breaking news
Hardeep
-
హర్దీప్ ‘పసిడి’ పట్టు
ఏథెన్స్ (గ్రీస్): అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్ గ్రీకో రోమన్ స్టయిల్లో భారత యువ రెజ్లర్ హర్దీప్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన 110 కేజీల విభాగం ఫైనల్లో హర్దీప్ 3–3 పాయింట్లతో యజ్దాన్ రెజా డెల్రూజ్ (ఇరాన్)పై గెలుపొందాడు. ఇద్దరి స్కోర్లు సమమైనప్పటికీ... నిబంధనల ప్రకారం చివరి పాయింట్ హర్దీప్ సాధించడంతో భారత రెజ్లర్కు స్వర్ణం ఖరారైంది.యజ్దాన్కు రజతం దక్కింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన నాలుగో రెజ్లర్గా 16 ఏళ్ల హర్దీప్ గుర్తింపు పొందాడు. గతంలో వినోద్ కుమార్ (45 కేజీలు; 1980లో).. పప్పూ యాదవ్ (51 కేజీలు; 1992లో)... సూరజ్ (55 కేజీలు; 2022లో) ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం ఆసియా అండర్–17 విభాగంలో చాంపియన్గా ఉన్న హర్దీప్... తొలి రౌండ్లో 2–0తో బక్తూర్ సొవెట్ఖాన్ (కజకిస్తాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–2తో తొమెల్కా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో అనతోలి నవచెంకో (ఉక్రెయిన్)పై, సెమీఫైనల్లో 4–2తో ఎమ్రుల్లా కప్కాన్ (టర్కీ)పై విజయం సాధించాడు. హరియాణాలోని ఝాజర్ జిల్లాకు చెందిన హర్దీప్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రస్తుతం హర్దీప్ బహదూర్గఢ్లోని ‘హింద్ కేసరి’ సోనూ అఖాడాలో ధర్మేందర్ దలాల్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. మరో నాలుగు పతకాలు ఖాయం... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు మరో నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు రచన (43 కేజీలు), మోనీ (57 కేజీలు), అశ్విని విష్ణోయ్ (65 కేజీలు), కాజల్ (73 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈరోజు జరిగే ఫైనల్స్లో జిన్ హువాంగ్తో రచన... మద్ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో మోనీ, ముఖాయో రఖిమ్జొనోవా (ఉజ్బెకిస్తాన్)తో అశ్విని; వెన్జిన్ కియు (చైనా)తో కాజల్ తలపడతారు. -
హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? భారత్పై నిందకు కుట్ర?
అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్, జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ తన సంచలన వాదన వినిపించారు. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వెనుక చైనా లక్ష్యం.. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య వైషమ్యాలను సృష్టించడమేనని ఆ బ్లాగర్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో హర్దీప్ నిజ్జర్ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని జెంగ్ ఆరోపించారు. 2023, జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ను తపాకీతో కాల్చిచంపారు. కాగా జీ-20 సమ్మిట్ నుండి కెనడాకు తిరిగి వచ్చిన తరువాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పలు దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఈ బ్లాగర్ తన వీడియోలో నిజ్జర్ హత్యకు ముందు సీసీసీ తన ఉన్నత అధికారులలో ఒకరిని అమెరికాలోని సీటెల్కు పంపిందని పేర్కొన్నారు. అక్కడ రహస్య సమావేశం జరిగిందన్నారు. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. కెనడాలో సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని బ్లాగర్ జెంగ్ పేర్కొన్నారు. జూన్ 18న సీసీసీ ఏజెంట్లు తుపాకీలతో నిజ్జర్ను వెంబడించారని బ్లాగర్ పేర్కొన్నారు. వారు అతనిని కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి నిజ్జర్ కారు డాష్బోర్డ్లో అమర్చిన కెమెరాను పగలగొట్టారని అన్నారు. హంతకులు ఉద్దేశపూర్వకంగానే భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. సీసీసీ రహస్య ఏజెంట్లు భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రణాళికలో భాగంగానే ఈ పని చేశారని బ్లాగర్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వీడియోలో పోస్ట్ చేయగా, జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి! Exclusive: #CCP Kills #Sikh Leader #Nijjar in #Canada To Frame #India, as Part of “#IgnitionPlan" to Disrupt Worldhttps://t.co/cZOalFxZfE#HardeepSinghNijjar, #assassination, #IndiaCanadaRelations, #ChinaIndiaRelations #IsraelPalestineWar pic.twitter.com/RD240btPbU — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) October 8, 2023 -
భారత రెజ్లర్లకు నిరాశ
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో తొలి రోజు గ్రీకో రోమన్ విభాగంలో పోటీపడిన నలుగురు భారత రెజ్లర్లు హర్దీప్ (98 కేజీలు), యోగేశ్ (71 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (75 కేజీలు), రవీందర్ ఖత్రి (85 కేజీలు) నిరాశపరిచారు. ఈ నలుగురిలో ఒక్కరు కూడా కనీసం రెండో రౌండ్ను దాటలేకపోయారు. రెండో రౌండ్ బౌట్లలో హర్దీప్ 2–5తో విలియస్ లారినైటిస్ (లిథువేనియా) చేతిలో... యోగేశ్ 1–3తో తకెషి ఇజుమి (జపాన్) చేతిలో... రవీందర్ ఖత్రి 0–8తో విక్టర్ లోరింజ్ (హంగేరి) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ బౌట్లో గుర్ప్రీత్ సింగ్ 1–5తో మిందియా సులుకిద్జె (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత రెజ్లర్లను ఓడించిన వారందరూ క్వార్టర్ ఫైనల్స్లోనే వెనుదిరగడంతో... మనోళ్లకు రెప్చేజ్ రౌండ్లలో పోటీపడి కనీసం కాంస్య పతక బౌట్లకు అర్హత సాధించే అవకాశం లేకుండాపోయింది. పోటీల రెండోరోజు మంగళవారం భారత రెజ్లర్లు జ్ఞానేందర్ (59 కేజీలు), రవీందర్ (66 కేజీలు), హర్ప్రీత్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలోకి దిగుతారు. -
హత్యకేసులో 21 మందికి ఊరట
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి పాంటీ చద్దా, అతని సోదరుడు హర్దీప్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21 మంది నిందితులపై హత్యానేరం కింద నమోదైన అభియోగాలను స్థానిక కోర్టు మంగళవారం రద్దు చేసింది. అయితే మిగతా సెక్షన్లను మాత్రం ఉపసంహరించలేదు. ఉత్తరప్రదేశ్ మైనారిటీల సంఘం అధిపతి సుఖ్దేవ్ సింగ్ నామ్ధారి కూడా నిందితుల్లో ఒకరు. నామ్ధారి, అతని అంగరక్షకుడు సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు మోపింది. దీని కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్షపడే అవకాశముంటుంది. 2012, నవంబర్ 17న ఈ హత్యలు హఠాత్తుగా జరిగి నట్టు అనిపిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హర్దీప్ స్వయంగా పాంటీ, నరేందర్ (పాంటీ మేనేజర్)పై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. దీంతో పాంటీ మరణించగా, నరేందర్కు గాయాలయ్యాయి. అందుకే 21 మందిపై హత్యానేరం అభియోగాలను రద్దు చేయడంతోపాటు నామ్ధారి, సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేసామన్నారు. మిగతా 19 మందిపై హత్యాయత్నం, అల్లర్లు సృష్టించడం తదితర అభియోగాలు నమోదు చేస్తారు.