-
కేసును తప్పించే యత్నంలో అడ్డంగా బుక్కయ్యాడు
వైఎస్సార్ : కడపలో హోమియోపతి డాక్టర్ అన్నపూర్ణమ్మ హత్య కేసులో ఆమె భర్త దాస లక్ష్మయ్యను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణమ్మ హత్య విషయమై పోలీసులు లక్ష్మయ్యను విచారించగా.. కుటుంబ కలహాలతోనే భార్య తలపై సుత్తితో కొట్టి హతమార్చినట్లు లక్ష్మయ్య ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును తప్పింబోయే ప్రయత్నంలో లక్ష్మయ్య పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు. కాగా అన్నపూర్ణమ్మ డిసెంబరు 22న ఓం శాంతి నగర్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణమ్మ ఒక్కగానొక్క కూతురు జార్జియాలో మృతి చెందింది. అయితే కుమార్తె శవాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్నపూర్ణమ్మ లక్షల్లో అప్పు చేసింది. అయితే చేసిన అప్పులో తనకు కొంతమేర నగదు ఇవ్వాలని లక్ష్మయ్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అన్నపూర్ణమ్మ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో ఆమె తలపై సుత్తితో బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న భార్యను తీసుకెళ్లి సమీప ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్ల వద్ద అసలు విషయాన్ని గోప్యంగా ఉంచిన లక్ష్మయ్య కింద పడి గాయాలపాలయ్యందని.. ఆమెకు చికిత్స చేయాలని కోరాడు. డాక్టర్లు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
కనిపించే దైవం: 60 ఏళ్లుగా ఉచిత వైద్యం
సాక్షి, ముంబై : ప్రాణాంతక కరోనా వైరస్ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి మరీ వైద్యులు, ఇతర సిబ్బంది తమ అమూల్యమైన సేవలందిస్తున్నారు. అనేకమందిని కాపాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రాంచంద్ర దండేకర్ (87) మరింత ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారికి భయంతో చాలామంది సీనియర్ సిటిజన్లు ఇంటినుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. కానీ ఈ సీనియర్ వైద్యుడు మాత్రం మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ రోగుల వద్దకే వెళ్లి ఉచితంగా తన సేవలందించడం విశేషం. వైద్యులు దేవుడితో సమానమనే మాటకు నిలువెత్తు నిదర్శనం రాంచంద్ర దండేకర్. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో కూడా దీన్ని అక్షరాలా నిజం చేస్తున్నారు. హోమియోపతి, ఆయుర్వేద వైద్యుడైన రాంచంద్ర కరోనా బారిన పడ్డ వారితోపాటు, ఇంటింటికి వెళ్లి నిరుపేదలకు సేవలందిస్తున్నారు. కరోనా సోకినట్టు అనుమానం వస్తే.. సంబంధిత రోగులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఇందుకోసం తన సైకిలుపై రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. కనీసం చెప్పులుకూడా లేకుండానే గత 60 ఏళ్లుగా సైకిలు పైనే వెళ్లి మరీ చికిత్స అందిస్తున్నారట. ఎప్పటిలాగానే తన పనితాను చేస్తున్నానని దండేకర్ చెప్పుకొచ్చారు. గ్రామీణ పేదలకు నిస్వార్థంగా సేవచేయడం కొనసాగించాలనుకుంటున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో రోజుకు 20 ఇళ్లను సందర్శిస్తారని దండేకర్ కుమారుడు గర్వంగా చెబుతున్నారు. తన వెంట మొబైల్ ఫోన్, కనీసం వాచ్ కూడా తీసుకెళ్లరని వెల్లడించారు. మరీ దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే.. బస్సులో వెళ్లి, అక్కడ మళ్లీ సైకిల్ మీదే తన సేవలను కొనసాగిస్తారనీ, ఆలస్యమైతే గ్రామంలోనే ఎవరో ఒకరి ఇంట్లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఇంటికి వస్తారని తెలిపారు. అందుకే ఆయన్ను అంతా 'డాక్టర్ సహబ్ ముల్ వాలే' అని పిలుచుకుంటారు. 1957-58లోనాగ్పూర్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుంచి డిప్లొమా పూర్తి చేసిన దండేకర్ చంద్రపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్గా సంవత్సరం పనిచేశారు. ఆ తరువాత మారుమూల గ్రామాల్లో వైద్య సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి, సామాన్య వైద్యులదాకా అందిన కాడికి దోచేస్తున్నఈ తరుణంలో రాంచంద్ర సేవలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దేశంలో కోవిడ్-19 అత్యంత ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 42,633 మంది మరణించారు. -
అవతలివాళ్ళకు కష్టం వచ్చిందంటే... అమ్మే మొక్కుకొనేది!
సూర్యకాంతం... సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. విచిత్రమైన మాటవిరుపు, విసురైన చేతి వాటంతో తెరపై గయ్యాళితనం వెలిగించిన నట సూర్యమణి ఆమె. సూర్యకాంతమనే పేరే గయ్యాళి తనానికి మారుపేరన్నంత పేరు తెచ్చిన ఆమె నిజజీవితంలో ఆ స్క్రీన్ ఇమేజ్కు పూర్తి భిన్నంగా శాంతమూర్తి. ఆపదలో ఉన్నవాళ్ళెవరైనా సరే వాళ్ళ కోసం దేవుడికి మొక్కే ప్రేమమూర్తి. అందరికీ వండి వడ్డించే మాతృమూర్తి. మరి, ‘పొన్నాడ’ వారి ఇంట పుట్టి, ‘పెద్దిభొట్ల’ వారింట మెట్టి, అక్క కొడుకునైన తననే సొంత కొడుకుగా పెంచుకున్న ‘అమ్మ’ గురించి ఆమె దత్తపుత్రుడు ఏమంటారు? ఇవాళ సూర్యకాంతం 90వ జయంతి సందర్భంగా, మునుపెన్నడూ పత్రికల్లోకి ఎక్కని మాజీ బ్యాంకు ఉద్యోగి, హోమియో డాక్టర్ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి ‘అమ్మ’ గురించి ఆత్మీయంగా పంచుకున్న ముచ్చట్లు... మా అమ్మ సూర్యకాంతం నిజానికి నాకు స్వయానా పిన్ని. నన్ను దత్తత తీసుకొని, కన్నబిడ్డలా పెంచి, పిన్నే నాకు అమ్మ అయింది. అమ్మ పుట్టింది ఇప్పటికి సరిగ్గా 90 ఏళ్ళ క్రితం. కాకినాడకు 8 కిలోమీటర్ల దూరంలోని వెంకట కృష్ణరాయ పురంలో. తాతయ్య పొన్నాడ అనంతరామయ్య ఆ ఊరికి కరణం. మా అమ్మమ్మ (వెంకట రత్నం), తాతయ్యలకు అమ్మ సూర్యకాంతం 14వ సంతానం. ఆ 14 మందిలో మిగిలింది నలుగురే! మూడో బిడ్డ నాకు జన్మనిచ్చిన తల్లి సత్యవతి అయితే, కడగొట్టు బిడ్డ - అమ్మ సూర్యకాంతం. మా తాతయ్య జ్ఞాపకంగా నాకు అనంత పద్మనాభమూర్తి అని అమ్మ పేరు పెట్టింది. అందుకే పేరుతో కాకుండా, ‘నాన్నా’ అనే పిలిచేది. నా కన్నతల్లి వారింటి పేరు నిలపడం కోసం నాకు ‘దిట్టకవి’ అనే ఇంటిపేరే కొనసాగించింది. మద్రాసు బండిలో... అమ్మ, అమ్మమ్మ అమ్మ సినిమాల్లోకి రావడం గమ్మత్తుగా జరిగింది. అమ్మకు ఆరేడేళ్ళ వయసులోనే తాతయ్య చనిపోయారు. దాంతో, కొన్నాళ్ళు కాకినాడలో తన పెద్దక్క, బావల దగ్గర అమ్మ పెరిగింది. అయితే, చదువు ఒంటబట్టలేదు. చిన్నతనంలో అమ్మ కొద్దిగా పెంకి. పృథ్వీరాజ్ కపూర్ హిందీ చిత్రాలంటే తగని పిచ్చి. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి హిందీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పుడే సినిమాల మీద మక్కువ కలిగింది. చివరకు పెద్దక్క ఒప్పుకోకున్నా, అమ్మ, ఆమె వెంటే మా అమ్మమ్మ మద్రాస్కు బండెక్కే శారట. ‘నారద నారది’ (1946) అమ్మ తొలి సినిమా. గమ్మత్తేమిటంటే, అమ్మ మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకున్నా, సినీ రంగంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే క్యారెక్టర్ వేషాల వైపు మళ్ళారు. దానికి ఓ కారణం ఉంది. మద్రాసులో అమ్మ ఒకసారి రోడ్డు మీద వెళుతుంటే, ఓ యాక్సిడెంట్ జరిగింది. ముక్కు మీద మచ్చ పడింది. అది క్లోజప్లో తెలిసిపోతుందని గ్రహించి, నాయిక పాత్రలకు దూరంగా ఉన్నానని అమ్మే స్వయంగా చెప్పింది. అంతకు ముందు ఎన్నో పాత్రలతో పేరు తెచ్చుకున్నా ‘గుండమ్మ కథ’ (’62) నుంచి ‘సూర్యకాంతం శకం’ ఆరంభమైందని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభ చివరి దాకా కొనసాగింది. భానుమతికి ‘సూర్యం’... అంజలీదేవికి ‘అమ్మ’ సినీ రంగంలోని తోటి నటీనటులందరికీ అమ్మంటే ప్రాణం. తొలి రోజుల నుంచి నటి భానుమతి గారికి అమ్మతో మహా దోస్తీ. ఆవిడ కష్టసుఖాలు ఈవిడకీ, ఈవిడ కష్టసుఖాలు ఆవిడకీ చెప్పుకొనేవారు. అంత ఆంతరంగికులు. భానుమతి గారు అమ్మను ‘సూర్యం’ అని పిలిచేవారు. అలాగే, అంజలీ దేవి అమ్మను సాక్షాత్తూ కన్నతల్లిగా భావించేవారు. తెర మీద ఇద్దరూ ప్రత్యర్థుల్లా కొట్టుకున్నట్లు కనిపించినా ఛాయాదేవి, అమ్మ మంచి స్నేహితులు. మా ఇంట్లో శుభ కార్యాలన్నిటికీ ఆమె వచ్చేవారు. ఇక, కాంచన, గీతాంజలి, రమాప్రభ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. రాధాకుమారి అయితే వారానికి ఒకసారి అమ్మను కలవాల్సిందే. పండుగ, పబ్బం ఏదొచ్చినా తోటి నటులకు అమ్మ ఉండాల్సిందే. నటి - మాజీ ముఖ్య మంత్రి జయలలిత తల్లి సంధ్యతో అమ్మకు సాన్నిహిత్యం. తెరపై గయ్యాళి భార్య... ఇంట్లో నాన్నకు అనుకూలవతి నాన్న గారు పెద్దిభొట్ల చలపతిరావు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. మద్రాసుకొచ్చి, హైకోర్ట్లో వకీలుగా స్థిర పడ్డారు. ప్రసిద్ధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీగల్ అడ్వైజర్. ఆయనకు నాటకాలన్నా, పద్యాలన్నా తగని ప్రేమ. పద్యాలు బాగా పాడేవారు. ఆ కళాభిరుచితోనే 1950లో అమ్మను ద్వితీయ కళత్రంగా చేసుకున్నారు. తెరపై గయ్యాళి భార్యగా కనిపించే అమ్మ, జీవితంలో భర్త మనసెరిగి ప్రవర్తించే అనుకూలవతైన ఇల్లాలు. నాన్న కూడా అమ్మ మీద ఎప్పుడూ ఎలాంటి షరతులూ పెట్టలేదు. సినిమా వాతావరణం, ఆ భేషజాలు ఇంట్లో ఎక్కడా ఉండేవి కాదు. సాదా మధ్యతరగతి జీవితాన్నే అమ్మ ప్రేమించింది. వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి, రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే నన్ను దత్తత తీసుకున్నారు. వారి బిడ్డగా పెరగడం అదృష్టం. కుటుంబ సభ్యుల మీద అమ్మకెంత ప్రేమంటే, రాత్రి నిద్ర మధ్యలో లేచినప్పుడు ఒక్కసారి అందరినీ చూసొచ్చి కానీ పడుకొనేది కాదు. ఆ అలవాటే నాకూ వచ్చింది. విపరీతమైన భక్తి... విచిత్రమైన మొక్కులు అమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు చేస్తుండేది. రోజూ తెల్లవారుజామున 4.30 కల్లా లేచి, స్నానాదికాలు ముగించుకొని, లక్ష్మీదేవికీ, వెంకన్నకీ ఓ అరగంట పూజ చేసి, అన్నపూర్ణాదేవికి పాలు నైవేద్యం పెట్టిన తరువాత కానీ బయటకు వెళ్ళేది కాదు. ఉదయం 7.30 కల్లా వంట చేసేసి, షూటింగ్కు వెళ్ళేది. తిరుమలలో అమ్మ పేరు మీద కాటేజీ ఉంది. రెండు నెలలకోసారి తిరు మల వెళ్ళాల్సిందే! అలాగే, సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ గుడి అంటే అమ్మకు మహాభక్తి. నెలనెలా వెళ్ళాల్సిందే! అప్పట్లో ఆ గుడి ఇంత ప్రాచుర్యం పొందలేదు, పెద్దదీ కాలేదు. చిన్న గుడి, బయటకు ఓపెన్గా ఉండేది. వచ్చే పోయేవారి కోసం అక్కడ గుడి పక్కనే గది కట్టించి, వసతులు కల్పించింది. అలాగే, ఏడాదికి ఒకసారి బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాద్రి అప్పన్న - ఇలా అందరినీ దర్శించుకొని రావాల్సిందే! సినిమాల్లో గయ్యాళిగా చేసిందే కానీ, అమ్మ స్వభావం అందుకు పూర్తి వ్యతిరేకం. పైకి గంభీరంగా, నిబ్బరంగా కనిపించినా, సున్నిత మనస్కురాలు. ప్రేమ అయినా, బాధ అయినా ఆమె పైకి పెద్దగా వ్యక్తం చేసేది కాదు. తనలో తానే ఉండేది. అందరి మంచీ కోరుకొనేది. ఆమెకు నమ్మకాలు ఎక్కువ. తన, పర భేదం లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ క్షేమం కోసం ‘దేవుడా! దేవుడా!’ అంటూ, మొక్కులు మొక్కడం అమ్మలోని ప్రత్యేక లక్షణం. ఆమె ఊతపదాన్ని ఆ మధ్య సినిమాల్లో కూడా పెట్టినటు ్లన్నారు. అలాగే, ‘‘ఏంటి తల్లీ! రోజూ పూజ చేస్తున్నా. డబ్బులివ్వవేంటీ?’’ అని మనం దరితో మాట్లాడుతున్నట్లే అమ్మవారితో అమ్మ మాట్లాడేది. నిర్మాత, దర్శకులను కన్న తల్లితండ్రుల్లా భావించేది. వాళ్ళ క్షేమం కోసమే తపించేది. పనివాళ్ళకు అనారోగ్యం వచ్చినా అంతే! ‘అదృష్టవంతులు’ చిత్ర సమయంలో ప్రమాదం జరిగి, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కారు మధ్యలో ఇరుక్కొన్నారు. వెంటనే అమ్మ ఇంట్లో మా అందరితో ‘మృత్యుంజయ మంత్రజపం’ చేయించడం నాకిప్పటికీ గుర్తు. ‘బందిపోటు దొంగలు’ అవుట్డోర్ షూటింగ్లో నటుడు జగ్గయ్య గుఱ్ఱం మీద నుంచి పడిపోతే, నిర్మాతెంతో నష్టపోతాడన్న భయంతో రకరకాల మొక్కులు మొక్కుకుంది. ఆమె మొక్కుకొనే మొక్కులు కనీవినీ ఎరగనివి. ఉదాహరణకు, ‘బాల బాలాజీ వ్రతం’ అనేది! ప్రతి శనివారం అయిదుగురు చిన్నపిల్లల్ని తీసుకురమ్మనేది. వాళ్ళను వెతికి పట్టుకురావడం నా పని. రకరకాల వంటలు వండి, మడిగా వడ్డించేది. స్కూళ్ళకు వెళ్ళే లోపల ఇవన్నీ చేసి వాళ్ళకు పెట్టి, స్కూల్లో తినడానికీ కట్టి పంపించేది. ఆ వ్రతం ఎక్కడా ఉండేది కాదు.. ఆమె అనుకొని చేసేసేది. అంతే! ఆరోగ్యం బాగుపడుతుందంటే, దర్గాకూ పంపేది. పుస్తకాల పురుగు... పది భాషల్లో ప్రవీణ! అమ్మకు దానగుణం కూడా ఎక్కువే. ఉన్న దాంట్లోనే దాన దర్మాలు చేసేది. చిన్న చిన్న పత్రికలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచేది. మా అమ్మ స్కూలు చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే కానీ, నవలలు, పత్రికలు, పురాణాలు - ఇలా ఏ పుస్తకమైనా తెగ చదివేది. పొద్దున్నే ‘ఆంధ్రపత్రిక’ డైలీ కాస్త ఆలస్యంగా వస్తే చాలు... పేపర్ కుర్రాడికి అమ్మ చేత అక్షింతలు పడేవి. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలంటే అమ్మకు ఇష్టం. ఇంట్లో ఉంటే అందరం ఎవరికి వాళ్ళం పుస్తకాలు చదువుకోవడమే. బాపు జోక్స్ అన్నా, ముళ్ళపూడి అన్నా అమ్మకు భలే ఇష్టం. అమ్మకు ఓ చిత్రమైన అలవాటుండేది. విమాన ప్రయాణంలో ఇచ్చే బోర్డింగ్ పాస్లు మందంగా ఉంటాయి కాబట్టి, పుస్తకాల్లో వాటిని బుక్మార్క్లుగా వాడేది. ఆమెకు కుక్కలు, చేపల పెంపకమంటే తగని పిచ్చి. చివరి దాకా వాటిని వదులుకోలేదు. చిన్నప్పుడు పెద్దగా చదువుకోకపోయినా, మద్రాసుకు వచ్చాక ఇంగ్లీషు నేర్చుకుంది. పుస్తకాలు చదివి చదివి తెలుగులో ప్రావీణ్యం సంపాదించింది. రకరకాల భాషలు నేర్చుకోవడం అమ్మకిష్టం. ఆమెకు 10 భాషలు వచ్చు. 50 ఏళ్ళ వయసులో ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచీ అమ్మది ఎడమచేతివాటం. సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. సహజనటి అయిన అమ్మ ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగ్ వింటే, ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకొనేది. అయితే, బహిరంగ సభలకు రావడం, మాట్లాడడం తక్కువ. మైక్ ఇచ్చారంటే, మాట్లాడలేదు. నవ్వేసి కూర్చొనేది. ప్రసిద్ధ రచయిత కొవ్వలి తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను అమ్మకు అంకిత మిచ్చి, నాన్న గారి ద్వారా సభకు ఒప్పించారు. ఆ సభకు కృష్ణశాస్త్రి, కొడవటిగంటి లాంటివారంతా హాజరయ్యారు. తెర మరుగైన సూర్యకాంతి సహజ నటి అయిన అమ్మకు ‘పద్మశ్రీ’లు ప్రభుత్వాలు ఇవ్వలేదు కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆమె గురించి గొప్పగా మాట్లాడతారు. ఊహించని రీతిలో చుట్టుపక్కలి మిత్రులే శత్రువులవడంతో నాకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు, అసహజ రోడ్డు ప్రమాదం అమ్మను కుంగదీశాయి. మనోవేదనతో 1994లో అమ్మ కన్నుమూసింది. నమ్మిన వాళ్ళ పన్నాగాలతో మాకు ఆస్తిపాస్తులు, చివరకు అమ్మ ఫోటోలు సైతం మిగలలేదు. పాత ఇల్లు పడేసి కట్టినచోట ఈ ఒక్క ఫ్లాట్ దక్కింది. అయితేనేం, ఇవాళ్టికీ సూర్యకాంతం గారి అబ్బాయినంటే దక్కే గౌరవం, ప్రేమ అంతా ఇంతా కాదు. అమ్మ నాకిచ్చివెళ్ళిన పెద్ద ఆస్తి అదే! ఆ తృప్తి చాలు. సంభాషణ: రెంటాల జయదేవ అమ్మది అమృతం లాంటి వంట... అన్నపూర్ణ లాంటి మనసు! అమ్మ చేతివంట అమృతం. అమ్మ చేసే ములక్కాడల పులుసు, ఉల్లి పాయల పులుసు, పులిహోర లాంటివి నాలుగు రోజుల పాటు పాడవకుండా ఉండేవి. షూటింగ్లకు కూడా రెండు బుట్టల్లో నాలుగు క్యారేజీల నిండా భోజనం, మిఠాయిలు, చిరు తిండ్లు పట్టుకు వెళ్ళేది. అమ్మ షూటింగ్లో ఉందంటే, సెట్లోని వాళ్ళకు పండగే! ఎన్టీఆర్ సైతం ‘అక్కయ్య గారూ.. ఏం తెచ్చారు’ అని అడిగి మరీ వడ్డించుకొనేవారు. తెల్లవారుజామునే లేచి పూజ చేసుకొని, వంట చేసి, మాకు క్యారేజీలు కట్టి, తను సిద్ధమై క్యారేజీలు తీసుకొని మరీ షూటింగ్కు వెళ్ళేది. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలు... అప్పటికప్పుడు వాళ్ళ కోసం ఫలహారమో, మిఠాయిలో, చిరుతిండ్లో స్వయంగా వండి పెట్టేది. ఇంటికి వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఏదైనా తిని వెళ్ళాలి. లేకపోతే, ఆమె మనసు ఊరుకోదు. చివరలో అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఇంటికి వస్తే, పెట్టడానికని జంతికలు, పాలకాయలు, సున్నుండల లాంటివి కొని డబ్బాల్లో ఉంచేది. కూల్డ్రింక్ సీసాలు క్యాన్లకు క్యాన్లు తెప్పించి ఉంచేది. ‘నాయనా! నేను లేవలేనురా! అక్కడ ఉన్న ఆ కూల్డ్రింక్ తీసుకొని, ఆ ఓపెనర్తో మూత తీసుకొని, తాగి వెళ్ళరా!’ అని చెప్పేది. చనిపోయేదాకా ఆవిడలోని ఆ అన్నపూర్ణేశ్వరి లక్షణం పోలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement