breaking news
free school
-
రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి 18' గురువారం ఎపిసోడ్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన రోల్ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.కాన్పూర్లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న: ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడుఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్లైన్ ఎంచుకున్నారు. లైఫ్లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. నిజానికి అదే సరైన సమాధానం.‘అమిత్రఘాత’ అంటేమగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, సంస్కృత పదం,అమిత్రఘాతను గ్రీకులో 'అమిట్రోచేట్స్ అంటారు. -
మనసున్న పోలీసు.. సెలవుల్లో టీచర్.. పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు
లక్నో: పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు డ్యూటీ. క్షణం తీరిక లేని పని. ఎప్పుడైనా సెలవు దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి తన బాధ్యతలను నిర్వరిస్తూనే.. సెలవు రోజుల్లో టీచర్ అవతారమెత్తి పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ తానే అందిస్తున్నారు. ఆయనే.. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఎస్సై రంజిత్ యాదవ్. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు ఎస్సై రంజిత్ యాదవ్. ఉన్నత చదువులు చదవుకోవాలనే కోరికను వారిలో కలిగిస్తున్నారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు.. తదుపరి తరగతులకు వెళ్తామని చెబుతున్నారు.' మేము ఇంకా చదువుకోవాలి. స్కూల్కు వెళ్లాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడికి రోజూ వస్తాము.' అని ఓ చిన్నారి పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో, ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. తాను నివాసముండే ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు చెంది వారు, పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు రంజిత్ యాదవ్ తెలిపారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ‘నా సొంత పాఠశాలను ప్రారంభించాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ పిల్లలకు పాఠాలు బోధిస్తాను. వారి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటూ కనిపించటాన్ని చూసిన తర్వాత వారితో మాట్లాడాను. వారు పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు.’ అని తెలిపారు. ఆ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను పోలీసు అధికారే ఉచితంగా అందిస్తున్నారు. #Heartily #thanks 🙏✍️🙏@ANINewsUP @ayodhya_police @UpPolicemitra @igrangeayodhya @dubey_ips @navsekera @renukamishra67 @adgzonelucknow @dgpup @Uppolice शिक्षा है अनमोल रतन! https://t.co/lUphOUAjZn — Ranjeet Yadav 🇮🇳 (@RSupercop) July 21, 2022 ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
అమర సైనికుల పిల్లలకు రాందేవ్ స్కూలు
రాందేవ్ బాబా అనగానే ముందుగా మనకు యోగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత వేల కోట్లలో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. కానీ.. ఆయనలోని మరో కోణం ఇప్పుడు వెలుగు చూసింది. అమరులైన సైనికుల పిల్లల కోసం తాను ఈ ఏడాది 'పతంజలి ఆవాసీయ సైనిక్ స్కూల్' ఒకదాన్ని ప్రారంభిస్తానని రాందేవ్ ప్రకటించారు. ఇందులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతామని అన్నారు. ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ స్కూలు ఏర్పాటు కానుంది. గురువారం నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో రాందేవ్ బాబా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉన్న ఆస్తిని చారిటీ కోసం ఖర్చు చేయాలన్న లక్ష్యమే పతంజలి బృందాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన తెలిపారు. రాబోయే ఒకటి రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతిపెద్ద బ్రాండు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు లాభాలు సాధించడం మాత్రమే లక్ష్యం కాదని.. నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రజలకు సేవ చేయాలన్నదే ధ్యేయమని రాందేవ్ వివరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మరణించిన 25 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లల చదువులకు అయ్యే ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ప్రకటించాడు. शहीदों के बच्चों के लिए पतंजलि आवासीय स्कूल की शुरुआत होगी #ProsperityForCharity pic.twitter.com/oQmgsQJoBs — Swami Ramdev (@yogrishiramdev) 4 May 2017


