breaking news
issak
-
తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్చేశారు. -
గిరిజనుడ్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో ఓ గిరిజన యువకుడిని మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించుకుపోయారు. సుమారు 100 మంది మావోయిస్టులు గ్రామానికి చేరుకుని పాస్టర్ కన్నయ్య కోసం ఆరా తీశారు. అతడు అందుబాటులో లేకపోవడంతో కన్నయ్య కుమారుడు ఊట్లే ఇస్సాక్ (18)ను తమ వెంట తీసుకుని వెళ్లారు. కన్నయ్య దొరికిన తర్వాత ఇస్సాక్ను విడిచిపెడతామని చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు.