breaking news
independent probe
-
ఒమన్లో శ్రీదేవి పేరిట భారీగా బీమా పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఆమె మరణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సునీల్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన సుప్రీం బెంచ్ కొట్టివేసింది. శ్రీదేవి పేరిట ఉన్న బీమా పాలసీలు ఆమె దుబాయ్లో మరణిస్తేనే చెల్లింపులు జరుపుతాయని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ఒమన్లో శ్రీదేవి పేరిట ఉన్న రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. మరోవైపు 5.7 అడుగులు ఉండే వ్యక్తి కేవలం 5.1 అడుగుల బాత్టబ్లో ఎలా పడిపోతారని ప్రశ్నించారు. శ్రీదేవి మృతికి సంబంధించి దుబాయ్ పోలీసులు చేపట్టిన ఆమె వైద్య, దర్యాప్తు పత్రాలన్నింటినీ భారత్కు రప్పించాలని, స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని కోరారు. అనుమానాస్పద పరిస్థితుల్లోనే శ్రీదేవి మరణించారని వికాస్ సందేహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై విచారణను కోరుతూ దాఖలైన పిల్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో సునీల్ సింగ్ మార్చి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్రూమ్ టబ్లో ప్రమాదవశాత్తూ పడిపోయి మరణించారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఆ విషయంలో మోదీకి సిగ్గెందుకు?
స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్దపడటం లేదు? 'సహరా-బిర్లా' ముడుపుల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ తాజాగా రూటు మార్చారు. ఇంతకుముందు ఈ పత్రాల ప్రామాణికతను ప్రశ్నించిన ఆమె.. తాజాగా ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముడుపుల కేసులో స్వతంత్ర విచారణకు మోదీ ఎందుకు సిగ్గుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. నిజానికి 'సహరా డైరీల్లో' షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఈ పత్రాల ప్రామాణికతను ఆమె కొట్టిపారేశారు. మరోవైపు ఈ పత్రాల ఆధారంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సహరా, బిర్లా కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. యూపీ సీఎం అభ్యర్థిగా షీలాను కాంగ్రెస్ పార్టీ తొలగించే అవకాశముందని, ఆమె యూపీలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను కొట్టిపారేసిన షీలా.. తాజాగా సహరా, బిర్లా ముడుపుల వ్యవహారంలో ప్రధాని మోదీ స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించారు.