breaking news
jwala narasimha rao
-
అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
పెళ్లంటె ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర ‘స్నాతకం’ అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. ‘సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... ‘వరుడికి శుభం కలుగుగాక’ అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది. వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తయిదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో! వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
పదవులకే వన్నెతెచ్చిన పీవీఆర్కే ప్రసాద్
హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మీడియా సలహాదారుగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, డాక్టర్ ఎంసీఆర్ మానవ వనరుల అభివద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా ఐఏఎస్ అధికారిగా పీవీఆర్కే ప్రసాద్ ఎనలేని సేవలు చేశారు. ఆయన ఎప్పుడు, ఏ విభాగంలో పనిచేసినా ఆ విభాగం అభివద్ధికి అంకిత భావంతో అవిశ్రాంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన మానవ వనరుల అభివద్ధి డైరెక్టర్ జనరల్గా అందించిన సేవలు మరువలేనివి. మకుటాయమానమైనవి. 1988లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఈ విభాగం అధిపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి అత్యున్నత ప్రభుత్వోద్యోగి వరకు రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగుల పనితీరును విశ్లేషించి, వారికి ఎప్పటికప్పుడు వివిధ విభాగాల్లో అవసరమైన శిక్షణ ఇవ్వడం, వారిని వత్తిలో రాణించేలా తీర్చిదిద్దడం డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ పని. ఈ సంస్థ పనులు కుంటినడక నడుస్తుండడంతో చంద్రబాబు సూచన మేరకు నేను మరో విభాగంలో పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్ను కలుసుకున్నాను. హెచ్ఆర్డీ విభాగం పనులు, విధి విధానాల గురించి నేను ఆయనకు విడమర్చి చెబుతున్నాను. అంతలోనే బాబు నుంచి 15 నిమిషాల్లో వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా ఫోన్ వచ్చింది. నేను ఈలోగా గబాగబా హెచ్చార్డీ విభాగం గురించి తెల్సిన మేరకు ఆయనకు వివరించారు. ఆ తర్వాత ఇద్దరం కలసి సీఎం చంద్ర బాబు వద్దకు వెళ్లాము. హెచ్చార్డీ విభాగం గురించి ఏం తెలుసునని ఆయన్ని బాబు ప్రశ్నించారు. ఆ విభాగం మీద మూడేళ్ల అనుభవం ఉన్నట్లు ప్రసాద్ గారు ముచ్చటగా వివరించారు. వెంటనే ఆయన్ని ఆ విభాగానికి డైరెక్టర్ జనరల్గా బాబు నియమించారు. హెచ్చార్డీ కార్యాలయం జూబ్లీ హిల్స్లోని 25వ నెంబర్ రోడ్డులో ఉన్నప్పటికీ ఎలాంటి అందులో ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ముందుగా కార్యాలయాన్ని అభివద్ధి చేశారు. ఇప్పుడు అందులో ఉన్న సదుపాయాల్లో 90 శాతం ఆయన ఏర్పాటు చేసినవి. కార్యాలయంలో ఏ మూల చూసిన ఆయన ప్రత్యేక ముద్రే నేటికి కనిపిస్తుంది. ప్రసాద్ గారు హెచ్చార్డీ ఆధ్వర్యంలో ‘స్టేట్ ట్రేనింగ్ ఇన్సియేటివ్’ కార్యక్రమం కింద ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ వచ్చారు. అదే కార్యాలయంలో సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)ని ప్రసాద్ ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి ఇంగ్లండ్ ప్రధాన మంత్రి టోని బ్లెయిర్ ఇక్కడికి వచ్చి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కేంద్రం లక్ష్యాలను ఆయన ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోని కూడా టోని బ్లెయిర్ చాలాసేపు చర్చించారు. అలాగే ప్రసాద్, అంతర్జాతీయ కార్మిక సంఘం, వీవీ గిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్తో కలసి రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాను హెచ్చార్డీ బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల కాలంలోనే సంస్థకు ‘ఐఎస్ఓ 9007 2000’ సర్టిఫికెట్ సాధించి పెట్టారు. ఉన్నత ప్రమాణాలను సూచించే ఈ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో ఓ రాష్ట్ర సంస్థకు రావడం బహూశా అదే మొదటి సారి కావచ్చు. అంతటి మహానుభావుడు నేడు మన మధ్యలో లేరని చెప్పడానికి విచారిస్తున్నాను. ఆయన ఆగస్టు 21, అంటే సోమవారం పరమపదించారు. ఆయన తెలుగులో పలు మంచి పుస్తకాలు కూడా రచించారు. నహం కర్త, అసలేం జరిగిందంటే, తిరుమల లీలామతం, తిరుమల చరిత్రామతం పాఠకులను ఆకట్టుకున్నాయి. -- వనం జ్వాలా నరసింహారావు