breaking news
Haripuram
-
ఆల్ ఇన్ వన్
పెనుకొండ రూరల్ : ఆల్ ఇన్ వన్.. టూ ఇన్ వన్.. వ¯Œన్ బై టు లాంటివి ఎప్పుడో ఒకసారైతే బానే ఉంటాయిగానీ సంవత్సరాల తరబడి వీటిని కొనసాగిస్తూనే ఉంటే చూసేవాళ్లక్కూడా మా చెడ్డ చిరాకేస్తుంది. ఆ పరిస్థితిని అనుభవించేవాళ్లు ఎంతటి శాంతమూర్తులైనా అప్పుడప్పుడూ వారికీ కోపం తన్నుకొస్తుంది. ఇలాంటి దుస్థితి పెనుకొండ మండలం హరిపురంలో దాదాపు పదిహేనేళ్లుగా ఉంది. ఈ గ్రామంలో ముప్పయేళ్ల క్రితం ఒకే గదితో భవనం నిర్మించి అందులో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. తర్వాత 15 సంవత్సరాల కిందట అంగన్వాడీ కేంద్రం కూడా మంజూరు చేశారు. అయితే ప్రత్యేక భవనం లేకపోవడంతో ఈ కేంద్రానికి తాత్కాలికంగా పాఠశాల గదినే కేటాయించారు. టూఇ¯ŒS వ¯ŒS అనుకున్నారో, వ¯Œన్ బై టు అనుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే వదిలేశారు. ప్రస్తుతం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులున్నారు. అంగ¯ŒSవాడీ కేంద్రంలో 10 మంది పిల్లలున్నారు. అంగ¯ŒSవాడీ పిల్లల ఆలనా, పాలనా, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాల బోధన ఎంత ఇబ్బందికరమైనా ఆ గదిలోనే సాగిపోతున్నాయి. అంగ¯ŒSవాడీ పిల్లల సామగ్రి, విద్యార్థుల మధ్నాహ్న భోజన సరుకులు, వంట, భోజనం అన్నీ ఆ గదిలోనే చేయాల్సి వస్తోంది. దీంతో పాఠశాల టూకీగా చూసేవాళ్లకు టూ ఇన్ వన్గా, కొంత పరిశీలనగా చూసేవాళ్లకు ఆల్ ఇన్ వన్గా కనిపిస్తుంది. శాంతమూర్తులు అంగ¯Œన్వాడీ కార్యకర్త గంగాభవాని, ఆయా నారాయణమ్మ 15 ఏళ్లుగా ఎంతో ఓపికతో ఇబ్బందులను అధిగమిస్తూ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యాసాగర్ కూడా నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు అని మాత్రం చెప్పవచ్చు. ఎలాగంటే పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నందున ఈ గ్రామంలో బడి మూసేసే పరిస్థితి నెలకొంది. ఇక అప్పుడు అంగ¯ŒSవాడీ కేంద్రం ఒక్కటే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారమైపోయినట్లే. -
అరటిగెలల మధ్య ఎర్ర చందనం..
అనంతపురం : ఎర్ర చందనం స్మగ్లర్లు తమ పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. తాజాగా వాహనంలో అరటి గెలల మధ్య ఎర్రచందనాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పెనుకొండ మండలం హరిపురం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం బయటపడింది. కాగా స్మగర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. -
హరిపురం వీఆర్వో నివాసంపై ఏసీబీ దాడి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వీఆర్వో ఉషారాణి నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేశారంటూ ఉషారాణిపై బాధితులు ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. కాగా ఉషారాణి సోంపేట మండలం మామిడిపల్లి వీఆర్వోగా పని చేస్తున్నారు. -
రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్న పోలీసులు
విశాఖ : విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామ దేవత సంబరాల్లో భాగంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రికార్డింగ్ డాన్సులకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.