breaking news
hemasri
-
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు. -
కన్నతల్లే కడతేర్చమంది !
‘మనమైనా చావాలి..నా కొడుకునైనా చంపేయాలి’ తమ సంబంధం బయటపడుతుందని..తల్లే తన కొడుకుని చంపేయమంది ఆటో డ్రైవరే కీలక నిందితుడు సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా గుర్తింపు చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు తిరుపతి అర్బన్, న్యూస్లైన్: ‘‘మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం భయడపడకూడదనుకుంటే మనమైనా చావాలి.. లేదా నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ ఓ తల్లి తన స్నేహితుడికి నూరిపోసింది. ఇదే అదునుగా అతను ఆమె కొడుకును కడతేర్చేశాడు. చిన్నారి మురళీధర్ రెడ్డి హత్యకేసును పోలీసు లు ఎట్టకేలకు ఛేదించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ విషయాలను డీఎస్పీ రవిశంకర్రెడ్డి శుక్రవారం సాయంత్రం అలిపిరి పోలీసుస్టేషన్లో విలేకరులకు తెలియజేశారు. వెదురుకుప్పం మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి తిరుమలలో అటెండర్గా పనిచేస్తూ స్థానిక సత్యనారాయణపురంలో కాపురముంటున్నాడు. ఆయనకు భార్య అరుణ, కొడుకు మురళీధర్రెడ్డి, కూతురు హేమశ్రీ ఉన్నారు. వీరి ఇంటికి ఎదురుగా వెదురుకుప్పం మండలం దేవళంపేట పంచాయతీ రామకృష్ణాపురానికి చెందిన సీ సోమశేఖరరాజు కుటుంబం నివాసముంటోంది. 17 ఏళ్ల క్రితం తిరుపతికి వచ్చిన సోమశేఖరరాజు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కొనుగోలు కోసం మునిరత్నంరెడ్డి ఆయనకు రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. సోమశేఖరరాజు భార్య ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్గా పనిచేస్తున్నారు. ఇదే స్కూల్లో మునిరత్నంరెడ్డి పిల్లలు చదువుకుంటున్నారు. మునిరత్నంరెడ్డి పిల్లలను ప్రతిరోజూ సోమశేఖర్రాజు తన ఆటోలోనే తీసుకెళ్లి స్కూల్లో వదిలేవాడు. రెండు కుటుంబాల మధ్య ఆరేళ్లుగా సాన్నిహిత్యం పెరిగింది. ఏడాది క్రితమే మునిరత్నంరెడ్డి కారును కొన్నారు. ఆ కారుకు తరచూ సోమశేఖర్రాజు డ్రైవర్గా వెళ్లేవాడు. రెండు కుటుంబాల వారు కలిసి గుళ్లుగోపురాలకు వెళ్లేవారు. ఆ సాన్నిహిత్యంతో సోమశేఖర్రాజుకు డబ్బు అవసరమైనప్పుడు మునిరత్నం రెడ్డి భార్య అరుణ ఇస్తుండేది. సోమశేఖర్రాజు భార్యాపిల్లలు కొన్ని రోజుల క్రితం పీలేరుకు వెళ్లారు. ఇంట్లో సోమశేఖర్రాజు ఒక్కడే ఉంటున్నాడు. ప్రతి రోజూ అరుణ ఆయన ఇంటికెళ్లి భోజనం ఇచ్చి వచ్చేది. గతనెల 28న అరుణ, సోమశేఖర్రాజు ఇంట్లో ఉండగా మునిరత్నంరెడ్డి కొడుకు మురళీధర్రెడ్డి కిటికీలో నుంచి చూశాడు. 30వ తేదీన అరుణ సోమశేఖర్రాజు ఇంటికెళ్లి ఈ విషయం గురించి తన కొడుకు ఇంట్లో చెబితే ఇద్దరికీ ప్రాణాపాయం ఉంటుందని చె ప్పింది. ‘‘మనమిద్దరమైనా చనిపోదాం, లేకుంటే నా కొడుకునైనా చంపేయాలి’’ అంటూ సోమశేఖర్రాజుకు చెప్పింది. అరుణ సూచన మేరకు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇంటి బయట ఆడుకుంటున్న మురళీధర్రెడ్డిని ఆటోలో కపిలతీర్థం మార్గంలో జూపార్కు మీదుగా చెర్లోపల్లి పెట్రోల్ బంకు వరకు వెళ్లాడు. అక్కడ రూ.150కు బాటిల్లో పెట్రోల్ పట్టుకుని తొండవాడ క్రాస్, డోర్నకంబాల మీదుగా చవటగుంట వరకు వెళ్లాడు. చీకటి పడ్డాక శానంబట్ల మెటల్ రోడ్డులోని ఓ మామిడి తోపునకు సమీపంలోని ముళ్ల పొదల వద్దకు మురళీధర్రెడ్డిని తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని గుర్తు పట్టలేని విధంగా పెట్రోల్ పోసి దహనం చేశాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు మురళీధర్రెడ్డి కోసం సోమశేఖర్రాజు అందరితోపాటు వెతుకుతూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. 30వ తేదీ రాత్రి అలిపిరి పోలీసు స్టేషన్లో తమ పిల్లాడు తప్పిపోయినట్లు మురళీధర్రెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 31వ తేదీ ఉదయం డోర్నకంబాల మెటల్ రోడ్డులో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన అలిపిరి పోలీసులు సోమశేఖర్రాజును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మరింత లోతుగా దర్యాప్తు జరిపి చిన్నారి తల్లి అరుణను కూడా అరెస్ట్ చేయనున్నారు. శభాష్ పోలీసు.. వారం రోజుల్లో చిన్నారి హత్య కేసును ఛేదించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో విచారణ ఆలస్యం కావడం పరిపాటి. ఈ కేసులో మాత్రం ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్రెడ్డి, అలిపిరి సీఐ రాజశేఖర్ తమదైన ప్రత్యేకతను కనబరిచి ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ సీ.సోమశేఖరరాజును అరెస్ట్ చేశారు.