breaking news
hanumantha pressmeet
-
అజారుద్దీన్ మనవాడా, కాదా? : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హెచ్సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజారుద్దీన్ కి జరిగిన అవమానం పై పాకిస్తాన్ కోడై కూస్తుందన్నారు. అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..? అని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ మనవాడా కాదా?.. అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ హెచ్సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు. తాను రాజకీయ కుట్రలతో హెచ్సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ కరీంనగర్ లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. 8నెలల కింద నెలకొల్పిన ప్యానల్ కి శేష నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ప్రస్తుత ప్యానల్ కి ఎన్నో సంవత్సరాలు హెచ్సీఏని పాలించిన వినోద్ కి పెద్ద పోస్ట్ కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేష నారాయణ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంకి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్టేడియంలో ఇచ్చే టికెట్ల మీద విశాఖ సంస్థ పెరుపెట్టుకొని విక్రయాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వాళ్లను బెదిరించి రూ. లక్షలు వసూళ్లు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్లు కలిసి హెచ్సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకట స్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12లక్షలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వీహెచ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్సీఏలో ప్రెసిడెంట్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. -
మోసగించినందుకే చంపా
నన్ను, అమ్మనూ బ్లాక్మెయిల్ చేసింది నా చదువు నాశనమైపోయింది అందుకే లాయర్ సునీతను చంపా ప్రధాన నిందితుడు హనుమంతరావు వెల్లడి కణేకల్లు (రాయదుర్గం) : తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకుని, మోసం చేసి, రెచ్చగొట్టి, బ్లాక్మెయిల్ చేయడం వల్లే లాయర్ సునీతను చంపానని ప్రధాన నిందితుడు హనుమంతరావు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. లాయర్ సునీత హత్య కేసులో ప్రధాన నిందితుడు, అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం సీఐ బి.చలపతిరావు, కణేకల్లు ఎస్ఐ జి.యువరాజులు మీడియాకు వెల్లడించారు. అప్పు కోసం వెళితే.. కణేకల్లుకు చెందిన భజంత్రీ లక్ష్మమ్మ కుమారుడు భజంత్రీ హనుమంతరావు 2014లో బెంగళూరులోని ఎస్ఆర్జీసీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువుకు రూ.50వేలు డబ్బు అవసరం కావడంతో లక్ష్మమ్మ తనకు పరిచయమైన లాయర్ సునీత భర్త హరీష్కుమార్ను అప్పు కోసం ఆశ్రయించింది. మాగాణి భూమి పత్రాలిచ్చి తనఖా పెడితే ఇతరుల నుంచి డబ్బు ఇప్పిస్తామని చెప్పారు. సరేనని పత్రాలు ఇచ్చి డబ్బు అడిగితే.. ఇచ్చేవారు ఊళ్లో లేరని, ఒక నెల ఆగితే ఇప్పిస్తామంటూ కాలయాపన చేశారు. భూమి రిజిస్ర్టేషన్ చేస్తే గానీ డబ్బు ఇవ్వం అని చెబుతున్నారని చెప్పడంతో గత్యంతరం లేక లక్ష్మమ్మ బెంగళూరులో ఉన్న తన కుమారుడిని పిలిపించి విషయాన్ని చెప్పింది. రిజిస్ట్రేషన్కు ముందు కొంతైనా డబ్బు ఇవ్వాలని తల్లీకొడుకులు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ రోజే ఇస్తామని లాయర్ సునీత పేర్కొంది. మరుసటి రోజు లాయర్ సునీత చెప్పినట్లు రూ.100, రూ.10 స్టాంప్ పేపర్లను తీసుకొని తల్లీకొడుకులు లాయర్ వద్దకొచ్చారు. అయితే డబ్బిచ్చే వారు అత్యవసర పని వల్ల రాలేకపోయారని స్టాంప్ పేపర్లపై మీరు సంతకాలు చేసి వెళ్లండి.. డబ్బు రేపు ఇప్పిస్తానని నమ్మించింది. వారు సరేనని చేశారు. ఆ తర్వాత నుంచి రేపు, మాపు అంటూ డబ్బు కోసం తిప్పుకుంటూ వచ్చారు. కోర్టు ద్వారా నోటీసులు.. విసిగిపోయిన హనుమంతరావు బెంగళూరు నుంచి కణేకల్లుకు వచ్చి లాయర్ను కలిసి ‘మీ అప్పు అక్కరలేదు.. మా పత్రాలు, స్టాంప్పేపర్లు ఇచ్చేయండి’అంటూ ఒత్తిడి చేయగా.. ఆ పత్రాలు ఇతరులతో ఉన్నాయని ఇప్పిస్తానని చెప్పింది. అనంతరం లక్ష్మమ్మ, ఆమె కుమారుడు సర్వే నంబర్ 334, 986బీ, 238ఏలో ఉన్న 3.15 ఎకరాల భూమిని రూ.29.28లక్షలకు అమ్మకానికి అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు స్టాంప్ పేపర్లో రాసుకుంది. అంతేకాక రూ.15లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్లు పొందుపరిచింది. మిగిలిన రూ.14.28లక్షలు తీసుకొని తమకు భూమి రిజిస్ట్రేషన్ చేయించాలంటూ కోర్టు ద్వారా నోటీసు పంపింది. పెద్దలతో పంచాయితీ.. కోర్టు నోటీసుల విషయమై తల్లీకొడుకులు లాయర్ను ప్రశ్నించగా.. ఆమె గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. చివరికి తాము కోర్టు ద్వారా నోటీసులు పంపేందుకు కోర్టుకు తిరిగేందుకు రూ.1.70లక్షలు ఖర్చు అయ్యిందని ఆ మొత్తం చెల్లిస్తే మీ పత్రాలు, అగ్రిమెంటు కాపీలు ఇచ్చేస్తానని డిమాండ్ చేసింది. గ్రామ పెద్దలు రూ.1.50లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చారు. ఈ మేరకు అనంతపురం కోర్టులో రూ.1.50లక్షలు చెల్లించి తల్లీకొడుకులు సమస్యను పరిష్కరించుకున్నారు. తల్లీకొడుకులు లాయర్ను పెట్టుకొని కోర్టుకు తిరిగేందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చు అయ్యింది. అప్పు, సొప్పులు చేసి కోర్టు వరకెళ్లి సమస్య పరిష్కరించుకొన్నారు. ఈ క్రమంలో హనుమంతరావు చదువుకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. రెచ్చగొట్టిందిలా.. ఈ నెల 15న హనుమంతరావు కణేకల్లులోని లాయర్ సునీత ఇంటి సమీపంలో ఉంటున్న తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లాడు. అప్పుడు అతడిని చూసిన లాయర్ ఏం చేయగలవంటూ సైగలతో రెచ్చగొట్టింది. అప్పటికే కోపంతో ఉన్న హనుమంతరావు తన స్నేహితుడు వరప్రసాద్కు జరిగింది చెప్పాడు. సాయంకాలం వెళ్లి సునీతను ప్రశ్నిద్దామని స్నేహితుడు సూచించాడు. దీంతో పథకం ప్రకారం హనుమంతరావు కూరగాయలు కోసే చాకును వెంట తీసుకొని వరప్రసాద్తో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. సునీత ఉన్న గదిలోకి ప్రవేశించి నీ భర్తతో మాట్లాడాలి రమ్మని చెప్పు గర్జించాడు. నా దగ్గరే మాట్లాడు అంటూ ఆమె అంది. ఆమె వరప్రసాద్తో మాట్లాడుతుండగా వెనుక నుంచి హనుమంతరావు ఆమె మెడను ఒక చేత్తో పట్టుకొని చాకుతో గొంతుకోసేశాడు. ఆ తర్వాత తలుపులకు గడియ పెట్టే రాడ్తో కూడా గొంతులోకి గుచ్చాడు. చనిపోయే దాకా కాళ్లతో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడు హనుమంతరావు తన స్నేహితుడు వరప్రసాద్తో కలిసి శుక్రవారం తహసీల్దార్ ఆర్.వెంకటశేషు ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు.