breaking news
G Sandeep
-
'అనుకున్నవన్ని జరగవు కొన్ని'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు జి.సందీప్ మాట్లాడుతూ..'కథ అంతా రెడీ చేసుకుని నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్ చేశారు. అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయడానికి చాలామంది సహకరించారు. అలా నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను. నా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మీ అందరికీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.' అని అన్నారు. కిరీటి దామరాజు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా కాన్సెప్ట్. దర్శకుడు సందీప్ చక్కగా తీశారు.' అని అన్నారు. మౌనిక మాట్లాడుతూ.. 'ఏ నటికైనా ఓ సినిమా హిట్ అయ్యాకే అవకాశాలు వస్తాయి. కానీ నా కెరీర్ బిగినింగ్లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారు. నా మొదటి దర్శకుడు రామరాజు.. ఇప్పుడు సందీప్ నాకు అవకాశాలిచ్చారు. నా మొదటి సినిమా లాక్డౌన్ వల్ల థియేటర్లో విడుదల కాలేదు. ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. -
నల్లగొండ జిల్లాలో ‘క్విక్ యాక్షన్ టీం’ ఏర్పాటు
దామరచర్ల(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో సూర్యాపేట వంటి సంఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యేందుకు 8 మంది పోలీసులతో కూడిన క్విక్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ జి.సందీప్ తెలిపారు. మంగళవారం మండలంలోని అడవిదేవులపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది మందితో కూడిన ఈ బృంద సభ్యులకు ఆధునిక ఆయుధాలు సమకూర్చినట్లు వివరించారు. ఎలాంటి ఘటన జరిగినా తిప్పికొట్టేందుకు వారు సంసిద్ధులై ఉంటారని తెలిపారు. అలాగే, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా గ్రామ పోలీసు అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జన మైత్రి సంఘాలతో పాటు పల్లె నిద్ర పథకాలను చేపట్టడం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు.