నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
సత్తుపల్లి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఎం. జయవర్ధన్(3) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిపోయాడు. తల్లిదండ్రులు గమనించక పోవడంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.