breaking news
insemination
-
ఇవీ నిబంధనలు!
కృత్రిమ గర్భధారణ కోసం ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్లడం లో కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇంకా ఉద్వేగపరమైన అంశాలూ ముడిపడి ఉంటాయి. అందుకే దంపతుల హక్కులను కేంద్రప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిందీ, నిర్వచించింది. పిల్లల పట్ల దంపతులకు ఉండే సహజ ఉద్వేగాల కారణంగా వారు ఏ రకంగానూ ఎక్స్ప్లాయిట్ కాకుండా ఉండేందుకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్లకు కొన్ని కీలకమైన బాధ్యతలనూ, మార్గదర్శకాలను రూపొందించింది. నేడు (జూలై 25న) ‘ఐవీఎఫ్ డే’ సందర్భంగా ఈ వరస కథనాల్లో చివరిదైన ఈ ఆర్టికల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఆ మార్గదర్శకాలేమిటో చూద్దాం.కృత్రిమ గర్భధారణ అంశంలో ఇటు సంతాన సాఫల్య కేంద్రాలకూ, అటు ప్రజలకోసం భారతీయ కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ కింద కొన్ని చట్టాలు చేసింది. కృత్రిమ గర్భధారణ చికిత్స తీసుకునే పేషెంట్లు (దంపతులు), అండాలను లేదా శుక్రకణాలను ప్రదానం చేసే దాతలు, అలాగే ఐవీఎఫ్ ద్వారా పుట్టే చిన్నారులకు మేలు కలిగేందుకే ప్రభుత్వం ఈ చట్టాలు చేసింది. నైతిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ నియమ నిబంధనలను చట్టపరంగా అందరూ పాటించాలి. ఏఆర్టీ చట్టం 2021 ప్రకారం దంపతులకు ఉన్న హక్కులు... దంపతులందరికీ తమకు ఉన్న హక్కులపైనా అలాగే ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో నిర్వహించే ప్రక్రియల పైనా అవగాహన పొందేందుకుగాను దంపతులు ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) చట్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్... కేంద్రంతోపాటు రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద తన సంస్థను నమోదు చేసుకుని ఉండాలి. → లెవల్ 1 కింద నమోదైన వారు – బేసిక్ ఫెర్టిలిటీ చికిత్సలు (ఐయూఐ)ల కోసం. → లెవల్ 2 కింద నమోదైన వారు – ఐవీఎఫ్, సరోగసీ క్లినిక్స్ కోసం. చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలను ఐవీఎఫ్ డాక్టర్లు, ఎంబ్రియాలజిస్టులు, యాండ్రాలజిస్టులు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు: చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో ఉండాల్సిన వసతులూ, ఉపకరణాలూ, పరికరాలూ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) అన్నీ తప్పక / ఖచ్చితంగా ఉండి తీరాలి. చట్టబద్ధంగా పేషెంట్లు ఇవ్వాల్సిన ఆమోద పత్రాలు (కన్సెంట్) ఆయా నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఫార్మాట్ (టెంప్లెట్స్)లో ఇవ్వాలి. వయసు: వయసు నిబంధనలను తప్పక పాటించాలి. అంటే మనదేశంలో ఐవీఎఫ్ చికిత్సలు పొందడానికి మహిళల వయసు 21 – 50 ల మధ్య; అలాగే పురుషులు 21 – 55 మధ్య ఉండాలి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్: ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం (కన్సెంట్) తప్పక ఇవ్వాలి – ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు... ‘ఐవీఎఫ్ ప్రక్రియ గురించీ, దానివల్ల ఉండే రిస్కులు, దుష్ప్రభావాలూ, ప్రయోజనాలూ, సక్సెస్ రేటూ... ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులూ’... వీటన్నింటి గురించి దంపతులకు తాము వివరంగా చె΄్పామనీ, దానికి వారు ఆమోదం తెలిపారంటూ పేషెంట్స్ నుంచి రాతపూర్వకంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. గోప్యత: తమ వద్ద చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలూ, వారి మెడికల్ రికార్డులను ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లు పూర్తిగా గోప్యంగా ఉంచాలి. వారి గోప్యతకు (ప్రైవసీకి) ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం రానివ్వకూడదు.కౌన్సెలింగ్తో సహా అన్నీ అందుబాటులో.. ఏదైనా సలహాల కోసం లేదా తమకు వచ్చే సందేహాలను తీర్చుకోవడం కోసం అవసరమైన కౌన్సెలింగ్ సదుపాయాలు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆ కౌన్సెలింగ్ నిర్వహించేవారు ఐవీఎఫ్ గురించి అన్ని విషయాలూ పేషెంట్లకు వివరిస్తూ సహాయపడుతుండాలి. చికిత్స తీసుకునే/వద్దనే హక్కు: తాము ఐవీఎఫ్ తీసుకునేందుకు లేదా చికిత్స తీసుకుంటున్న ఏ సమయంలోనైనా తమకు వద్దనిపిస్తే చికిత్సనుంచి వైదొలగేందుకు పేషెంట్స్ ఎప్పుడూ హక్కు ఉంటుంది.ఫిర్యాదులకు ఓ కేంద్రం (గ్రీవెన్స్ సెల్) తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు లేదా తమ అసమ్మతిని తెలిపేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో క్లినిక్పైన తమ అసౌకర్యాలను/ అసమ్మతిని... ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా పేషెంట్స్కు ఎప్పుడూ ఉంటుంది. పేషెంట్స్ ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో తెలిపే వివరాలను గ్రీవెన్స్ సెల్ దగ్గర రాసి ఉంచాలి. కృత్రిమ గర్భధారణ పొందడానికీ, ఈ ప్రక్రియలో కాబోయే తల్లిదండ్రులు తాము మోసపోకుండా ఉండటానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలివి. తమకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ నియమ నిబంధనలనూ, నైతికాంశాలను కాబోయే దంపతులు తెలుసుకుని ఉండటం వారికి మేలు చేసే అంశం. పేషెంట్ల హక్కుతమకు జరుగుతున్న వైద్యపరీక్షలు (డయాగ్నోసిస్), చికిత్స ప్రణాళికలు (ట్రీట్మెంట్ ప్లాన్స్), అవి సఫలమయ్యేందుకు గల అవకాశాలు (ప్రొగ్నోసిస్)... వీటన్నింటి గురించి దంపతులు వివరంగా తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు/డాక్టర్లు కూడా ఈ అన్ని వివరాలను ఏమాత్రం దాపరికం లేకుండా పేషెంట్లకు వివరించాలి. పేషెంట్లకు ఇచ్చిన ఇంజెక్షన్లూ, నిర్వహించిన పరీక్షలూ (ఇన్వెస్టిగేషన్లు), నిర్వహించిన లేదా నిర్వహించబోయే ప్రక్రియల అన్ని వివరాలూ... అంటే అండాలు/ శుక్రకణాల/ పిండం (ఎంబ్రియోలు) వీటన్నింటి గురించీ... దాపరికం లేకుండా వివరించడంతోపాటు వీటికి సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. ఈ విషయంలో పేషెంట్ల పట్ల పారదర్శకత పాటించడం క్లినిక్లు తప్పనిసరిగా చేసి తీరాలి. – నిర్వహణ: యాసీన్ -
విజయావకాశాలూ... కాంప్లికేషన్లు!
సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు కృత్రిమ గర్భధారణ నిజంగా ఒక వరమే. అయితే ఇందులోనూ అంతా పూర్తిగా సానుకూలంగానే జరుగుతుందని చెప్పడానికి లేదు. వందమంది దంపతులు ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్తే అందులో కేవలం 40% నుంచి 50% మందికే విజయావకాశాలు ఉంటాయి. కారణాలు తెలియని సంతాన లేమి ఉన్న దంపతుల్లో చాలామందికి ఈ ప్రక్రియ ఉపయోగపడకపోవచ్చు. అయితే ఇప్పటికి ఉన్న పరిజ్ఞానంతో దాదాపు సగం మంది దంపతులకు ఇది ఉపయోగపడుతుండటం నిజంగా శుభపరిణామమే. ఇప్పటివరకు సానుకూతలను మాత్రమే చూస్తూ వచ్చినవారికి ఇందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉంటాయని చెప్పేందుకే ఈ కథనం.ఐవీఎఫ్ అనుసరించిన అందరికీ గర్భం రావాలనీ లేదా గర్భం నిలవాలని లేదు. అనేక రకాల కారణాల వల్ల కొందరికి గర్భం నిలవకపోవచ్చు. కొందరిలో పిండం నాణ్యత సరిగా లేకపోయినా, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో ఏవైనా బయటకు తెలియని... లేదా బయటకు కనిపించని అత్యంత సూక్ష్మమైన సమస్యలేవైనా ఉంటే గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు... రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని తీసుకుని ప్రయత్నించవచ్చు. ఇలా దాత నుంచి అండాలనో లేదా శుక్రకణాలనో స్వీకరించాల్సి వస్తే ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆ దంపతులకు వివరించి, వారి అంగీకారం ఉంటేనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దంపతులు ఈ దశలోనూ నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అప్పటికీ కుదరకపోతే సరోగసీ కోసం ప్రయత్నించవచ్చు. ఎంబ్రియో ఫ్రీజింగ్: ఐవీఎఫ్ ప్రక్రియలో ఫలదీకరించి రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడాన్ని ‘క్రయోప్రిజర్వేషన్’ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. వీటిలో ఏది జరగాలన్నా దంపతుల పూర్తి అనుమతితో మాత్రమే చేయాలి.ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఎఫ్ఈటీ): ఐవీఎఫ్ నిర్వహించాక పిండాలు ఏర్పడిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపు వాటిని గర్భాశయంలోకి పంపుతారు. ఏవైనా కారణాలతో ఆ నెలలో గర్భం నిలవకపోతే, ముందుగా ఫ్రీజ్ చేసి ఉంచుకున్న ఎంబ్రియోను మరుసటి నెలలో పంపుతారు. దీనికంటే ముందు గర్భాశయపొర (ఎండోమెట్రియమ్) బాగా ఏర్పడటానికి మందులు ఇచ్చి, ఈ ప్రక్రియనంతా స్కానింగ్లో పర్యవేక్షిస్తూ, గర్భాశయంలోకి ఎంబ్రియోను పంపుతుంటారు. కొంతమందిలో ఐవీఎఫ్ చేసిన నెలలో హార్మోన్స్ సరిగా లేకపోయినా, గర్భాశయపొర సరిగా ఏర్పడకపోయినా, పిండాలను ఫ్రీజ్ చేసి, మళ్లీ ఆ తర్వాతి నెలలో గర్భాశయం లోపలికి పంపుతారు. అంటే.... ఫ్రోజెన్ ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేస్తారు.ఐవీఎఫ్ – కాంప్లికేషన్లు.. ముందుగా చెప్పుకున్నట్టుగా ఐవీఎఫ్ పూర్తిగా సానుకూలంగానే జరిగే ప్రక్రియ కాదు. కొన్ని కొన్ని దుష్ఫలితాలూ కనిపించవచ్చు. ఔషధం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ లాగే వాటిని చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా సంతానం పొందే అంశంతో పోలిస్తే ఇవి అంత పెద్దవి కావని గ్రహించాలి. ఆ కాంప్లికేషన్లు చూద్దాం. → ఐవీఎఫ్ ప్రక్రియ కోసం వాడే మందుల వల్ల కొందరిలో కొన్నిసార్లు వారి వారి శరీర తత్వాలను బట్టి తలనొప్పి, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు.→ అండాలను బయటకు తీసేటప్పుడు కొందరిలో బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో పేగులకు, మూత్రాశయానికి, రక్తనాళాలకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. → ఐవీఎఫ్లో కొందరిలో ఒక్కోసారి కవలపిల్లలు, ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్) కూడా పుట్టే అవకాశాలుంటాయి. ఈ కారణంగా కొందరిలో నెలలు నిండకుండానే కాన్పులు అవడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వంటి పరిణామాలూ కనిపించవచ్చు. అయితే ఒకే ఒక పిండాన్ని ప్రవేశపెట్టడం (సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్) ద్వారా కవలలు, ట్రిప్లెట్స్ పుట్టడాన్ని చాలావరకు నివారించవచ్చు. ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్: కొందరిలో ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మరీ ఎక్కువ అండాలు తయారై, వాటి విడుదలకు వాడే హెచ్సీజీ అనే ఇంజెక్షన్ వల్ల అండాశయాల వాపు, కడుపులోకి నీరు చేరడం, కడుపులో నొప్పి, వాంతుల వంటి దుష్ఫరిణామాలు కనిపించవచ్చు. మరికొందరిలో కడుపుబ్బరం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల తీవ్రమైన ఆయాసం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అయితే ఇటీవల డాక్టర్లు పాటించే కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని వ్యూహాత్మకమైన చర్యల ద్వారా ఈ దుష్ప్రభావాలను (కాంప్లికేషన్లను) పూర్తిగా నివారించవచ్చు. ప్రస్తుతమున్న సాంకేతికతతో ఈ కాంప్లికేషన్లను చాలావరకు తగ్గించడం సాధ్యమే. గర్భాశయంలో కాకుండా ట్యూబుల్లో పిండం పెరగడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) : కొందరిలో ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోకి పంపించిన పిండం కొద్దిగా ముందుకు వెళ్లి, ట్యూబ్లో అంటుకొని, అక్కడే పిండం పెరుగుదల జరిగే అవకాశాలూ ఉంటాయి. గర్భస్రావాలు: ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినవాళ్లలో మొదటి మూడు నెలలలప్పడు (మొదటి ట్రైమిస్టర్లో) గర్భస్రావం (అబార్షన్) జరిగేందుకు అవకాశాలెక్కువ. ఈ పరిణామం జరగడానికి సాధారణ గర్భం దాల్చినవాళ్లలోనూ అవకాశమున్నప్పటికీ... సాధారణంగా మహిళకు కొంచెం ఎక్కువ వయసు ఉన్నప్పుడు, పిండం నాణ్యత సరిగా లేనప్పుడు ఇలాంటి అబార్షన్లకు అవకాశాలు కాస్త ఎక్కువ. మానసిక ఒత్తిడి: ఐవీఎఫ్ ప్రక్రియ కాస్త డబ్బు ఖర్చు, మానసిక ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ. ఓపిక కూడా చాలా అవసరం. ఒకపక్క డబ్బు పెట్టుకుంటూనే, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఓపిగ్గా తిరుగుతూ కాస్త ఎక్కువ సమయాన్నే ఇందుకోసం వెచ్చించాలి. ఇంత చేశాక కూడా గర్భం తప్పక నిలుస్తుందన్న గ్యారంటీ ఉండదు కాబట్టి ఈ కారణాలతో కాబోయే దంపతుల్లో... ముఖ్యంగా తల్లికావాలని కోరుకుంటున్న మహిళకు ఆందోళన, టెన్షన్, కొన్ని సమయాల్లో డిప్రెషన్ వంటివి కలిగే అవకాశాలుంటాయని గుర్తుంచుకోవాలి.గర్భాశయ దానంఅన్ని దానాలలోకెల్లా గొప్పదేది అని అడిగితే అన్నదానం, నేత్రదానం, రక్తదానం అని చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. కాని పిల్లల్ని కనాలని కలలుగని, కనలేకపోతున్నామని వ్యధ చెందే మహిళలకి మాత్రం గర్భాశయ దానం అన్నింటికన్నా మిన్న. యునైటెడ్ కింగ్డమ్లో గ్రేస్ డేవిడ్సన్ అనే మహిళ అరుదైన వ్యాధి కారణంగా పుట్టుకతోనే గర్భాశయం లేకుండా పుట్టింది. అయితే గ్రేస్ తన ఆశని వదులుకోలేదు. తన జీవిత భాగస్వామి ఆంగస్తో కలిసి ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోలను రూపొందించి భద్రపరుచుకుంది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే గ్రేస్ పరిస్థితి చూసి ఆమె అక్క ఏమీ పర్డీ తన గర్భాశయాన్ని చెల్లెలికి దానం చేయాలని నిర్ణయించుకుంది. ఏమీ అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి కావడంతో ప్రాసెస్కి ఎవరూ అడ్డు చెప్పలేదు. 2023లో ఆక్స్ఫర్డ్లో గంటల తరబడి సాగిన ఆపరేషన్లో డాక్టర్లు గ్రేస్కు గర్భాశయాన్ని విజయవంతంగా అమర్చారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో క్వీన్ చార్లెట్స్ అండ్ చెల్సియా హాస్పిటల్లో గ్రేస్ ఆడబిడ్డ(ఏమీ ఇసబెల్) కు జన్మనిచ్చింది. ఈ జననం యూకే వైద్యచరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.మరణించినా, మాతృత్వం బతికింది..ఏడాది తిరగక ముందే ఇంగ్లాండ్కు చెందిన గ్రేస్ బెల్ అనే మహిళకి గ ర్భాశయం లేదు. అయితే మరణించిన ఓ మహిళ నుంచి గర్భాశయం సేకరించి ‘వూంబ్ ట్రాన్స్ప్లాంట్ యూకె ఎక్స్పెరిమెంట్’ కార్యక్రమం లో భాగంగా డాక్టర్లు ఆపరేషన్ చేసి గ్రేస్కి గర్భాశయాన్ని మార్పిడి చేశారు. మర ణించిన దాత నుంచి గర్భాశయాన్ని తీసి మార్పిడి చేయడం బ్రిటన్లో ఇదే తొలిసారి. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత వైద్యులు ఫ్రీజ్ చేసి ఉంచిన ఎంబ్రియోల్లో ఒక దాన్ని గ్రేస్ గర్భాశయంలో ప్రవేశపెట్టగా ఆమె గర్భం దాల్చింది. 2025 డిసెంబర్ 12న గ్రేస్ బెల్ ఓ మగబిడ్డ(హ్యుగో రిచర్డ్ నార్మన్ పావెల్)కు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని కనే భాగ్యాన్ని విధి ఇవ్వకపోయినా, బిడ్డల్ని కనాలన్న సంకల్పం ఈ ఇద్దరు మహిళల్ని మాతృమూర్తులుగా మార్చింది.డాక్టర్ పల్లవి చలసానిసీనియర్ కన్సల్టెంట్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ఐవీఎఫ్లో ఏం జరుగుతుందంటే...
సామాన్య ప్రజలు టెస్ట్ట్యూబ్ బేబీ అని పిలిచే ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అంటారు. దీని కంటే ముందుగా కొందరిలో ఇంటా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ప్రక్రియను అనుసరిస్తారు. ఐయూఐలో మిగతాదంతా నేచురల్ పద్ధతిలోనే జరిగినప్పటికీ కేవలం వీర్యకణాలను నేరుగా యోని మార్గం గుండా సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. దీనితో పోలిస్తే ఐవీఎఫ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దంపతులకు ఓ వరం. ఇందులో వరసగా ఏమేం జరుగుతుందో, స్టెప్ బై స్టెప్ చూద్దాం...ఐవీఎఫ్లో ముందుగా మహిళలో అండాల సంఖ్య పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి బాగా ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్లోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫెర్టిలైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలూ పెరగవచ్చు.ఇలా రూపొందించిన పిండాల్లో ఆరోగ్యకరమైన వాటిని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలప్పుడు ఒకసారి చూసి... మళ్లీ నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ప్లాన్ చేస్తారు.వరుస క్రమంలో జరిగే ప్రక్రియలు.. (ఒవేరియన్ స్టిమ్యులేషన్) ఇందులో అండాశయాల నుంచి ఎక్కువ అండాలు తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్నే ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. ఈ టైములో వెజైనల్ స్కానింగ్ ద్వారా మహిళలోని అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీత స్థాయికి వచ్చేవరకు వేచిచూస్తారు. అండాలను తీయడం అండాలు తగిన సైజుకు పెరిగాక... అనస్థీషియాతో మహిళకు నొప్పి తెలియకుండా యోని మార్గం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. దీన్ని ‘ఎగ్/ఊసైట్ రిట్రైవల్’ అంటారు. 3. ఫలదీకరణ (ఫెర్టిలైజేషన్): బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుచేస్తారు. వాటిని శుభ్రపరచి, వాటిల్లో నాణ్యమైనవిగా గుర్తించిన వాటిని శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా ఉన్న ఓ చిన్న డిష్లో కలుపుతారు. ఇలా ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. వీటిల్లో ఇలా కలిపిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి. → ఐసీఎస్ఐఈ (ఇక్సీ): అండాలను, శుక్రకణాలతో కలిపే సమయంలో కొన్నిసార్లు వీర్యకణాలు వాటంతట అవే అండంలోకి వెళ్లలేకపోవచ్చు. అప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ‘ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఇక్సీ) అంటారు. కణవిభజన (ఎంబ్రియో కల్చర్): ఫలదీకరణ జరిగిన ఆ అండాలను, న్యూట్రిషన్ మీడియా ఉన్న ఒక డిష్లో పెట్టి, ఇంక్యుబేటర్లో 3 – 5 రోజుల పాటు అలా ఉంచేస్తారు. వీటిలో కణాలు విభజన జరుగుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, మైక్రోస్కోప్లో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్: ఇంక్యుబేటర్లో కాస్తంత పెరిగిన పిండాల్లోని నాణ్యమైన వాటిని వేరుచేసి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చేస్తారు. ఇలా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. ఇంప్లాంటేషన్: ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపిన పిండాలు... గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. ఇది అందరిలోనూ నార్మల్గా జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర బాగుండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక అంశాలు సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదనే దానికి కారణాలు ఇంకా తెలియదు. అందుకే ఈ ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్) పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతమే!ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్→ పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ సక్సెస్ అయ్యేందుకు కొన్ని మందులను మాత్రలూ, ఇంజెక్షన్లూ, జెల్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.→ దంపతుల్లో ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకసారి ఫలించకపోతే, మళ్లీ కొన్ని నెలలు ఆగి, మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నించి చూస్తారు. ఒకసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి సరిచూసుకుంటూ, కారణాలను పునఃసమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, అవసరమైన పరీక్షలేమైనా ఉంటే అవి కూడా చేయిస్తూ, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, డాక్టర్లు టెస్ట్ట్యూబ్బేబీ పద్ధతిని మళ్లీ ప్రయత్నిస్తారు.కన్నది మేమే కాని...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పాట వరకు పాడుకుంటాం కాని, నిజ జీవితంలో కొన్ని తికమకల వల్ల జీవితాలే తలకిందులవుతాయి. నవ మాసాలు మోసి కన్న తల్లికి పుట్టింది తన బిడ్డ కాదని అంటే? ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన తప్పిదాల వల్ల ఇప్పుడు అలాంటి వింతలే వినాల్సి వస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన టిఫనీ స్కోర్, ఆమె భర్త స్టీవెన్ మిల్స్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ఆఫ్ ఓర్లాండ్లో రూపొందించిన ఎంబ్రియోలలో ఒక దానిని టిఫనీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 2025 డిసెంబర్ 11న టిఫనీ ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ (షియా)కు జన్మనిచ్చింది. కాని ట్విస్ట్ ఏంటంటే, పుట్టిన బిడ్డకి జన్యుపరంగా టిఫనీ, స్టీవెన్లు తల్లిదండ్రులు కారు. డీఎన్ఏ పరీక్ష చేయించగా... ఆ బిడ్డకి బయోలాజికల్స్ పేరెంట్స్ తాము కాదని తెలిసింది. కాని టిఫనీ మనసు బరువైంది. జన్యుపరంగా తమ బిడ్డ కాకపోయినా నవ మాసాలు మోసింది తానే కదా.. ఆ మాతృత్వ భావన తనని, బిడ్డని వేరు చేయడానికి ఇష్టపడలేదు.. షియాని తామే పెంచుకుంటామని టిఫనీ, స్టీఫెన్లు నిర్ణయించుకున్నారు.మరో సంఘటనలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో మానవ తప్పిదం కారణంగా ఒక మహిళకు మరో కుటుంబానికి చెందిన ఎంబ్రియో పొరపాటున బదిలీ అయ్యింది. ఇది తెలియక సదరు మహిళ గర్భం దాల్చి ఒక మగశిశువుకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు రెండేళ్లు కావస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై విచారణ చేయగా పొరపాటు వల్లే ఇంతటి పెను సమస్య వచ్చిందని నిర్ధారించారు. ఈ రెండు కథలలో బిడ్డకు జన్యుపరంగా తల్లులు కాలేకపోయినా పేగుపాశం ఆ బంధాలను శాశ్వతం చేసింది. డాక్టర్ రాధికా గుప్తాసీనియర్ కన్సల్టెంట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్నిర్వహణ: యాసీన్ -
కృత్రిమ గర్భధారణ ఎవరికి అవసరం?
మన దేశంలో దాదాపు 3 కోట్ల మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులోనూ పల్లెల్లో ఉండేవారి కంటే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే దంపతులను సంతానలేమి సమస్య ఎక్కువగా బాధిస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని 1.83% మందిలో ఈ సమస్య ఉండగా... పల్లెల్లో ఈ సంఖ్య కాస్త తక్కువగా అంటే 1.76%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఎటూ కదలకుండా స్థిరంగా ఉండి చేసే ఉద్యోగాలూ, చాలా దూరాలు ప్రయాణాలు చేయడం వంటి అంశాలు సంతానలేమి సమస్యను పెంచేస్తున్నాయి. అయినప్పటికీ బిడ్డల కోసం ఆరాటం, ఉద్వేగాలూ ఎమోషన్స్ మాత్రం ఇటు పట్టణ ప్రాంతాల్లోనైనా అటు పల్లెల్లోనైనా ఒకేలా ఉంటాయి. కేవలం పిల్లలు లేకపోవడంతో పాటు ఈ కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు అవసరమైన వారు ఎవరెవరు, ఏయే కారణాలు వారిని ఫెర్టిలిటీ సెంటర్లవైపునకు ఆకర్షిస్తాయో చూద్దాం...గర్భధారణ జరగకపోవడానికి కారణాల్లో మూడింట ఒక వంతు మహిళల్లో ఉంటే, మరో మూడింటి ఒక వంతు పురుషుల్లోనూ... ఇంకో మూడింట ఒక వంతు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉండవచ్చు. ఈ మొత్తంలోనూ దాదాపు 90% మందిలో లోపమేదో తెలుసుకోవచ్చుగానీ... సంతానలేమికి అసలు కారణాలేమిటో తెలియని కేసులు మరో 10% వరకు ఉంటాయి. సమస్యను ఈ కోణంలో చూసినప్పుడు సంతానం కలగకపోతే దంపతులు ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు. అలాగే ఆ ఇంటి కుటుంబ సభ్యులు, సమాజం కూడా ఎవరినీ తప్పు పట్టకూదు.జడ్జ్ చేయడం అస్సలు సరికాదు. తగిన వైద్యపరీక్షల ద్వారా స్త్రీ, పురుషుల్లో ఈ లో పాలను కనిపెట్టినప్పుడు వాటిల్లో సరిదిద్దగల సమస్యలను చక్కదిద్దాక కూడా గర్భం రాలేదంటే అందుకు కారణాలేమిటో చెప్పలేని, ఏదీ తెలియని అంశాలు (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ) ఉండవచ్చు. అయితే ఇప్పుడున్న సాంకేతిక అభివృద్ధి, వైద్యరంగంలోని పురోగతితో తగిన కారణాలను తెలుసుకుని, వాటికి చికిత్స అందించడం లేదా వీలుకాని సందర్భాల్లో కృత్రిమ గర్భధారణను సుసాధ్యం చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎవరి కోసమంటే... కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందునా ప్రధానంగా ఐవీఎఫ్ వంటి ప్రక్రియలు ఎవరెవరికి బాగా ఉపకరిస్తాయో చూద్దాం...⇒ ఐయూఐ: పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక (మొటిలిటీ) అంతగా లేకపోవడం వంటి కారణాలతో గర్భం రాకపోతే... పురుషుల నుంచి వీర్యకణాలను సేకరించి ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. టెస్ట్ట్యూబ్ బేబీ ఎవరెవరిలోనంటే... ⇒ సాధారణ చికిత్సలూ, (ఐయూఐ)తోనూ గర్భం రాకపోవడంతో పాటు... ఇతరత్రా వేరే సమస్యలేవీ లేకుండా ఉండి, ఇంకా వేచిచూసేంత ఓపిక, సమయం లేనివాళ్లకి ⇒ మహిళ వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి; అంతేకాకుండా 35 ఏళ్లు దాటి, మహిళల్లో వారి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతూ... సాధారణ చికిత్సతో గర్భం రాని సందర్భాల్లో ∙రెండు ట్యూబ్లూ మూసుకుపోయిన వాళ్లకి, ట్యూబెక్టమీ తర్వాత, ఏవో కారణాలతో మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు; పురుషుల్లో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్లీ ఏదైనా కారణాల వల్ల పిల్లలను కోరుకుంటూ అందుకోసం ‘రీకెనలైజేషన్’ చేయించుకున్నప్పటికీ సక్సెస్ కానప్పుడు⇒ ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ⇒ వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు. జన్యుపరమైన సమస్యలు: భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు... ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా రూ పొందించిన పిండాలలో ఒక దాన్ని తీసి, ప్రీ–ఇం΄్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ ద్వారా పరీక్ష చేస్తారు. ఇలా చేశాక సమస్యలేవీ లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపే ప్రక్రియ వల్ల జన్యు సమస్య లేని ఆరోగ్యకరమైన సంతానం దాదాపు సాధ్యమే. ⇒ క్యాన్సర్ చికిత్స: దేహంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ వచ్చిందని తెలిశాక... అందుకు చికిత్సగా రేడియేషన్, కీమోథెరపీ చికిత్సకు వెళ్లేముందర, మహిళ తన అండాలను బయటకు తీసి, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా అండాలను ఫలదీకరణ చేసుకొని, పిండాలను ఫ్రీజ్ చేసి, చికిత్స పూర్తయ్యాక వాటిని ‘ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ పద్ధతిలో గర్భాశయంలోకి పంపవచ్చు. ⇒ సామాజిక కారణాలు: కొందరు కెరియర్ కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. మరికొందరు పెళ్లిని వాయిదా వేసుకొని, అండాలను ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసిన అండాలు, పిండాలను ఆ తర్వాత ఉపయోగించుకుంటారు. ఇలాంటి వారందరూ కృత్రిమ గర్భధారణ ప్రక్రియల కోసం ముందుకెళ్లవచ్చు.నిర్వహణ: యాసీన్సాధారణ కారణాలు...మహిళల్లో: ⇒ అండం విడుదల సరిగా జరగకపోవడం⇒ గర్భాశయంలో సమస్యలు ⇒ ఎండోమెట్రియాసిస్ సమస్యలు⇒ ఫెలోపియన్ ట్యూబుల్లో లో పాలు⇒ ఫలదీకరణ సమస్యలు⇒ సికిల్సెల్ అనిమియా వంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు.పురుషుల్లో...మగవారిలో... ⇒ వీర్యకణాల్లో లో పాలు⇒ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం⇒ వీర్యకణాల కదలికలూ తగ్గడం ⇒ వీర్యం నాణ్యత బాగాలేకపోవడం.ముప్పై ఏళ్ల తర్వాత...అది 1992వ సంవత్సరం... అప్పట్లో ఒక ల్యాబ్లో ప్రాణం పోసుకున్న రెండు జీవకణాలు, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన రేచెల్, ఫిలప్ రిజ్డ్ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్లో అప్లై చేశారు. ఫలదీకరణ చెందిన అండాలను డాక్టర్లు రేచల్ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. కొన్ని నెలల తర్వాత రే^è ల్ పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆమె జన్మనిచ్చింది సాధారణ శిశువులకి కాదు... ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ల్యాబ్లో పిండస్థ దశలో ఉన్న రెండు జీవాలకి... 1992లో ఓ అజ్ఞాత దంపతులకి ఐవీఎఫ్ ద్వారా పిండాలను సృష్టించారు. వారికి సంతానం కలిగిన తర్వాత మిగిలిన ఎంబ్రియోలను అలానే భద్రపరిచారు. 2007లో ఈ పిండాలను నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్కి దానం చేశారు. చివరికి 2022 మార్చిలో అంటే ముప్పై ఏళ్ల తర్వాత రేచల్, ఫిలిప్ దంపతులు ఈ ఎంబ్రియోలను దత్తత తీసుకోగా వాటిని yీ ఫ్రాస్ట్ చేసి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. 2022 అక్టోబర్ లో రేచల్ పండంటి కవలలు (ఆడ శిశువు లిడియా, మగ శిశువు థిమోతి)కు జన్మనిచ్చింది.ఈ జననంతో అప్పటివరకు ప్రపంచంలో అత్యధిక కాలం పిండస్థ దశలో ఉండి పుట్టిన కవల శిశువులుగా లిడియా, థిమోతి రికార్డ్ సృష్టించారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ ఎంబ్రియోలను ఫ్రీజ్ చేసినప్పుడు అంటే 1992లో రేచల్కు అక్షరాలా ఐదేళ్లు. అప్పుడు తయారైన ఎంబ్రియోలకు అదే చిన్నారి పెరిగిన తర్వాత తల్లిగా మారింది. మానవ మేధస్సుతో ఆవిర్భవించిన జీవకణాలు కాలాన్ని జయించి జీవించగలవని ఈ జననం నిరూపించింది.డాక్టర్ వసుంధర చీపురుపల్లి సీనియర్ గైనకాలజిస్ట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే... ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒక జంటను సంతానలేమి సమస్య బాధిస్తోంది. ఇది కాస్త గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకంటే ... జనాభాలో యువత శాతం తగ్గడం వల్ల అనేక ప్రతికూలతలు కనిపిస్తాయి. ఆ సమాజం వృద్ధసమాజంగా మారి మానవ వనరులు కొరవడతాయి. దాంతో ఆ దేశ ఆర్థిక సంపద తగ్గడం, జీవన నాణ్యతలు దిగజారడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జపాన్ వంటి కొన్ని దేశాలు ఇందుకు ఉదాహరణ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండి ఓ సమాజం యౌవనంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే పనిచేసే సామర్థ్యం ఉన్న యువత సంఖ్య స్థిరంగా ఉండటమో లేదా పెరుగుతుండమో జరగాలి. ఇదే జరగకపోతే ఆ దేశం వంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా పురోగమిస్తూ.. అభివృద్ధి పథంలో తిరోగమిస్తుంది.25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ డే సందర్భంగా కృత్రిమ గర్భధారణ విషయంలో అనేక అంశాలపై ‘సాక్షి’ వరుస కథనాలు...ఇటీవల మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ వీటిని ప్రధానంగా రెండుగా చెప్పవచ్చు. అవి మొదటిది... సామాజిక , రెండు ఆరోగ్య కారణాలుగా చెప్పవచ్చు. → సామాజికం: ఒకప్పుడు మన సమాజంలో అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పెళ్లీడుకు రాగానే కుటుంబసభ్యులు మొదట వివాహానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు లో జరగాలంటూ అబ్బాయి సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా పెళ్లికి సిద్ధపడేవారు. కానీ ఇటీవల యువత చదువులూ, ఉన్నత ఉద్యోగాలంటూ తమ కెరియర్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకొని... అవి పూర్తయ్యేవరకూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వంటి పనులు ఇటు అబ్బాయిలూ, అటు అమ్మాయిలూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి కొత్త ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడులూ, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పనిచేయడాలు, శారీరకంగా కదలికలు లేని ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒబేసిటీ, మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు... ఇవన్నీ కలసి సంతానలేమికి దారితీస్తున్నాయి.→ ఆరోగ్య కారణాలు: గతంతో పోలిస్తే యువతులు సైతం తమ కెరియర్కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. దాంతో... ఆ ఒత్తిడుల ఫలితంగా యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు యువతుల్లో అనేక హార్మోన్లతో కూడిన ఓ నిర్దిష్టమైన ‘సైకిల్’ నడుస్తుంటుంది. ఈ హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఆ సైకిల్ దెబ్బతినడంతో ఈ అంశం కూడ సంతానలేమికి కారణమవుతోంది. ఇలా సైకిల్ దెబ్బతినడంతో అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. దీనికి తోడు కొన్నిసార్లు యువతుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానం కలగడంపై ప్రభావం చూపవచ్చు.→ పురుషుల విషయంలో: ఒకప్పుడు సంతానలేమికి మహిళలనే ఎక్కువగా బాధ్యులను చేసేవారు. కానీ ఇప్పుడున్న సామాజిక అంశాలూ, యువతలో దురలవాట్లూ, మారుతున్న జీవనశైలి కారణంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు (మొటిలిటీ), నాణ్యత తగ్గడం వంటి అనేక అంశాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగని సందర్భాల్లో సదరు యువకుడిలో తన వీర్యంలోని శుక్రకణాల విషయంలో వాటి సంఖ్య, కదలికలు, నాణ్యత ఇవన్నీ బాగున్నాయా అనే అంశాలను తెలుసుకోడానికి మొదట పురుషుడే వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం, అవసరం... పైగా మహిళలతో పోలిస్తే పురుషులకు నిర్వహించే వైద్యపరీక్షలు తేలికా, చవకా!నిర్ధారణ ఇలా... సంతానలేమిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. .ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ... పూర్తి ఆరోగ్యంగా ఉన్న దంపతులు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రానప్పుడు... ఆ జంటకు సంతానలేమి సమస్య ఉంటే దానిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.సెకండరీ ఇన్ఫెర్టిలిటీ... జంటలో మొదటిసారి గర్భధారణ జరిగాక... మళ్లీ రెండోసారి గర్భధారణ కోరుకుని, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఈ చికిత్స ఎవరెవరికి? ∙ప్రతినెలా పీరియడ్స్ సరిగా వస్తూ, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివాళ్లలో ∙ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఇంకా గర్భం రాని సందర్భాల్లో... ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఉన్న మహిళ వయసు 35 ఏళ్లు దాటుతున్నా... అప్పటికి ఆర్నెల్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం రానప్పుడు... ఇలాంటి జంటలు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం అవసరం.ట్విన్స్ మూడేళ్ల తేడా!ఏం కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఎంత ప్రయత్నించినా తిరిగి రానివి రెండే..ఒకటి కాలం రెండు ప్రాణం...కాని ఆ కాలాన్ని ఫ్రీజ్ చేస్తే..? అదెలా జరగుతుందనుకుంటే మీరు ఈ కథ చదవాల్సిందే..అమెరికాలోని ముస్సోరి రాష్ట్రానికి చెందిన కెన్సాస్లో టేలర్ గ్రీన్హాగెన్ డెంటల్ హైజెనిస్ట్, తన భర్త జస్టిన్ ఒక ఫార్మాసిస్ట్. వీరిద్దరు సంతానం కోసం 2022లో ఐవీఎఫ్ పద్థతిని ఎంచుకున్నారు. 2023లో వీరిద్దరికి మగ శిశువు జన్మించాడు. అదే ఐవీఎఫ్ సైకిల్లో ఏర్పడిన మరో ఎంబ్రియోను క్రయోప్రిజర్వేషన్ (పిండాన్ని ఘనీభవింపజేసే ప్రక్రియ) ద్వారా భద్రపరిచి, మూడేళ్ల తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో 2025లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకే రోజున ఎంబ్రియోలుగా జీవం పొందినా, ఈ ప్రపంచంలోకి రావడానికి మాత్రం మూడేళ్ల కాలం పట్టిందన్నమాట. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు మామూలే అయినా ఒకేసారి రూపొందిన ఎంబ్రియోలను ఇలా కాలవ్యవధిలో పిల్లలుగా జన్మించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న వీడియో టేలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.డాక్టర్ బి. సృజనసీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ఆవుకు ‘డిజిటల్’ కృత్రిమ గర్భధారణ
సాక్షి, హైదరాబాద్: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్ ఇచ్చే డిస్ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్తోపాటు వచ్చే పెన్డ్రైవ్ను కాలర్ హ్యాంగింగ్ మొబైల్ ఫోన్కు అటాచ్ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంసింగ్ లకావత్తోపాటు ఇంటర్న్షిప్, ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఇ.ఎల్. చంద్రశేఖర్ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40% ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. -
హోమియోపతితో సంతాన సాఫల్యం
బోసినవ్వులతో, కేరింతలతో, చిలిపి చేష్టలతో పసిపిల్లలు నడయాడే ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. మరి ఆ పిల్లల సవ్వడి ఇంట్లో వినబడకపోతే, అమ్మా, నాన్నా అనే పిలుపులకు కొందరు తల్లిదండ్రులు నోచుకోకపోతే... ఆ అదృష్టం మనకు లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. హోమియో చికిత్స ద్వారా సంతాన సాఫల్యానికి అవకాశాలున్నాయి. సంతానలేమికి కారణాలు సంతానం లేకపోతే చాలామంది దానికి మహిళలోనే లోపం ఉందని నిర్ధారణకు వస్తారు. కానీ సంతానలోపానికి కారణం దంపతులిద్దరిలోనూ ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలలో: వయసు 32-35 దాటిన స్త్రీలలో అండాశయ సామర్థ్యం తగ్గుతుంది. పీసీఓడీ, గర్భాశయ సమస్యలు, ట్యూబులు మూసుకుపోవడం, పీఐడీ, థైరాయిడ్, డీఎమ్, టీబీ వంటి సమస్యలు, ఎండోమెట్రియాసిస్ మొదలైనవి మహిళల్లో సంతానలేమికి కారణాలు. పురుషుల్లో: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్తత, వరిబీజం, డయాబెటిస్, మూత్రనాళంలో అడ్డు... మొదలైనవి సంతానలేమికి పురుషుల్లో కారణాలు. కొంతమంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సరిపడా ఉన్నా వాటిలో చలనం తక్కువగా ఉండటం, వాటి ఆకృతి (మార్ఫాలజీ)లో తేడా వంటి అంశాలను గమనించాల్సి ఉంటుంది. కొందరిలో వీర్యకణాల సంఖ్య, చలనం అన్నీ బాగానే ఉంటాయి. భార్యలో కూడా లోపాలు ఉండవు. వీర్యకణాలు అండాన్ని సమీపిస్తాయి. కానీ ఫలదీకరణ జరగదు. ఇందుకు విటమిన్-కె లోపం, వీర్యకణాలకు ఫలదీకరణ శక్తి లోపించడం వంటివి కారణం. చికిత్స: హోమియో చికిత్స ద్వారా సంతానలేమికి కారణమైన అన్ని అంశాలకూ పరిష్కారం లభ్యమవుతుంది. చాలామందికి గర్భం వస్తుంది కానీ నెలలు నిండకుండానే గర్భస్రావం అవుతుంటుంది. అటువంటివారికి కూడా హోమియో ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తే గర్భం నిలుస్తుంది. అయితే ఆయా అంశాలను బట్టి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వైద్యం అవసరమవుతుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్


