breaking news
JioFiber service
-
జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే..
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ధరల్లో విప్లవత్మాక మార్పులు తీసుకువచ్చిన జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ సేవలను జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే జియో ఫైబర్ ప్రీ పెయిడ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఇంటర్నెట్ బాక్స్ను అందించనుంది. అంతేకాకుండా జీరో ఇన్స్టాలేషన్ ఛార్జీలు వర్తించనున్నాయి. జియో ఫైబర్ ప్రీ పెయిడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకోవడానికి కచ్చితంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. జియో పోస్ట్ పెయిడ్లో రూ.399 నుంచి టారిఫ్ ఫ్లాన్లు ప్రారంభం కానున్నాయి. ఆటో పేమెంట్ ఆప్షన్తో వినియోగదారులకు మరింత సులువు కానుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు రూ.1000 రిటర్నబుల్ సెక్యూరిటి డిపాజిట్తో 4K సెట్-టాప్ బాక్స్ను పొందవచ్చును. నెలకు రూ.999 ప్లాన్తో 15 ఓటీటీ యాప్స్ను అందిస్తుంది. చదవండి: జియో నుంచి అన్లిమిడెట్ డేటా ప్లాన్స్ -
జియో ఫైబర్ సేవలు దీపావళి నుంచే!
అన్ లిమిటెడ్ అంటూ వాయిస్, డేటా సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు సంబంధించి ఫైబర్ సేవల్లో ప్రవేశించి టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు పుట్టించనుంది. జియో పై సేవలపై ఇప్పటికే పలు అంచనాలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టెలికాం పరిశ్రమలో పలు టారిఫ్ సమీక్షలకు నాందిపలికిన జియో బ్రాడ్బ్యాండ్ విభాగం జియో ఫైబర్పై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఆఫర్తో ఈ దీపావళినాటికి జియో తన తన కొత్త 'జియోఫైబర్' అందజేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రూ.500 బేసిక్ ప్లాన్లో 100 జీబీ డేటాను అందించనుంది. ఆన్లైన్ రిపోర్టు ప్రకారం దీపావళి సీజన్ నాటికి వాణిజ్య సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందట. మీడియా నివేదికల ప్రకారం బ్రాడ్బ్యాండ్ ప్లాన్లలో జియో మీడియా షేర్ డివైస్, స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, రౌటర్లు ఇతర పవర్ లైన్ కమ్యూనికేషన్ డివైస్లతో తన సేవలను ప్రారంభించనుంది. రూ.500 ప్లాన్లో 600జీబీ డేటా సేవలు ప్రారంభంకానున్నాయి. 100ఎంబీపీఎస్ వేగంతో 1000జీబీ డేటాను అందించ నుంది. దీనికిగాను చందాదారులు ఒక నెలకి 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదించింది. మరోవైపు జియో ఎఫెక్ట్ తో బ్రాడ్బ్యాండ్ సేవల్లో వున్న టెలికాం మేజర్లు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలను అప్డేట్ చేస్తున్నాయి. కాగా ముంబయి, ఢిల్లీ-ఎన్సిఆర్, అహ్మదాబాద్, జామ్నగర్, సూరత్, వడోదరలోత మ బ్రాడ్బ్యాడ్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఇటీవల జియోఫైబర్ అధికారికంగా ప్రకటించింది. 'జియోఫైబర్' ఆఫర్ ద్వారా వినియోగదారులు మూడు నెలల అధిక-వేగవంతమైన ఇంటర్నెట్ను అందించనున్నామని తెలిపింది. అలాగే ల్యాండ్ లైన్ సర్వీసులను త్వరలోనే ప్రారంభించనుంది. అయితే ఈ వార్తలపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది.