-
మ్యాడ్ హనీ: అధిక మోతాదులో తీసుకుంటే డేంజరే
తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది... దాని తీయటి రుచి చిన్నారులకూ తెగ నచ్చుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అదే తేనె మనకు హాని కలిగిస్తే?! శారీరక, మానసిక అనారోగ్యానికి దారితీస్తే? అయినప్పటికీ వేల ఏళ్లుగా ఇది వాడకంలోనే ఉంటే..! ఏమిటీ విచిత్రం అని అవాక్కవుతున్నారా? ఆగండాగండి.. అన్ని ప్రాంతాల్లో లభించే సాధారణ తేనె రకాల్లో ఈ లక్షణాలు ఉండవులెండి. కేవలం నేపాల్లోని హిమాలయ పర్వతసానువుల్లో లభించే అత్యంత అరుదైన, ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనదిగా పరిగణించే ‘మ్యాడ్ హనీ’లోనే ఈ ప్రత్యేకత ఉంది. దీన్ని పరిమిత మోతాదులో సేవిస్తే కాస్త కళ్లుతిరగడంతోపాటు చెప్పలేనంత ఉత్తేజం, ఉల్లాసం లభిస్తుంది. అందుకే దీన్ని ‘మ్యాడ్’ హనీ అని పిలుస్తారు. పర్వత ప్రాంతాల్లో పెరిగే రోడోడెండ్రాన్ జాతి మొక్కలు ఉత్పత్తి చేసే గ్రెయనోటాక్సిన్ అనే రసాయనం మకరందం, పుప్పొడిలో ఉండటం, వాటినే తేనెటీగలు సేకరించడం ఈ తేనెలో విచిత్ర లక్షణాలకు కారణం. కానీ ఉల్లాసం కలిగిస్తుంది కదా అని దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం డేంజరే. వాంతులు, మూర్ఛ, భాంత్రి భావనలతోపాటు అరుదైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. చదవండి: పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్ ఏ పవర్ దీనికితోడు మామూలు తేనె తియ్యగా ఉంటే ఈ తేనె భరించలేనంత చేదుగా ఉంటుంది! మరి ఇంత ప్రమాదకరమైన తేనెను తీసుకోవడం ఎందుకంటారా? లైంగిక సామర్థ్యం పెంచే ఔషధంగా, ఉదర సంబంధ వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతుల్లో దీన్ని వాడుతున్నందుకే. దీన్ని సేకరించడమూ ఎంతో కష్టంతో కూడుకున్నదే. సముద్రమట్టానికి 3,900 అడుగుల నుంచి సుమారు 11,800 అడుగుల ఎత్తులో కొండల అంచున తేనెటీగలు తేనెపట్టును భద్రపరుచుకుంటాయి. అందుకే అనుభవజ్ఞులైన స్థానికులకే ఈ తేనె సేకరణ సాధ్యం. ఇది ఎక్కువగా నేపాల్లోనే లభిస్తున్నప్పటికీ టర్కీలోని నల్ల సముద్ర ప్రాంతంలోనూ దొరుకుతుందట. క్రీస్తుపూర్వం 2,100 నుంచే మ్యాడ్ హనీ పర్వత ప్రాంతాల్లో లభిస్తోందని 2018లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. -
11 మంది మరణం: అతడే సూత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చేధించారు ఢిల్లీ పోలీసులు. మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు తెలిపారు. ఎవరీ లలితభాటియా... నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45). తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కూడా ఇతనే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు ‘కనిపించినప్పటి నుంచి’. కనిపించడం ఏంటంటే లలిత్ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు భాటియా. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. మోక్షం పొందాలనే కోరికతో... మంత్ర, తంత్రాలపై ఉన్న మూఢనమ్మకంతోనే ఇలా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. మొదటి నుంచి అందరిలోనూ రేకెత్తిన అనుమానాలకు పేపర్లలో ఉన్నచేతి రాతలను గుర్తించడం ద్వారా సమాధానం దొరికిందని పోలీసులు చెప్పారు. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలే కుటుంబ సభ్యులందరిని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలు... 11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్మార్టం నివేదికలు వచ్చాయి. ఉరితీత వల్ల వారి మరణాలు సంభవించినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని నివేదికలు పేర్కొన్నాయి. మృతుల నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. ఇంతమంది మృతదేహాలను రాజస్థాన్లోని స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం కష్టం కనుక ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని వారు నిర్ణయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement