breaking news
Justice Dalveer Bhandari
-
బిగ్ హైడ్రామా... ఐసీజే జడ్జిగా మరోసారి భండారి
వాషింగ్టన్ : అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా భారత్కు చెందిన దల్వీర్ భండారి మరో పర్యాయం ఎన్నికయ్యారు. బ్రిటన్ తరపు అభ్యర్థి క్రిస్టొఫర్ గ్రీన్వర్డ్ వెనక్కి తగ్గటం.. భండారికి అత్యధిక ఓట్లు పోలు కావటంతో ఆయన ఎన్నికైనట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సోమవారం నిర్వహించిన సమావేశంలో సాధారణ అసెంబ్లీలోని మొత్తం 193 ఓట్లకు గానూ 183 ఓట్లకు దక్కించుకున్న ఆయన.. భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లు దక్కించుకోవటం విశేషం. అంతకు ముందు ఇరువురి మధ్య హోరాహోరీ పోటీతో హైడ్రామానే నడిచింది. తొలుత భండారీ(70)కి 193మంది ఐరాస సభ్య దేశాల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది మద్దతు లభించింది. తద్వారా గ్రీన్వర్డ్, భండారీ కన్నా 50ఓట్లు వెనుకంజలో ఉన్నట్లయ్యింది. అయితే భద్రతా మండలిలో భండారీకి ఐదు ఓట్లు రాగా, గ్రీన్వర్డ్కు 9ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఇరు సభలను సమావేశపరిచి ఓటింగ్ నిర్వహించాలని బ్రిటన్ పట్టుబట్టింది. 96 సంవత్సరాల క్రితం ఉపయోగించిన సంయుక్త సమావేశపు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. అయితే భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని దుర్వినియోగం చేయడానికి బ్రిటన్ ప్రయత్నిస్తోందని భారత దౌత్య వర్గాలు గట్టిగా తమ వాదనను వినిపించాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఇరు సభలు సమావేశమై వరుస రౌండ్లలో ఓటింగ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన బ్రిటన్ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. సోమవారం మధ్యాహ్నాం ఇరు సభలు సమావేశమై ఓటింగ్ నిర్వహించగా.. బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి భండారీకే మెజార్టీ ఓట్లు పల్ కావటంతో ఆయన ఎన్నికను ఖరారు చేస్తూ ప్రకటన వెలువరించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో 15మంది న్యాయమూర్తుల్లో మూడవ వంతు మంది ప్రతి మూడేళ్ళకోసారి ఎన్నికవుతారు. వీరి పదవీకాలం 9ఏళ్లపాటు వుంటుంది. గతంలో అమలైన పద్ధతి ప్రకారం అభ్యర్థికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మెజారిటీ వస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నికయ్యేవారు. ఐసిజె న్యాయమూర్తిగా ఎన్నికవ్వాలంటే అటు ఐరాస సాధారణ అసెంబ్లీలో.. ఇటు భద్రతా మండలిలో మెజారిటీ రావాల్సి ఉంటుంది. -
సమర్థ పాలనతో తక్కువ భారం
న్యాయవ్యవస్థపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సమర్థవంతమైన పరిపాలనతో న్యాయవ్యవస్థపై చాలా భారం తగ్గుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘మేం 1,200 చట్టాలను రద్దు చేశాం. న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. సమర్థ పాలన అంటే.. ముసాయిదా చట్టం తయా రీ నుంచి దాన్ని అమలు చేసే అధికారుల వరకు ఉన్న అనుసంధానమే’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పనిచేస్తున్న జస్టిస్ దల్వీర్ భండారీ రాసిన ‘జ్యడీషియల్ రిఫామ్స్– రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్’ పుస్తకాన్ని ప్రధాని బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ నేపథ్యంలో మార్పు దిశగా భారత్ వేగంగా పరుగులు పెట్టాలని, ప్రస్తుతం దేశంలో పలు రంగాల్లో చాలా సరళీకరణ ఉందని చెప్పారు. భారతీయులు చాలా సంప్రదాయవాదులని, అయితే మార్పులు వేగంగా వస్తాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తనకు నచ్చిందని అన్నారు. టెక్నాలజీతో వస్తున్న భారీ మార్పులను దృష్టిలో ఉంచుకుని, దేశం లోని న్యాయ విశ్వవిద్యాలయాలు అలాంటి ప్రతిభను అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జస్టిస్ ఖేహర్, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్కరణలకు తరుణమిదే: రాష్ట్రపతి కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. న్యాయ సంస్కరణలపై ప్రతి ఒక్కరూ ఆలోచించడానికే కాకుండా చర్యలు తీసుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల భారత న్యాయవ్యవస్థలో భారీ మార్పులు రావాలని, మార్పనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. తగినన్ని మౌలిక సదుపాయాలు లేకుండా సంస్కరణలను తీసుకురాలేమన్నారు. తన పదవీ కాలంలో దేశంలో అతిపెద్దదైన అలహాబాద్ హైకోర్టులో మొత్తం 180 జడ్జీల పోస్టులు ఉండగా అందులో సగం కంటే తక్కువ పోస్టులే భర్తీ అయ్యాయని అన్నారు. న్యాయవ్యవస్థను నిందించకూడదు: సీజేఐ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ మాట్లాడుతూ.. చాలా కేసులు పెండింగ్లో ఉన్నందుకు న్యాయవ్యవస్థను నిందించకూడదన్నారు. అందుకు బదులుగా ప్రభుత్వమే తాను వేసే వ్యాజ్యాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ‘కొన్ని విషయాల్లో కేసు వేయాలా వద్దా అని తేల్చుకోవడం ప్రభుత్వ విభాగాలకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ విషయాలు సంక్లిష్టమైనపుడు అధికారులెవరూ బాధ్యత తీసుకోడానికి ఇష్టపడక కోర్టులో కేసు వేస్తారు’అని అన్నారు. అయితే ఇక్కడ తాను ప్రభుత్వాన్ని నిందించడం లేదనీ, తన మాటలకు వక్రభాష్యం చెప్పవద్దని కోరారు. ప్రభుత్వ విభాగాలు వేసే కేసుల్లో 10% తగ్గినా, మిగతా కేసులను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.