-
హోండా కార్లు కొనేవారికి చేదువార్త! ఆ మోడళ్ల ధరల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది. హైదరాబాద్ ఎక్స్షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది. మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు.. -
హోండా జాజ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్షిప్ హ్యాచ్ బ్యాక్ కారు జాజ్లో ఎక్స్క్లూజివ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. పెట్రోలు సీవీటీ వేరియంట్గా మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్ వేరియంట్ హోండా జాజ్ ధరను రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూం,ఢిల్లీ) నిర్ణయించింది. కారు బయటా, లోపల స్టయిలిష్ డిజైన్తో రేడియంట్ రెడ్, ఆర్చిడ్ వైట్ పర్ల్ కరల్స్ లో దీన్ని ఆవిష్కరించింది. దీంతోపాటు హోండా అమేజ్, హోండా డబ్యుఆర్-వీ లో కూడా ప్రత్యేక ఎడిషన్ను తీసుకొచ్చింది. హోండా అమేజ్ ధర రూ.7.86లక్షలుగా, డబ్యుఆర్-వీ ధరను రూ.9.35లక్షలుగా నిర్ణయించింది. జాజ్ తప్ప మిగిలిన రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో లభ్యమవుతున్నాయి. -
కొత్త హోండా అమేజ్ లాంచ్
-
తెలంగాణలోకి కొత్త హోండా అమేజ్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నేడు తన ‘హోండా అమేజ్’ సెకండ్ జనరేషన్ వెర్షన్ను హైదరాబాద్లో విడుదల చేసింది. అంతా కొత్త ప్లాట్ఫామ్పై ఈ కారును కంపెనీ రూపొందించింది. దీని ఎక్స్షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా పేర్కొంది. డీజిల్ సీటీవీ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. భారత కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేసినట్టు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. హెచ్సీఐఎల్ వ్యాపారాలకు బలమైన పునాదుల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుంది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు నుంచి రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయి. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతా కొత్త డిజైన్, అధునాతనమైన, విశాలమైన ఇంటీరియర్, మరింత సమర్థవంతమైన పవర్ట్రెయిన్, అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, అధునాతన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీలు ఈ కారు ఆఫర్ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వాహనాన్ని ఢిల్లీలో లాంచ్ చేశారు. నేడు(మంగళవారం) కంపెనీ హైదరాబాద్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
హోండా అమేజ్లో రెండో జనరేషన్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో సెకండ్ జనరేషన్ వెర్షన్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఈ, ఎస్, వీ, వీఎక్స్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. తాజా కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుందని వివరించింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు– రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు– రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయని పేర్కొంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కొత్త ప్రోడక్టులను మార్కెట్లో తీసుకువస్తాం. అలాగే వచ్చే మూడేళ్ల కాలంలో మరో మూడు కొత్త ప్రోడక్టులను ఆవిష్కరిస్తాం’ అని హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో గకు నకనిశి తెలిపారు. హోండా సిటీ మాదిరిగానే సెకండ్ జనరేషన్ అమేజ్ కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందని ధీమా వ్యక్తంచేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement