breaking news
Forevermark
-
ఐదేళ్లలో వజ్రాల డిమాండ్ రెట్టింపు
ముంబై: భారత్లో వజ్రాల వినియోగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్టు డీబీర్స్ గ్రూప్ (డైమండ్ కంపెనీ) సీఈవో అల్కుక్ తెలిపారు. భారత్లో ఫరెవర్మార్క్ బ్రాండ్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ వ్రజాభరణాలకు భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మారెŠక్ట్గా ఉన్నట్టు తెలిపారు. గతేడాది చైనాను అధిగమించినట్టు చెప్పారు. ఏటా 12 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం భారత్తో సహజ వజ్రభరణాల డిమాండ్ 10 బిలియన్ డాలర్లలోపు ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్ వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ముంబైలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫరెవర్మార్క్ స్టోర్లను తెరవనున్నట్టు.. వచ్చే ఐదేళ్లలో 100 స్టోర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. కంపెనీ సొంత స్టోర్లతోపాటు, ఫ్రాంచైజీ రూపంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల పరిధిలో ఇవి ఉంటాయన్నారు. ఫరెవర్మార్క్ బ్రాండ్కు ఓమ్నిఛానల్ (ఆన్లైన్, ఆఫ్లైన్) విధానం అనుసరిస్తామని డీబీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి తెలిపారు. ‘‘ఈ కామర్స్తోపాటు స్టోర్లను కూడా తెరుస్తున్నాం. భౌతిక స్టోర్ల అందుబాటు కూడా కీలకమే’’అని చెప్పారు. ఎల్జీడీలకు భవిష్యత్ ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు (ఎల్జీడీ) వాణిజ్య పరంగా భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కుక్ చెప్పారు. ఎల్జీడీల టోకు ధరలు 90 శాతం వరకు పడిపోయినట్టు తెలిపారు. ‘‘సహజ వజ్రాలు–ఎల్జీడీలకు మధ్య వ్యత్యాసంపై వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తాం. దీంతో ఈ రెండింటి మధ్య తేడా చెప్పలేరన్న అపోహ తొలగిపోతుంది. వజ్రం ధ్రువీకరణ ప్రభావం ఇక మీదట పెరిగేదే’’అని వివరించారు. భారత్లో సహజ వజ్రాలకున్న డిమాండ్ నేపథ్యంలో మార్కెటింగ్పై ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కుక్ తెలిపారు. సజహ వజ్రాలను టారిఫ్ పరిధి నుంచి అమెరికా మినహాయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో సహజ వజ్రాల గనులు లేకపోవడంతో అక్కడ ఉత్పత్తికి అవకాశం లేదన్నారు. -
దీర్ఘాయుష్మాన్ భవ!
మనిషి ఎన్నాళ్లు బతుకుతాడో గ్యారంటీ ఏమీ లేదు. అయినా సరే, ప్రతి ఒక్కరూ వీలయినంత ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. పెద్దలు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. అంతవరకూ బాగానేఉంది కానీ, అసలు ఏం చేస్తే మనం ఎక్కువకాలం జీవించగలమో... మన జీవిత ప్రయాణం ఒడుదొడుకులు లేకుండా హ్యాపీగా సాఫీగా ఎలా సాగుతుందో చెప్పే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దాం... మనిషి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసేది డి విటమిన్. అది సమృద్ధిగా లభించేది సూర్మరశ్మిలోనే. అందుకే పొద్దునా, సాయంత్రం ఎప్పుడు వీలయితే అప్పుడు ఒంటికి సూర్యరశ్మి తగిలేలా తిరిగితే సరి. కంటినిండా నిద్ర పోండి రోజుకు కనీసం 6గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అదీ రాత్రి నిద్ర. నిద్ర తక్కువైతే అనారోగ్య సమస్యలు తథ్యం. కాబట్టి కంటినిండా నిద్రపోతే సరి.. ఆయుష్షు అదే పెరుగుతుంది. పండ్లు తినండి రోజూ ఏదో ఒక పండు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల రుతువుల వారీగా దొరికే పండ్లు తినడం చాలా మంచిది. నొప్పి నివారణ మాత్రలు తగ్గించండి తలనొప్పి, ఒళ్లు నొప్పులు... వెన్ను నొప్పి...వంటి వాటికి సొంత పరిజ్ఞానంతో పెయిన్ కిల్లర్స్ వాడటం అలవాటు చాలామందికి. అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల హార్ట్ ఎటాక్ వంటి ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి, పెయిన్ కిల్లర్స్కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. పెళ్లి చేసుకోండి... ఒక స్టడీ ప్రకారం పెళ్లి చేసుకున్న స్త్రీలు లేదా పురుషులు అవివాహితులకన్నా 46 శాతం అధికంగా హృద్రోగానికి దూరంగా ఉంటారట. పెళ్లికాని వారితో పోల్చితే వివాహితులలో కార్డియో వాస్కులర్ డిసీజెస్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందట. సో... పెళ్లి చేసుకోవాల్సిందే మరి! నిల్వ వద్దు... తాజానే ముద్దు నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలలో పోషక విలువలు తగ్గిపోతాయట. అందువల్ల తాజా పండ్లు, కూరగాయలే మంచిదంటున్నారు పరిశోధకులు. చక్కెర తగ్గించండి చక్కెర ఎక్కువ వాడటమంటే కొలెస్ట్రాల్ ముప్పును పెంచుకున్నట్టే. సో... తీపి కోసం చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడటం మంచిది. కొంచెం కారంగా... పచ్చి లేదా పండుమిర్చిలో ఆయుష్షును పెంచే కారకాలేవో ఉన్నాయట. కారం ప్రభావాన్ని తగ్గించడానికి మెదడు ఎండార్ఫిన్లను ఎక్కువగా విడుదల చేస్తుందట. ఎండార్ఫిన్ల వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయట. అందువల్ల కారం తినండి. మంచి కాఫీ... మంచి ఆరోగ్యం రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు వచ్చే ముప్పు తప్పు తగ్గుతుందట. మీరు కాఫీ ప్రియులయితే ఇంకేం... ఇంచక్కా తాగేయండి స్ట్రాంగ్ కాఫీ. గింజలు తినండి గింజ ధాన్యాలు తినడం ఆరోగ్యానికి మంచిది. హార్వార్డ్ యూనివర్శిటీ స్టడీ ప్రకారం రోజూ గింజధాన్యాలు తినేవారిలో ముఖ్యంగా పొట్టు తీయని ధాన్యం, బ్రౌన్ రైస్ వంటివి తినేవారికి, అవి తినని వారితో పోల్చితే ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయట. గో గ్రీన్ ఇందాక కాఫీ తాగమన్నాం కదా అని టీ ప్రియులు బాధపడకండి... అయితే మామూలు మిల్క్ టీ కాదు... గ్రీన్ టీ! అవును, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. అందుకే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్, హృద్రోగ సమస్యలు రాకూడదనుకునేవారు రెగ్యులర్గా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యయుగంలోకి వెళ్లిపొండి ఇదేం కిరికిరి... మధ్యయుగంలోకి వెళ్లడమెలా అనుకుంటున్నారా? ఉద్దేశ్యం అది కాదు... మధ్యయుగం వాళ్లలా వీలయినంతగా పచ్చి కూరలు తినడం మంచిదట. వాటితోపాటు చేపలు, ఆలివ్ ఆయిల్, గుడ్లు తినడం హెల్దీ అట. ఆరోగ్యానికి హోల్ మిల్క్ ఏ కాడికీ వెన్న తీసిన పాలు, స్కిమ్డ్ మిల్క్ తాగమని చెప్పిన వారే కానీ, ఇలా హోల్ మిల్క్ తాగమని ఎవరూ చెప్పలేదే అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది కిటుకు... (ప్రత్యేకమైన ఆరోగ్య కారణాలుంటే తప్ప) వెన్న, నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచిదేనట. హోల్ మిల్క్ తాగేవారిలో ఆరోగ్య సమస్యలు ఇతరులకన్నా యాభైశాతం తక్కువగా తలెత్తుతాయని అధ్యయనాల్లో తేలిందట. తగినన్ని నీళ్లు తాగండి ఇది మొదటినుంచి వింటున్నదేననుకోండి... బాడీలో తగినన్ని ద్రవపదార్థాలు ఉంటే కోలోన్ క్యాన్సర్ ముప్పు తప్పుతుందట, అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయట. అందుకే వీలయినన్ని ఎక్కువ గ్లాసులు నీరు తాగండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు పరిశోధకులు. రాత్రి భోజనాన్ని తొమ్మిదికల్లా ముగించెయ్యండి రాత్రి తొమ్మిది దాటాక ఫుడ్ తినకుండా ఉండటం మంచిదట. బాగా పొద్దుపోయాక పడుకోబోయే ముందు తినడం, తిన్న వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. అందువల్ల వీలయినంత వరకు రాత్రి తొమ్మిదిలోగానే భోజనం ముగించెయ్యడం మంచిది మరి! ముందే చేతులు కడిగేసుకోండి భోజనానికి ముందే కాదు... కడుపు నిండక ముందే చేతులు కడుక్కోవాలి మరి! అంటే పొట్ట నిండేదాకా తినకూడదని దీని అర్థం. ఫుల్లుగా తినేబదులు కడుపులో ఇంకా 20 శాతం ఖాళీ ఉండేలా చూసుకుని తిండి ముగించెయ్యడం వల్ల బీపీ, కొలెస్టరాల్, షుగర్ వంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. నచ్చినట్లు చెయ్యండి మనసుకు ఇష్టమైన పనులు చేయడం ఆరోగ్యానికి మంచిదట. మంచి మ్యూజిక్ వినడం, వాకింగ్, పెయింటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ వంటి వాటివల్ల ఆయుష్షు పెరుగుతుందట. ఇంకా... మంచి పుస్తకాలు చదవడం, ఫన్నీ వీడియోలు చూడటం, పదిమందితోనూ హాయిగా కలిసిపోవడం, మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడపటం, పెంపుడు జంతువులతో ఎంగేజ్ అవడం, వర్క్లో బిజీ అవడం వంటివి ఆయుష్షును పొడిగించేలా చేస్తాయట. వీలయినన్ని ఫాలో అవండి... దీర్ఘాయుష్మంతులు కండి. -
ఫరెవర్ మార్క్ నుంచి కార్నర్ స్టోన్స్ వజ్రాలు
హైదరాబాద్: డీబీర్స్ గ్రూప్కు చెందిన డైమండ్ బ్రాండ్, ఫరెవర్ మార్క్ సంస్థ కార్నర్ స్టోన్స్ వజ్రాలను అందిస్తోంది. సరికొత్త సొగసుతో కూడిన వీటి క్లాసిక్ డిజైన్ అందర్నీ ఆకట్టుకోగలవని ఫరెవర్ మార్క్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతీ అనుబంధం లాగానే ప్రతీ ఫరెవర్ మార్క్ వజ్రం ప్రత్యేకమైనదని పేర్కొంది. ప్రతిదీ ఎంతో జాగ్రత్తతో ఎంపిక చేసి, ఎంతో అందంగా రూపొందిస్తామని వివరించింది.