breaking news
heavy rain water
-
‘నారింజ’కు భారీగా వరదనీరు
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్ మండలంలో 2.6 సెం.మీ, కోహీర్ మండలంలో 3.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు షటర్ల పైనుంచి కొద్ది మేర నీరు బయటకు పోయింది.మంగళవారం రాత్రి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల మేర నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది. -
రోడ్లపై ఏరులై పారుతున్న వర్షపు నీరు
-
వరదనీటిలో వోల్వో బస్సు..
తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు సాయం కోసం 40 మంది ప్రయాణికుల ఎదురుచూపులు గూడూరు(నెల్లూరు జిల్లా): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని చైతన్య ఆర్ట్స్ కాలేజీ సమీపంలో మంగళవారం ఉదయం ఓ వోల్వో బస్సు వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, అందులో ఉన్న ప్రయాణికులు వోల్వో బస్సు నుంచి కిందకు దిగితే వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. బస్సు తిరుపతి నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెగ్యూలర్ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం ద్వారా ఈ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఓ వైపు బస్సు దిగలేని పరిస్థితి, మరోవైపు సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని వారు సాయం చేయండంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. -
తిరుమల కాలిబాటలో వర్షపు నీరు