breaking news
hemalatha missing
-
వధువు అదృశ్యం
పుట్టపర్తి అర్బన్ : పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. ఓ వధువు అదృవ్యం కావడం కలకలం రేపుతోంది. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి కథనం ప్రకారం... ఇదే మండలం చెర్లోపల్లికి చెందిన రఘునాథ్, రమాదేవి దంపతుల కుమార్తె హేమలత వివాహం నల్లమాడ మండలం నల్లశింగయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరమ్మ, నారాయణప్ప దంపతుల కుమారుడు నాగరాజుతో ఫిబ్రవరి 23న అయింది. పెళ్లైనప్పటి నుంచి కొత్త జంట అన్యోన్యంగానే ఉందన్నారు. ఈ నెల 5న హేమలతను పుట్టింటి నుంచి మెట్టినింటికి పిల్చుకువచ్చారు. ఈ నెల 8న ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. కుటుంబ సభ్యులు అంతటా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
గుత్తి : గుత్తిలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన సౌజన్య, వెంకటరాముడు దంపతుల కుమార్తె హేమలత(17) అదృశ్యమైనట్లు ఎస్ఐ చాంద్బాషా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ఆమె శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లిందన్నారు. ఆ తరువాత ఆరగంటకే ఇంటి నుంచి మాయమైందని, రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. పరీక్ష బాగా రాయలేదనే కారణంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.