breaking news
intedrmediate
-
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మిడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చేనెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి ఏడాదికి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు. 22 వరకు రీకౌంటింగ్ ఫీజు చెల్లింపు ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. అభ్యర్థులు నేటి నుంచి 22 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్కు రూ.1,300, రీ కౌంటింగ్కు రూ.260 ఫీజుగా పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. పేపర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా మొదటి లేదా రెండో ఏడాదికి రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సుకు రూ.165, బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్స్కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1,200, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్కు రూ.550, రెండేళ్ల బ్రిడ్జి కోర్సుకు రూ.330 చెల్లించాలి. ఇంప్రూవ్మెంట్కు... ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థులు రూ.600 ఫీజుతో పాటు ప్రతి పేపర్కు అదనంగా రూ.160 చెల్లించాలి. మార్కుల పెంపునకు (బెటర్మెంట్) రెండేళ్లకు కలిపి ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ విద్యార్థులు రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది. చదువుకునే సమయం ఏది? ఈ ఏడాది పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే విద్యా సంవత్సరం ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అదే పంధాను అనుసరిస్తోంది. విద్యార్థులు పూర్తిగా తేరుకోకుండానే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. సాధారణంగా ఈ పరీక్షలు మే చివరి వారంలో ప్రారంభమై జూన్ మొదటి వారంలో పూర్తి కావాల్సి ఉండగా, ఈసారి మే రెండో వారానికి మార్చారు. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు సరైన సమయం లేకపోవడం గమనార్హం. -
ఏపీ: ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
అమ్మాయిలే ఫస్ట్
కర్నూలు(విద్య), న్యూస్లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయభేరి మోగించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో మూడు నెలలు చదువుకు అంతరాయం కలిగినా మొక్కవోని దీక్షతో మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం అధికంగా 66.85 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. జిల్లాలో ఈ ఏడాది 30,341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,122 మంది ఉత్తర్ణులు కావడంతో రాష్ట్రంలో జిల్లాకు ఏడవ స్థానం దక్కింది. 61 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది బాలురు 16,751 మంది పరీక్ష రాయగా 10,374 మంది.. బాలికలు 13,590 మంది పరీక్ష రాయగా 9,748 మంది ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఓకేషనల్ కోర్సులో 2,794 మందికి గాను 1,936 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 7,023 మంది విద్యార్థుల్లో 4,556 మంది (65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,829 మందికి గాను 2,440 (63.72 శాతం), బాలికలు 3,194 మందికి గాను 2,116 (66.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో 1,822 మందికి గాను 972 మంది (53 శాతం) ఉత్తీర్ణులవగా.. బాలురు 470 (47.05 శాతం), బాలికలు 502 (61 శాతం) మంది ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. వొకేషనల్ ఎయిడెడ్ కాలేజీల్లో మొత్తం 259 మందికి గాను 175 మంది (68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ కాలేజీల్లో 1,480 మందికి గాను 1,217 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అన్ని విభాగాలు, బ్రాంచ్లు, మేనేజ్మెంట్లలో బాలుర కన్నా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులవడం విశేషం. సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబర్చాయి. సాధారణ విద్యార్థులతో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు మెరుగైన ఫలితాలు నమోదు చేసుకున్నాయి. పాములపాడు జూనియర్ కళాశాల 98.90 శాతం, కోసిగి 92.68 శాతం, గోనెగండ్ల కళాశాల 89.07 శాతం, కోయిలకుంట్ల 87.85 శాతం, బండిఆత్మకూరు కళాశాల 84.52 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీల్లో బేతంచర్లలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల 69.61 శాతం, కర్నూలులోని సెయింట్జోసఫ్స్ జూనియర్ కళాశాల 64.73 శాతం, చాగలమర్రిలోని ఎస్వీఎంవీఎస్ఆర్ కళాశాల 63.57 శాతం ఉత్తీర్ణత దక్కించుకున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల హవా ఇంటర్ ఫలితాల్లో మరోసారి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఆర్.మౌనిక, ఎ.హరీష్ 985, ఎం.నాగమహతి 983, బి.కావ్య 982 మార్కులు, బైపీసీలో ఆర్.కీర్తన 984, పి.ఫాతిమా 983, జి.దివ్య 982, జి.షైని ప్రియాంక 980 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో నారాయణ కళాశాలకు చెందిన ఎ.సుష్మిత 987, కె.వంశీకృష్ణ 986, జి.రాగశ్రీ, అప్షాన్ జబీన్షేక్ 985, పి.శ్రావ్య, జె.సుమశ్రీ, కె.సాగరిక 983, ఎం.శ్రీహర్ష 982, వై.సమీనాబాను, వి.సాయి ఐశ్వరయ్య, పి.అరవిందకుమార్రెడ్డి, కె.భారతి 981 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.జువేరియా 987, బి.సాయిస్నిగ్దారెడ్డి, నిలోఫర్ ఉన్నీసా 984, శ్రీనాథ్రెడ్డి 982, ఎం.సంహిత, ఎన్.తహ్మినదలియా 980 మార్కులతో ప్రతిభ కనబరిచారు. శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలకు చెందిన టి.చైత్ర ఎంపీసీలో 980 మార్కులు సాధించగా.. ఎంఈసీలో మాస్టర్స్ మైండ్స్ కళాశాల విద్యార్థిని ఎ.అనూష 981 మార్కులు దక్కించుకున్నారు. కర్నూలులోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిని ఎన్.మౌనిక 984 మార్కులు సాధించారు. 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు రూ.290, దరఖాస్తు రూ.10లతో కలిపి మొత్తం రూ.300 చెల్లించాలన్నారు. రీ వెరిఫికేషన్కు రూ.600, రీ కౌంటింగ్కు ప్రతి పేపర్కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు.