breaking news
ganbhir
-
ఐదుగురు పెద్ద ఆటగాళ్లకు నో ప్లేస్
ముంబయి : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా మొదలు కానున్న వరల్డ్కప్-2015లో ఆడనున్న భారత క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ కు 30మంది ఎంపికయ్యారు. అంచనాలకు అనుగుణంగా యువతకే పెద్ద పీట వేశారు. గత ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లను సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఇక శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఊతప్ప, మురళీవిజయ్, పాండే, పుజారా, ఉన్ముక్ చంద్ తదితర 11 మంది బ్యాట్స్మెన్ టీమ్లో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు వికెట్ కీపర్లలో ధోని, సాహా, శాంసన్ వున్నారు. 10 మంది మీడియం పేసర్లలో భువనేశ్వర్, ఆరాన్, ఇశాంత్, ఉమేష్లు వున్నారు. నలుగురు స్పిన్నర్లలో అశ్విన్తో పాటు అమిత్ మిశ్ర చోటు దక్కించుకున్నాడు. ఇద్దరు ఆల్ రౌండర్లు టీమ్లో వున్నారు. ప్రాబబుల్స్కు ఎన్నికైంది వీరే: * మహేంద్ర సింగ్ ధోనీ * విరాట్ కోహ్లీ *శిఖర్ ధావన్ *అజింక్య రహానే *రోహిత్ శర్మ *రవీంద్ర జడేజా *రవిచంద్రన్ అశ్వీన్ *అంబంటి రాయుడు *సురేశ్ రైనా *రాబిన్ ఉతప్ప *మురళీ విజయ్ *పర్వేజ్ రసూల్ *అమిత్ మిశ్రా *ఇషాంత్ శర్మ *భువనేశ్వర్ కుమార్ *మహ్మద్ షమీ *ఉమేశ్ యాదవ్ *వరుణ్ ఆరోన్ *ధవళ్ కులకర్ణి *స్టువర్ట్ బిన్నీ *కుల్ దీప్ యాదవ్ *మోహిత్ శర్మ *అశోక్ దిండా *అక్షర్ పటేల్ *కేదార్ జాదవ్ *మనోజ్ తివారీ *మనీష్ పాండే *వృద్ధిమాన్ సాహా *సంజు శాంసన్ *కరణ్ శర్మ -
రాయుడికి దక్కిన చోటు, సెహ్వాగ్, యువీలకు నిరాశ
ముంబయి : ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్షిప్లో పాల్గొనే డిపెండింగ్ చాంపియన్ టీమిండియా ప్రాబబుల్స్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడికి ప్రాబబుల్స్లో చోటు దక్కింది. ఇక 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్ సింగ్లకు చోటు దక్కలేదు. అలాగే జహీర్ ఖాన్లకు నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ప్రపంచకప్ జరుగుతుంది.