-
ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి అయింది: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్
-
జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీలో బదిలీలు జరుగుతున్నాయి. కమిషనర్ లోకేశ్కుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్ సీఈఓగా ఇప్పటికే బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీలోని నలుగురు జోనల్ కమిషనర్ల(జడ్సీ)ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ.. ► సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్రెడ్డిని నగరంలోనే ఎంతో కీలకమైన, ఐటీతో పాటు వివిధ సంస్థలు కొలువుదీరిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉన్న మునిసిపల్ పరిపాలన శాఖ అడిషనల్ డైరెక్టర్ జె.శంకరయ్యను జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ► ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఎస్.పంకజను ఆ పోస్టు నుంచి రిలీవ్ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న అడిషనల్ డైరెక్టర్ ఎన్.రవికిరణ్ను శ్రీనివాస్రెడ్డి స్థానంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్విస్తారు. ► చార్మినార్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.అశోక్ సామ్రాట్ను సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్గా బదిలీ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న టి.వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్గా నియమించారు. ► సీడీఎంఏలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆర్.ఉపేందర్రెడ్డిని జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్గా నియమించారు. ఆ విభాగం అడిషనల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వి.మమతను అక్కడినుంచి రిలీవ్ చేశారు. చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.సుధాంశ్కు శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా జడ్సీలకు మినహాయింపు.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.పంకజ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతకు ఈ బదిలీల్లో మినహాయింపు నిచ్చారు. వారిని ఎక్కడికీ బదిలీ చేయకపోవడమే కాక వారికి అదనంగా ఉన్న పోస్టుల్లో ఇతరులను నియమించారు. ఇక వారు జోన్లపైనే పూర్తిస్థాయి శ్రద్ధతో పనిచేసే అవకాశం ఉంటుంది. గత బదిలీల సందర్భంగా వీరిద్దరూ తాము బదిలీ అయిన స్థానాలను పరస్పరం మార్చుకోవడం తెలిసిందే. జడ్సీల బదిలీల్లో పైరవీలు పనిచేశాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే డిప్యూటీ కమిషనర్ల బదిలీలు కూడా జరగనున్నట్లు సమాచారం. -
‘టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో’
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం సహాయంతో మేయర్, ఉప మేయర్ పదవులు దక్కించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిన విషయం నిజమైందని చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికపై జరిగిన పరిణామాలపై గురువారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండూ పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్ఎస్కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైనదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతివంతమైన రాజకీయం చేయాలని భావిస్తే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సిందని సూచించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా ఆ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను సహించారని, అవకాశం వచ్చినా ప్రతి సారి కర్రు కాల్చి వాటా పెడతారని తెలిపారు. -
బల్దియా పీఠానికి దారేది?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ రావడంతో మేయర్ పీఠం ఎవరికి, ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బల్దియాలో అతిపెద్ద పారీ్టగా అవతరించిన టీఆర్ఎస్కు పీఠం దక్కించుకోవడానికి ఉన్న మార్గాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ ఎన్నికకు మరో రెండు నెలల సమయం ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రేటర్ కుర్చీని దక్కించుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎంఐఎంతో అధికారిక పొత్తు మొదటిది కాగా, మేయర్ ఎన్నిక రోజున ఎంఐఎం గైర్హాజరు కావడం రెండో మార్గంగా కనిపిస్తోంది. ఇక, ఎంఐఎం కూడా మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ ఎలాగూ పోటీలో ఉంటుంది కనుక ఎక్స్అఫీషియో సభ్యుల సాయంతో ఎక్కువ ఓట్లు తెచ్చుకుని టీఆర్ఎస్ బల్దియా పీఠంపై కూర్చుంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్కు మేయర్ పీఠం దక్కాలంటే మాత్రం ఎంఐఎం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకువెళ్లాలనే దానిపై టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కుతుందన్న నమ్మకం ఉండటంతోనే భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కడం ఖాయమే అని, ఏ వ్యూహంతో దాన్ని దక్కించుకోవాలన్న దానిపై శనివారం మరింత స్పష్టత వస్తుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం లెక్క ఇదీ.. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను నేరేడ్మెట్ మినహా మిగతా 149 డివిజన్ల ఫలితాలను ప్రకటించగా, టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీహెచ్ఎంసీలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి మొత్తం 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండగా, ఇందులో టీఆర్ఎస్కు 31 మంది బలం ఉంది. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే మొత్తం ఓటర్ల సంఖ్య 195. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 98 మంది (మేజిక్ ఫిగర్) మద్దతు అవసరం ఉంటుంది. ఎక్స్అఫీíÙయో సభ్యులను కలిపితే టీఆర్ఎస్కు 86, బీజేపీకి 51, ఎంఐఎంకు 54, కాంగ్రెస్కు ముగ్గురు సభ్యుల బలం ఉంది. దీంతో అటు కమలనాథులకు, ఇటు కాంగ్రెస్కు మేయర్ పీఠం గెలుపొందే అవకాశం లేనే లేదు. -
‘గ్రేటర్’ తెచ్చిన కరోనా
ఆదిలాబాద్టౌన్: కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రెండు రోజుల క్రితం పదిలోపే కరోనా కేసులు నమోదవుతుండగా, గురువారం ఏకంగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో జనాల్లో భయాందోళన మొదలైంది. చాలా మంది ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని మరిచారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్, రైతుబజార్, దుకాణ సముదాయాల ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాసు్కలు ధరించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మందికి కరోనా వైరస్ లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసులకు కోవిడ్ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బుధవారం 14 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ కాగా, గురువారం నిర్వహించిన పరీక్షల్లో కూడా పలువురు పోలీసులకు కరోనా సోకినట్లు సమాచారం. అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులే.. సెకండ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పెండ్లీలు, విందులు, ఇతర కార్యక్రమాలకు హాజరైన వారు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో శుభకార్యాలు, ఇతర వాటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాసు్కలు లేనిదే బయటకు రావద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 1874 రిపోర్టు నెగిటివ్ రాగా, 10 నమూనాలు పెండింగ్లో ఉన్నాయి. కాగా ఇద్దరు కోలుకున్నారు. ఇప్పటివరకు 40 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్నగర్లో 1, అటెండర్కాలనీలో 1, బెల్లూరిలో 1, భుక్తాపూర్లో 1, చాందా(టి)లో 5, కలెక్టర్చౌక్లో 1, దుర్గానర్లో 2, ఎంప్లాయీస్ కాలనీలో 1, గ్రీన్ సిటీలో 1, కైలాస్నగర్లో 2, కోలిపురలో 1, కృష్ణనగర్లో 1, కుమ్మర్వాడలో 1, మహాలక్ష్మీవాడలో 1, మావలలో 1, న్యూహౌసింగ్బోర్డులో 2, పోలీస్ క్వార్టర్లో 1, రాంనగర్లో 1, రాంపూర్లో 1, రవీంద్రనగర్లో 2, రిక్షా కాలనీలో 2, సంజయ్నగర్లో 5, శాంతినగర్లో 4, టైలర్స్ కాలనీలో 2, టీచర్స్కాలనీలో 1, తిర్పెల్లిలో 1, ఇచ్చోడలోని అడెగాం(బి)లో 1, ఇచ్చోడ పీఎస్లో 2, ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో 1, జైనథ్లోని ఆనంద్పూర్లో 1, ఉట్నూర్లోని బోయవాడలో 1, కొత్తగూడలో 1, సేవదాస్నగర్లో 1, ఉట్నూర్లో 1, ఉట్నూర్ పీఎస్లో 6, నేరడిగొండలో 1, బుగ్గారం(బి)లో 1, ఇంద్రవెల్లి పీఎస్లో 2, తలమడుగులోని ఝరిలో 1, సిరికొండలోని తిమ్మపూర్లో 1, సుంగాపూర్లో 1 చొప్పున కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement