో ఒకటని, ఆది తామసిక లక్షణాలనుంచి స్వేచ్ఛను కలిగించి సాత్విక లక్షణాలను పెంపొందిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు. క్రియా యోగ సాధన వల్ల సాత్వికమైన మెదడు, సాత్వికమైన హృదయం, సాత్వికమైన నాడీమండల వ్యవస్థ అనే మూడు ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఈ మూడూ సాధించిన వ్యక్తి దృఢ సంకల్పంతో, దయార్ద్ర హృదయంతో తనకూ, సమాజానికి మంచిని చేకూర్చే నిర్ణయాలు తీసుకుని పనిచేస్తాడని, ఇలా ఉన్నతంగా మారిన వ్యక్తుల ద్వారానే ప్రపంచం మరింత మార్పు చెంది సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని ఆయన సందేశమిచ్చారు. క్రియా యోగ గురు పరంపరలోని మహాగురువులు, వారి దయా హస్తాలతో రక్షణ హామీ ఇస్తున్నారని, వారి బోధనలు అనుసరించి, వారిని ప్రార్ధిస్తే ఆత్మ సాక్షాత్కారం తథ్యమని, తద్వారా సాధకుడికి శాంతి, జ్ఞానo, ఆనందం లభిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదని స్వామి చిదానందగిరి చెప్పారు. ధ్యానం ద్వారా ఆత్మాలయం అనే ఆంతరిక దేవాలయంలో ఆత్మ పరమాత్మతో అనుసంధానం చెందినప్పుడు ఆత్మశక్తులన్నీ జాగృతమవువుతాయని స్వామి చిదానందగిరి చెప్పారు. ప్రతి ఒక్కరూ భగవంతునికి ప్రియతములేనని సందేహించకుండా, క్రమం తప్పకుండా క్రియ ధ్యానం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త వై. ఎస్. ఎస్. / ఎస్. అర్. ఎఫ్. భక్త సమూహ ప్రతినిధులుగా నలుగురు భక్తులు వేదికపైకిఎక్కి స్వామి చిదానంద గిరికి పుష్ప గుచ్చాలు సమర్పించారు. క్రియ యోగ పాఠాలు కోరుకునేవారు https://yssofindia.org/te/lessons-programmes లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సమన్వయకర్త నారాయణ రావు (9666665328) తెలిపారు. మరిన్ని వివరాలకోసం రాంచి హెల్ప్ డెస్క్ నెంబర్ కు (0651) 6655 555 ఫోన్ చేయవచ్చని ఆయన సూచించారు.