-
జాన్ సే డైరెక్టర్ తో " చిట్ చాట్ "
-
జ్ఞానసాయికి అండగా మేముంటాం!
జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి ముందుకు వచ్చిన ప్రవాస భారతీయులు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, సీఐ ములకలచెరువు: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయికి వైద్యం చేయించడానికి అండగా మేముంటామంటూ గల్ఫ్దేశాల్లో స్థిరపడిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, దుబాయ్, అబుదాబీ, అలాగే లండన్ లో స్థిరపడిన ప్రవాస భారతీయులు పత్రికల్లో, టీవీల్లో ప్రసారమైన కథనాలకు భారీగా స్పందించారు. బాధితులతో నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి చిన్నారి తల్లి జే.సరస్వతి బ్యాంకు ఖాతాలో రూ.5,01,800 వరకు జమ చేశారు. చిన్నారి వైద్యం కోసం సహాయం చేసిన దాతలకు చిన్నారి కుటుంబ సభ్యులు పేరు పేరున చేతులెత్తి దండం పెట్టారు. శనివారం చిన్నారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించుకుని స్వగ్రామమైన ములకలచెరువు మండలం బత్తలాపురానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చిన్నారితో కుటుంబసభ్యులు స్వ గ్రామానికి చేరుకు న్నారని తెలుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్యాదవ్, సీఐ రుషికేశవ్, ఎంపీడీవో రాజగోపాల్, తహశీల్దార్ అమరేంద్రబాబు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మీ వెంట మేము ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బాధితులకు రూ. 25 వేలు, కేవీ.రమణ రూ. 5 వేలు, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల రూ.2,500 బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు. దాతల సహాయం, ప్రజాప్రతినిధుల పరామర్శతో చిన్నారి ప్రాణానికి కొండంత అండ దొరికిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు చెన్నైలో చిన్నారికి వైద్య పరీక్షలు చిన్నారి వైద్యానికి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం విదితమే. సోమవారం చిన్నారికి ఆపరేషన్ కోసం వైద్య పరీక్షలతో చికిత్స మొదలు పెట్టనున్నారు. చిన్నారి వైద్యానికి రూ. 25 లక్షల మేర ఖర్చు అవుతుందని పత్రికలో కథనాలు వెలువడ్డాయి. కథనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులుకు చిన్నారి కోలుకునే వరకు వైద్యం చేయించాలని ఆదేశించారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హెల్త్ కార్యదర్శి ఎంఎన్వీ ప్రసాద్ (ఐఏఎస్) అధికారిని చిన్నారి వైద్యం కోసం నియమించారు. ఈయన పర్యవేక్షణలో చిన్నారికి వైద్యసేవలు అందించనున్నట్లు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చిన్నారికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కోసం తమిళనాడు రాష్ట్రం చెన్నై గ్లోబల్ హాస్పిటల్కు రెఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement