breaking news
Indias reputation
-
భారత్ పరపతి హోదా యథాతథం: మూడీస్
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు లక్ష్య సాధన తడబాటు ప్రభావం భారత్ పరపతి హోదాపై (క్రెడిట్ ప్రొఫైల్) ఉండబోదని మూడీస్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగించడం సహా ఇతర అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటు లక్ష్యాలను, ద్రవ్య స్థిరీకరణను కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. 2016-17లో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కార్పొరేట్ లాభాలు, ప్రభుత్వ రాబడి పెరుగుదల వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ ఎండీ అత్సి శేత్ తెలిపారు. ద్రవ్యలోటు స్థిరీకరణ అనేది ఒక ప్రక్రియ అని, అది ఏ ఒక్క అంశంపై ఆధారపడబోదని చెప్పారు. ఒక ఏడాదితో పోలిస్తే మరొక ఏడాదిలో భారత ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటునే లక్ష్యంగా నిర్దేశించుకుంటుందని అంచనా వేశారు. ప్రభుత్వపు సంస్కరణల జాప్యాల ప్రభావం భారత్ క్రెడిట్ ప్రొఫైల్ అంచనాలపై ఉండదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ద్రవ్యలోటు స్థిరీకరణ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తోందని, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అది భవిష్యత్తులో అలాగే కొనసాగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటును 3.9 శాతానికి, 2016-17లో 3.5 శాతానికి లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐఎంఎఫ్.. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. -
యువశక్తిని మేల్కొలిపిన వివేకానందుడు
వరంగల్ స్పోర్ట్స్/కేఎంసీ/ఎన్జీవోస్ కాలనీ/కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : దేశంలోని యువశక్తిని మేల్కొల్పిన స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువతరం జాతీయభావాన్ని పెంపొందించుకోవాలని వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అఖిల భారత సాహిత్య పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా నగరంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ద నేషన్’ పేరిట భారీ మారథాన్ నిర్వహించారు. ఆర్ట్ కళాశాల నుంచి కలెక్టర్ కిషన్ యూత్ రన్ను జెండాఊపి ప్రారంభించారు. ఎస్డీఎల్సీఈ క్రాస్ నుంచి కేయూరిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. రామస్వామి కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ జెండా ఊపిప్రారంభించారు. ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ చికాగోలో మహాసభలో వివేకానందుడు.. ప్రపంచానికి భారతదేశ ఖ్యాతిని తెలియజెప్పిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. సోదర, సోదరీమణులారా.. అనే మాటలతో ప్రారంభించిన ఆయన ప్రసంగాన్ని పాశ్యాత్యులు మొత్తం విన్నారన్నారు. అప్పటి నుంచే హిందూ, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పాశ్చాత్యులకు కలిగిందన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి కావాలని వివేకానందుడు పిలుపునిచ్చారన్నారు. కానీ ఆయన కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నూతన ఉత్తేజంతో, జాతీయభావంతో దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి ఫ్లెక్సీల వద్ద విద్యార్థులు, యువకులు పూలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డాక్టర్ విశ్వనాథం, జూలపల్లి కరుణాకర్, కానిగంటి విశ్వనాథ్జీ, బొల్లంపల్లి మురళీధర్రావు, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్ను నిర్ణయించేది యువతే దేశ భవిష్యత్ను నిర్ణయించి పురోభివృద్ధి సాధించేందుకు యువకులే ముందు వరుసలో ఉండాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ సూచించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన రన్ఫర్ది నేషన్ మారథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలు నిం డిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మా రథాన్లో పాల్గొంటున్నారని, దేశ భవిష్యత్లో యువతే కీలకపాత్ర వహించాలని తెలిపారు. దే శ భవితకు యువత పరుగు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్ర ముఖ న్యాయవాదులు అల్లం నాగరాజు, గుడిమల్ల రవికుమార్, పీడీ ప్రభాకర్రెడ్డి, కళాశాలకు చెందిన మెడికోలు, నగరానికి చెం దిన ప్రముఖ యువకులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో వివేకానందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని స్వామి వివేకానందుడు యువతకు పిలుపునిచ్చారన్నారు. అభివృద్ధికి పునాది రాళ్లుగా యువత దోహదపడాలన్నారు. మనసు బాగుండాలంటే శరీరం కూడా బాగా ఉండాలన్నారు. శరీర దారుఢ్యానికే ఈ మారథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.