-
కెవ్వు క్రాష్!
యూరప్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్లు విధిస్తారనే భయాలు చెలరేగాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా భారీగానే నష్టపోయింది. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల ఎగువన నిలదొక్కుకోగలిగినా, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 11,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. 1,052 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ బలహీనంగానే మొదలైంది. మధ్య మధ్యలో లాభాల్లోకి వచ్చినా, ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైంది. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభం కావడంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల జోరు పెరిగింది. చివరి గంటలో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరోదశలో 907 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 1,052 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు– కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 9 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ భారీగా నష్టపోయినా దాదాపు 140 షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, వీఎస్టీ టిల్లర్స్, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎందుకీ పతనం.. బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు...! ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్లు 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్ కన్సార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్(ఐసీఐజే) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టాయి. ఇక భారత్ విషయానికొస్తే, 2010–17 మధ్య ఇలాంటి అక్రమ లావాదేవీలు 400కు పైగా జరిగాయని వీటి విలువ వంద కోట్ల డాలర్ల మేర ఉంటుందని అమెరికాకు చెందిన ఫిన్సెన్(ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్) పేర్కొంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక అవకతవకలు తదితర అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ఈ లావాదేవీల కారణంగా దేశంలోకి 48 కోట్ల డాలర్లు అక్రమంగా వచ్చాయని, 40 కోట్ల డాలర్లు వెళ్లాయని ఫిన్సెన్ పేర్కొంది. దాదాపు భారత్లోని అన్ని బ్యాంకులకు ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. యూరప్లో మళ్లీ లాక్డౌన్! రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో తాజాగా ఆంక్షలు విధించారు. మరోవైపు రోజుకు 6,000 మేర కరోనా కేసులు నమోదవుతుండటంతో (మన దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయి) దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన యూరప్ ఇన్వెస్టర్లు బ్యాంక్, టూరిజమ్, వినియోగ రంగ షేర్లను తెగనమ్మారు. ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఆరంభంలోనే 3 శాతం మేర క్షీణించిన యూరప్ మార్కెట్లు చివరకు 4 శాతం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఆవిరి కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా తదుపరి సుప్రీంకోర్ట్ జడ్జి ఎవరనే విషయంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య పోరు తప్పదనే భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నివురుగప్పిన నిప్పులా సరిహద్దు ఉద్రిక్తతలు... సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా భారత్–చైనాల మధ్య చర్చలు ప్రారంభమైనా, సరిహద్దుల్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, ఈ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఈ గురువారమే ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటం, నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల రేంజ్లో ఉండటంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రూ. 4.23 లక్షల కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.4.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,23,140 కోట్లు దిగజారి రూ.154.76 లక్షల కోట్లకు పడిపోయింది. విలువలు అధికంగా ఉన్నాయ్.. షేర్ల విలువలు అసమంజసమైన స్థాయిల్లో ఉన్నాయని, ఈ విలువలను షేర్లు నిలుపుకోలేవన్న ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కొంత కాలం పాటు మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఒడిదుడుకులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
నీలికిరోసీన్ మారుతోంది
పాతగుంటూరు, న్యూస్లైన్: అసలే వేసవికాలం. విద్యుత్ సరఫరా ఉండటమే లేదు. అంతా కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. చిన్నపాటి పనికి కూడా లాంతర్ల అవసరం కలుగుతోంది. కొందరు వంటకోసం కూడా కిరోసిన్ వినియోగిస్తున్నారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను రేషన్ డీలర్లకు వరంగా మారింది. లబ్ధిదారులకు అందించాల్సిన కిరోసిన్ ఎంచక్కా అక్రమ వ్యాపారులకు అప్పగించేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కిరోసిన్ లోడ్ వస్తోందని తెలియగానే అక్రమవ్యాపారులు అక్కడ వాలిపోతారు. మొత్తం కిరోసిన్ వారికి అప్పగించేసి కొద్దిపాటి సరకును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పైగా రెండు నెలలకోసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామంటూ బహిరంగంగానే లబ్ధిదారులకు చెబుతున్నారు. స్టాకు రాలేదనీ, ఎన్నాళ్లవరకు మీకోసం ఎదురు చూడాలని ఇలా రకరకాలుగా లబ్ధిదారులకు ఎదురు ప్రశ్నలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధికమొత్తాలు చెల్లించి బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. జిల్లాలోని బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ, క్రోసూరు, రాజుపాలెం, నకరికల్లు, దుర్గి మండలాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే డీలర్లు, కిరోసిన్ హాకర్లు వ్యాపారులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుంటూరు నుంచి సరఫరా కేంద్రానికి వెళ్లే మార్గంలోనే కిరోసిన్ ఇచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2704 రేషన్ షాపులు, 780 కిరోసిన్ హాకర్లు ఉన్నాయి. జిల్లాలో 14500 మంది కార్డుదారులకు ప్రతీనెలా 22 వేల కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా కావాల్సి ఉంది. కానీ అందులో పావువాటా కూడా కార్డుహోల్డర్లకు అందడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ వ్యాపారులు ముందుగానే డీలర్లకు నగదు చెల్లిస్తారు. ఆ మొత్తాలను డీడీల రూపంలో చెల్లించి సరకు తెచ్చుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రెండు, మూడు నెలలపాటు కిరోసిన్ వారికి అప్పగించేసి, ఇతర సరకులు అమ్ముకోవడం ద్వారా సంపాదించింది సొంతానికి వాడుకుంటున్నారని తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ.. పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరకు డీర్లకు చేర్చేందుకు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అయితే కిరోసిన్ రాత్రివేళ తరలిస్తుండటంతో రూట్ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలేదని, ముందుగానే వారితో కుదుర్చుకున్న ఒప్పందంతో వారు కనీసం వాటిని పరిశీలించడం లేదని తెలుస్తోంది. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేసినపుడే కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించేసి, ఎటువంటి కేసులు తమవరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: డీఎస్ఓ రవితేజనాయక్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి రవితేజనాయక్వద్ద న్యూస్లైన్ ప్రస్తావించగా కిరోసిన్ సరఫరాపై ఇప్పటివరకూ తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని, వచ్చిన తరువాత రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేంగాకుండా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తామని, అక్రమంగా కిరోసిన్ను తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement