breaking news
GDP forecast
-
ప్రాతిపదిక ఏడాది మార్పు..?
స్థూల దేశీయోత్పత్తిని కచ్చితంగా లెక్కించేందుకు ప్రాతిపదికగా ఉన్న 2011-12 ఏడాదిని 2022-23కు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్(ఏసీఎన్ఏఎస్)కు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ(మోస్పి) త్వరలో సూచనలు జారీ చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థను కచ్చితంగా లెక్కించేందుకు ప్రస్తుతం 2011-12 ఏడాదిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. 12-13 ఏళ్ల కిందటి ఏడాదిని ప్రామాణికంగా తీసుకుని వృద్ధిరేటును లెక్కించడం సరికాదని కొందరు భావిస్తున్నారు. దాంతోపాటు కొత్తగణనలో కొన్ని వస్తువులను తొలగించాలని సూచిస్తున్నారు. కొత్త బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించే గణాంకాలు ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ జారీ చేసే సూచనల ఆధారంగా 2022-23 బేస్ ఇయర్లో యూనికార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వే, గృహ వినియోగ వ్యయ సర్వే(హెచ్సీఈఎస్) వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త గణనలో లాంతర్లు, వీసీఆర్లు, రికార్డర్లు వంటి వస్తువులను తొలగిస్తారు. స్మార్ట్ వాచ్లు, ఫోన్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులను తీసుకురానున్నారు. జీడీపీ లెక్కింపులో జీఎస్టీ కౌన్సిల్ డేటాను పరిగణనలోకి తీసుకోనున్నారు. అనధికారిక రంగాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియజేసేలా అత్యాధునిక క్యాలిక్యులేషన్స్ వాడబోతున్నట్లు తెలిపారు. జీఎస్టీఎన్ నమూనా ఫ్రేమ్ వర్క్ ఆధారంగా యాన్యువల్ సర్వే ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఏఎస్ఎస్ఎస్ఈ) నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
స్టాక్ మార్కెట్లకు జీడీపీ సెగ..
ముంబై : జీడీపీ అంచనాలను ఆర్బీఐ తగ్గించడం, వడ్డీరేట్లలో కోత వంటి చర్యలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకు షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 నుంచి 6.1 శాతానికి ఆర్బీఐ కుదించడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 434 పాయింట్ల నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 139 పాయింట్లు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,174 పాయింట్ల వద్ద క్లోజయింది. బ్యాంకింగ్ సహా పలు రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. -
భారత్ జీడీపీ అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతానికి కుదిస్తున్నట్లు ఫ్రాన్స్కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబా వెల్లడించింది. గతంలో ఇది 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. చిన్నపాటి అలజడి వేగంగా పెను సంక్షోభం స్థాయికి పెరిగిపోతోన్న నేపథ్యంలో వృద్ధి అంచనాలు తగ్గించినట్లు బీఎన్పీ తెలిపింది. రూపాయి బలహీనత, విద్యుత్ వ్య యాలు పెరిగిపోతుండటం, విధానపరమైన అనిశ్చితి ఇందుకు కారణమవుతున్నాయని వివరించింది. వచ్చే 6-9 నెలల్లో సమస్యలు తీవ్రరూపు దాలుస్తాయని పేర్కొంది. 2014-15లో పరిస్థితులు కాస్త మెరుగై జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది.