-
హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్, గోల్ఫర్ ట్వెసాకు 15 లక్షల చెక్
Kakinada Sea Ports Limited Sponsorship: హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ప్రణవిచంద్ర, గోల్ఫర్ ట్వెసా మలిక్లకు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు కాకినాడ సీపోర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యదర్శి విభా జైన్ ఈ ఇద్దరు క్రీడాకారిణులకు చెరో రూ. 15 లక్షల చెక్లు అందించగా... తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! -
కుప్పకూలిన భారీ క్రేన్లు,ఒకరు మృతి
-
కుప్పకూలిన భారీ క్రేన్లు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ సీపోర్టు లిమిటెడ్ (కేఎస్పీఎల్)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆరో నెంబర్ బెర్త్లో రెండు భారీ క్రేన్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది క్రేన్ల కింద చిక్కుకున్నారు. సమాచారం ఆందుకున్న పోర్టు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరువాసిగా గుర్తించారు. పాత క్రేయిన్ రిపేరు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రేన్ల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసింది. -
కాకినాడ డీప్వాటర్ పోర్టు విస్తరణ
రూ.1000 కోట్ల ప్రణాళిక సాక్షి, కాకినాడ : కాకినాడ డీప్వాటర్ పోర్టును రూ.1000 కోట్లతో విస్తరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాలను కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్ (కేఎస్పీఎల్) సీఈఓ ఎ. శేషగిరిరావు అందుకున్నారని శనివారం పోర్టు వర్గాలు తెలిపాయి. డీప్వాటర్ పోర్టు విస్తరణకు తొలి ప్రాధాన్యంగా బెర్త్లను పెంచుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆరు బెర్త్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఏడో బెర్త్ నిర్మాణాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాదికి మరో బెర్త్ నిర్మించాలనుకుంటున్నారు. పోర్టుకు అనుసంధానంగా ఓడల రాకపోకలను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా చానల్ను డ్రెడ్జింగ్ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చానల్ 15 మీటర్ల లోతులో ఉంది. వాస్తవానికి చానల్ లోతు 16 మీటర్లు ఉండాలి. ఒక మీటరు మేర పూడుకుపోవడంతో భారీ ఓడలు పోర్టుకు రావడానికి వీలుపడటం లేదు. ఈ కారణంగా 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో మాత్రమే రవాణా చేయగలుగుతున్నారు. మరో మీటర్ లోతు పెరిగేలా చానల్ను డ్రెడ్జింగ్ చేస్తే 80 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఓడలు కూడా పోర్టుకు సునాయాసంగా చేరుకుంటాయని అంచనా వేశారు. తొలిసారి కంటైనర్ ట్రాఫిక్ విస్తరణలో భాగంగా తొలిసారి కాకినాడ డీప్వాటర్పోర్టు నుంచి కంటైనర్ ట్రాఫిక్ను ప్రవేశపెట్టాలని కేఎస్పీఎల్ నిర్ణయించింది. ఇంతవరకు విశాఖపట్నం పోర్టు నుంచి మాత్రమే కంటైనర్ ట్రాఫిక్ నడుస్తోంది. ప్రస్తుతం డీప్వాటర్ పోర్టు నుంచి ఎడిబుల్ ఆయిల్స్, ఐరన్ ఓర్, ఎరువులు రవాణా అవుతున్నాయి. కంటైనర్ ట్రాఫిక్ ప్రవేశపెట్టడం ద్వారా రొయ్యలు, చేపలు, పువ్వుల వంటివి విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రణాళిక. ఇందుకోసం వెయ్యి నుంచి 2 వేల వరకు రిఫ్రిజిరేటర్తో కూడిన కంటైనర్లను, ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు క్రేన్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. వచ్చే ఏడాదికల్లా విస్తరణ పనులు దాదాపు పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం కాకినాడ డీప్వాటర్ పోర్టు నుంచి 18 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తున్నారు. విస్తరణ పూర్తి చేసి 25 మిలియన్ మెట్రిక్టన్నుల కార్గో రవాణా చేసే సామర్థ్యానికి చేరుకోవాలని పోర్టు ఏర్పాట్లు చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement