-
ఆ ఇద్దరి ఆట ఆకట్టుకుంది
భారత స్టార్ ఆటగాళ్లకు తొలి రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఫలితం ఎలా ఉంటుందోనని నాతోపాటు పలువురు ఆందోళన చెందారు. కానీ టీమిండియా సులభంగా విజయం సాధించడంతో సంతోషపడ్డ వారిలో నేనూ ఉన్నాను. ఇక రెండో వన్డేలో ఆ్రస్టేలియా గెలిచి సిరీస్ను సమం చేస్తే...రాజ్కోట్లో జరిగే చివరిదైన మూడో వన్డే మ్యాచ్కు స్టార్ ఆటగాళ్లతో భారత్ పూర్తిస్థాయి బలగంతో బరిలోకి దిగుతుంది. రోహిత్, కోహ్లిలాంటి ఇద్దరు అనుభవజు్ఞలైన బ్యాటర్లు లేకపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే సత్తా తమలో ఉందని తాజా గెలుపుతో కేఎల్ రాహుల్ బృందం నిరూపించింది. భారత భవిష్యత్కు ఢోకా లేదని చాటింది. టి20 తరహాలో కాకుండా నేర్పుగా ఆడి రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం ఆనందం కలిగించింది. గతంలో వారికి కొన్ని అవకాశాలు లభించినా టి20 తరహాలో దూకుడుగా ఆడి తమ వికెట్లను సమర్పించుకున్నారు. కానీ ఈసారి ఈ ఇద్దరూ సంయమనంతో ఆడి అలరించారు. శుబ్మన్ గిల్ తన అద్భుత ఫామ్ను కొనసాగించాడు. సొంత మైదానంలో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడనుకున్న దశలో అవుటవ్వడం నిరాశ కలిగించింది. మొహమ్మద్ షమీ బంతితో నిప్పులు చెరగడం ఆకట్టుకుంది. దాంతో కోచ్, కెపె్టన్ తుది జాబితాలో ముగ్గురు పేసర్లను ఆడించే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు. వికెట్లు తీసే బౌలర్లను ఆడిస్తే వారు ప్రత్యర్థి బ్యాటర్లు తొందరగా పరుగులు చేయకుండా నియంత్రిస్తారు. సమష్టి ఆటతీరుతో ఆకట్టుకోవడంతో సమీపంలో భారత క్రికెట్ మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తుందనే నమ్మకం పెరిగింది. -
రుతురాజ్ 187 నాటౌట్
బెల్గామ్: ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (136 బంతుల్లో 187 నాటౌట్; 26 ఫోర్లు, 2 సిక్స్లు) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడటంతో... శ్రీలంక ‘ఎ’తో గురువారం జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్లో భారత్ ‘ఎ’ 48 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. రుతురాజ్ రెండో వికెట్కు అన్మోల్ప్రీత్ సింగ్ (67 బంతుల్లో 65; 6 ఫోర్లు)తో కలిసి 163 పరుగులు... మూడో వికెట్కు ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, సిక్స్)తో కలిసి 99 పరుగులు జోడించాడు. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసి ఓడిపోయింది. షెహాన్ జయసూర్య (120 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. భారత ‘ఎ’ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. -
విరగబాటుకు విరుగుడు
విశ్లేషణ తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తనేమి చేసినా చెల్లు బాటు అవుతుందనుకునే గైక్వాడ్లాంటి ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగిన దానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు. రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమానంలో వేసిన వీరంగం ప్రవర్తన సహజం గానే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎయిర్ ఇండియా ఆయనను ప్రయా ణించడానికి అనుమతించడం లేక నిరాకరణను కొనసాగిం చడం ద్వారా ఎలాగోలా ఈ వివాదం పరిష్కారమయ్యే వరకూ అది కొనసాగు తుంది. ఈ విమాన ప్రయాణ నిరాకరణను కొనసాగిం చేట్టయితే, అది ఎప్పటి వరకు? పార్లమెంటు సమావే శాలకు హాజరు కావడానికి ఒక ఎంపీకి ఉన్న హక్కును నిరాకరించి సభా హక్కులను ఉల్లంఘించారంటూ లోక్ సభ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా, లేదా అనేది దాన్ని నిర్ణయిస్తుంది. గైక్వాడ్ ప్రతాపానికి గురైన విమానయాన సంస్థ వెంటనే ఆయనను తమ విమానాల్లో ప్రయాణించేది లేదంటూ నిషేధం విధించింది. దేశంలోపల విమాన సర్వీసులను నడిపే ఇతర సంస్థలు సైతం అదే దారి పట్టాయి. ఒక రాజకీయవేత్త, అందునా అత్యున్నత స్థాయిగల పార్లమెంటు సభ్యుని ప్రమేయం ఉన్న వ్యవహారం కాబట్టి ఈ రెండూ అసాధారణమైనవే. ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రభుత్వరంగ సంస్థ కావ డం వల్ల, కీలకమైన ఆ అత్యున్నత అధికారి ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం నియమించినవారు. కాబట్టి సాధా రణంగా లేనిపోని ఇబ్బందులు ఎందుకని మిన్నకుం టారు, ఒత్తిడులకు లొంగుతారు. ఈ వ్యవహా రంలో అలా జరగకపోవడం అత్యంత సంతోషదాయక పరి ణామం. ఈ ఉదంతాన్ని కూడా అలాగేSకప్పి పుచ్చి ఉంటే, నిజంగానే గైక్వాడ్ ఉచిత టికెట్తో విమాన మెక్కినప్పుడల్లా ఇలా చిందులేస్తుండేవారే. విమాన ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కనబడకుండా చేయాలని పట్టుబట్టడం ద్వారా ఎయిర్ ఇండియా... కాళ్లు నేలపై నిలవకుండా విర్రవీగే మన రాజకీయ ఉన్నత వర్గాన్ని కిందకు దించే విధికి సంబం« దించి గొప్ప పనే చేసింది. ఈ బాపతు వాళ్లు తిరిగి మళ్లీ ఎప్పుడు ఇష్టానుసారం అభ్యంతరకరంగా ప్రవర్తిం చడం ప్రారంభిస్తారో తెలియదు. కిరణ్ రిజ్జూ అనే మంత్రి తన సహచరులతో కలసి, సర్వీసులో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి సహా ముగ్గురిని విమానంలోంచి దించేసి మరీ ప్రయాణం చేసి ఎంతో కాలం కాలేదు మరి. మిగతా విమాన సంస్థలు (అన్నీ ప్రైవేటువే) కూడా ఈ నిషేధం కచ్చితంగా అమలయ్యేలా చేయా లని రిజర్వేషన్ల అభ్యర్థనలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలి స్తుండటం ప్రభుత్వ రంగ విమాన సంస్థకు మరింత ధైర్యాన్నిచ్చి, అది తన సంకల్పంపై పట్టు విడవకుండా నిలిచేలా చేసింది. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఒక అంశంపై ఒకరికొకరు పోటీదారులైన విమాన సంస్థ లన్నీ కలసికట్టుగా పనిచేయడం విశేషం. విర్రవీగే రాజ కీయ వర్గం వల్ల ఎంతో కాలంగా బాధలు పడుతున్న ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలుపుకోదగిన గొప్ప ప్రయోజనకర వైఖరి ఇది. అయితే, ఎయిర్ ఇండియా ఇలా దూకుడును ప్రదర్శించడానికి మరో కోణం కూడా ఉంది. డీజీసీఏ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎవరైనా వైఖరిని మెత్తబరుచుకోవాలని, ఆ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేయడం ఉత్తమమని మెల్లగా సూచిస్తే... ఆ సంస్థ ప్రజా సంబంధాల యంత్రాంగం ఆ పని చక్క బెట్టేసేదే. శివసేన నేత గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యో గుల సంఘం ఒకదానికి నేతగా ఉండటం వల్ల కూడా అలా చేయక తప్పేది కాదు. ఈ సమస్యతో వ్యవహరించే విషయంలో పార్టీల మధ్య రాజకీయాలు తెర వెనుక పనిచేస్తున్నాయని అను మానించడానికి తగు అవకాశం ఉంది. శివసేన, భార తీయ జనతా పార్టీతో సంఘర్షణాత్మక వైఖరిని అవ లంబిస్తోంది కాబట్టి అది కూడా ఈ వ్యవహారంలో ఉదా సీనంగా ఉంటూ శివసేన ఎంపీని ఈ ఇరకాటపు రుచిని చూడనిద్దామని నిర్ణయించిందనిపిస్తోంది. ఏ విమాన సంస్థా ఆయనకు బిజినెస్ లేదా ఎకానమీ క్లాసులు దేనిలోనూ సీటును రిజర్వు చేయడానికి నిరాకరిస్తుండ టంతో ఇప్పటికే ఆయన బాగా చమటలు కక్కారు. కనీసం ఇప్పటివరకైతే ఆయన ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతున్నట్టు లేదు. ఒక ఎంపీ అతి హేయంగా, హింసాత్మకంగా ప్రవ ర్తించడంపై ప్రతిస్పందించకుండా ఉండి తెలివిగా ప్రవ ర్తించింది. సదరు మంత్రిత్వశాఖ లేదా లోక్సభ సైతం ఈ విషయాన్ని పట్టించుకునేట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ శివసేన హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవే శపెడితే, అప్పుడు ఆ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుందా లేదా అనే దాన్ని బట్టే దాని వైఖరి వెల్లడవుతుంది. శివసేన లాంటి పార్టీ ఒక విమాన సంస్థను పట్టుకుని ‘‘గూండా’’, ‘‘కుమ్మక్కు ముఠా’’ అనడాన్ని ప్రజలు మెచ్చడం లేదు. తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తతనేమి చేసినా చెల్లుతుందని ఎగిరిపడే ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగినదానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు. ఎన్నిక కావడం అంటేనే ప్రజా న్యాయస్థానం తీర్పు చెప్పేసింది కాబట్టి, ఇక ఏ తీర్పుకూ ఏమంత విలువ లేదని అనడం, వినడం అసాధారణమేం కాదు. ఈసారి ఇంతవరకు ఇది భిన్నం గానే సాగుతోంది, విశేష హక్కులతో ఎగిరెగిరిపడేవారికి ఇదో గుణపాఠం కావాలి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు
బీసీలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
పోస్టల్ బ్యాలెట్లకు 7, 8 తేదీల్లో మరో అవకాశం
టీడీపీ కార్యకర్త దాష్టీకం
7, 8 తేదీల్లోనూ పోస్టల్ ఓటు వేసే అవకాశం
తరలిరండి
కొలువుల జాతర
No Headline
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement