-
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
షికాగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెంద గా పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడు. ఇల్లినాయిస్ సమీపంలో ఉన్న అరోరా పారిశ్రామిక సముదాయంలో ఈ ఘటన జరిగింది. హెన్నీ ప్రాట్ అనే పైపుల తయారీ కంపెనీలో గ్యారీ మార్టిన్(45) అనే వ్యక్తి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మార్టిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తు న్నట్లు ఆ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో తీవ్ర నిస్పృహకు గురైన మార్టిన్ వెంటనే తన వద్ద ఉన్న పిస్టల్తో తోటివారిపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కాల్పులకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మార్టిన్ చనిపోయాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
శోకసంద్రమైన కలు‘గోడు’
పిడుగుపాటుకు ఐదుగురు మృతి మరో ఆరుగురికి తప్పిన ప్రమాదం రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కిన గుమ్మఘట్ట మండలంలో ఆదివారం వర్షం కురిసింది. వ్యవసాయ పనులు, పశువుల మేపునకు వెళ్లిన వారంతా చెట్టు చాటుకు చేరి.. ఇక తమ కష్టాలు తీరబోతున్నాయని సంబరపడ్డారు. అయితే వారి ఆనందాన్ని ఆవిరిచేస్తూ పిడుగుపాటు వారి జీవితాలను కబళించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. - గుమ్మఘట్ట (రాయదుర్గం) కలుగోడుకు చెందిన గొల్లపల్లి ఓబన్న, జయణ్ణతో పాటు బీటీ బొమ్మయ్య, నజ్బూన్బీలు మేకలు, పశువులు మేపేందుకు గ్రామ చెరువు సమీపానకు వెళ్లారు. అప్పటిదాకా భానుడి భగభగలు తట్టుకోలేకపోయిన వారు ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో చినుకులు మొదలు కావడంతో పశువులు, గొర్రెలు, మేకలు తొలుకుని ఇంటి ముఖం పట్టారు. కాసింత దూరం రాగానే కళ్లు తెరవలేనంతగా గాలి, వాన ప్రారంభమైంది. ఆ పక్కనే ఉన్న రాయదుర్గం తిప్పేస్వామి పొలం వద్ద ఏర్పాటు చేసిన గోడచాటు సిమెంట్ రేకుల(షెడ్డు)లోకి వెళ్లి తలదాచుకున్నారు. తాపీమేస్త్రీగా పని చేసే కరీమ్సాబ్ తోటి స్నేహితుడు రుద్ర, చిన్నాన్న కుమారుడు జెబీ, అన్న కుమారుడు దాదుతో కలసి అదే పొలం వద్దనున్న వ్యవసాయ బోరువద్దకు స్నానం కోసం వెళ్లారు. గాలి, వాన హోరు చూసి వారుకూడా అక్కడికే చేరారు. కంతార్లపల్లి గిరిరెడ్డి ఇటీవల మృతి చెందిన వదిన సరస్వతి సమాధికి గుట్టకట్టేందు కోసం చెరువు సమీపాన సున్నపు రాయి (కంకర) ఏరేందుకు గుంతలో మల్లేసి, సొట్టకాళ్లప్ప గారి వెంకటేశులుతో వెళ్లాడు. ఈ మగ్గురు కూడా రేకుల చప్పరం కిందకే చేరారు. ఎంబీఏ విద్యార్థి బోయ శివప్ప పక్క పొలంలో రాగులు కుప్ప చేస్తూ వర్షం చూసి వారి వద్దకు వెళ్లాడు. ఇలా మొత్తం పది మంది ఒకేచోటకు చేరారు. అంతా నిమిషాల వ్యవధిలోనే.. వర్షం కురిస్తే చాలని మాట్లాడుతుండగానే రేకులకు ఆనుకుని ఉన్న వేపమానుపై భీకర శబ్ధంతో పిడుగు పడింది. దీంతో అక్కడున్న పది మంది కుప్పకూలిపోయారు. వీరిలో మొదటగా పోస్టు రుద్ర, జెబీ అనే ఇద్దరు స్నేహితులకు స్పృహ వచ్చింది. వారు ఒకరి కొకరు అలింగనం చేసుకుని గట్టిగా ఏడ్చారు. ఆ తరువాత మిగిలిన వారందరినీ అటు ఇటు ప్లొరిస్తూ..అరచి లేపినా పలకలేదు. పది నిమిషాల తరువాత మరో ముగ్గురు లేవగా.. మిగిలిన ఐదుగురు గొల్లపల్లి ఓబన్న (38), అంపణ్ణగారి జయణ్ణ (58), కరీమ్సాబ్ (32), కంతార్లపల్లి గిరిరెడ్డి (38), బోయ శివప్ప (25) ప్రాణాలు వదిలారు. గ్రామంలోకి పరుగున వచ్చి విషయాన్ని తెలియజేశారు. ఆర్డీఓ రామారావు, తహసీల్ధార్ అఫ్జల్ఖాన్, వైద్యాధికారి రమేష్, సీఐ చలపతిలు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. పిడుగు పడడంతోనే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఐదుగురు మృతితో కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. దేవుడా తమ బతుకులు ఇలా ఆర్పావా అంటూ మృతుల కుటుంబ సభ్యులు రోదించడం అందరినీ కలచివేసింది. మృతులంతా నిరుపేదలే.. పిడుగుపాటు మృతులు ఐదుగురూ నిరుపేదలే. గొల్లపల్లి ఓబన్నకు భార్య పార్వతితో పాటు నాగరాజు, మారుతి అనే చిన్న పిల్లలు ఉన్నారు. మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా, పిల్లలు అనాథలయ్యారు. - అంపణ్ణగారి జయణ్ణకు భార్య గిరిజమ్మ తో పాటు కుమారుడు హంపణ్ణ ఉన్నాడు. ఇతను బతుకు తెరవు కోసం భార్యతో కలసి బెంగళూరుకు వెళ్లగా, ఇంటివద్ద ఉన్న పశువులను మేపుతూ కూలి పనుల వల్ల జీవనం సాగించేవాడు. - కరీమ్సామ్ తాపీమేస్త్రీ. భార్య జబీనాబీతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. అత్యంత నిరుపేద. కనీసం ఇల్లు కూడా లేదు. అన్న ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు. - కంతార్లపల్లి గిరిరెడ్డికి రెండెకరాల పొలం ఉంది. నీళ్లులేక బీడుపెట్టి బతుకుదెరువు కోసం బెంగళూరుకు కూలి పనికోసం వెళ్లేవాడు. ఇతడికి భార్య లక్ష్మితో పాటు ప్రవీణ్, సంధ్య అనే ఇద్దరు ఇంటర్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. తండ్రి మరణంతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. - బోయ శివప్ప ఇటీవల ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగం సాధిస్తాడనుకున్న కుమారుడు పిడుగు రూపంలో కుప్పకూలి పోవడంతో కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ పిడుగుపాటుకు గురైన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీపీ పాలయ్య, మాజీ ఎంపీపీలు రాఘవరెడ్డి, గిరిమల్లప్ప, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మహేష్లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఆస్పత్రికి వచ్చి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నరకం ఎవరికీ వద్దు అప్పటిదాకా ఆనందంగా గడిపాం. వర్షం వస్తే పశువులకు గడ్డి కష్టాలు కూడా తీరుతాయి, మూగజీవాలకు కొద్దో గొప్పో తాగేందుకు నీరుకూడా లభిస్తుందనుకున్నాం. ఇంతలోనే ఆదేవుడు మాపై పగపట్టినట్టు పిడుగు రూపంలో కకావికలం చేశాడు. మేము ప్రాణాలతో బయటపడి ఊపిరిపీల్చుకున్నాం. తోటి వ్యక్తులు ప్రాణాలు వదిలారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాం. ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు. - పోస్టు రుద్ర, జెబీ, ప్రత్యక్ష సాక్షులు, కలుగోడు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందడం అత్యంత బాధకరం. తీరనిలోటు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం. మృతులంతా పేదలు కావడంతో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. గాయపడ్డ వారికి రూ.5 లక్షల పరిహారం అందించాలి. - కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
ఊపిరితీస్తున్న వడదెబ్బ
పెద్దపప్పూరు(తాడిపత్రి) : వడదెబ్బ మరణాలు ఆగడం లేదు. వాటికి కొనసాగింపుగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం మరో ఐదుగురు మృతి చెందారు. ఈ పరిణామం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో కంబగిరి రాముడు(43) వడదెబ్బతో మృతి చెందారు. వ్యక్తిగత పనులపై అనంతపురం వెళ్లిన ఆయన సాయంత్రం ఇంటికొచ్చే సరికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే జ్వరంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అగళి మండలంలో... అగళి: మండలంలోని హళ్లికెరలో చంద్రశేఖర్శర్మ(55) వడదెబ్బకు గురై గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఆయన ఎండతాపానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంటికి తరలించే సరికే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శింగనమల మండలంలో... శింగనమల : మండలంలోని చీలేపల్లిలో సోమసుందరయ్య(58) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందారు. గురువారం ఉదయమే ఉపాధి పనులకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు సలకంచెరువులోని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ జయరాములు, టెక్నికల్ అసిస్టెంట్ నారాయణస్వామి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బత్తలపల్లి మండలంలో... బత్తలపల్లి(ధర్మవరం) : బత్తలపల్లి మండలం కోడేకండ్లలో వడ్డె వెంకటరాముడు(56) వడదెబ్బతో గురువారం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామ సమీపంలోని రాతిగుట్టలోకి రాళ్ల కొట్టేందుకు కూలీ పనులకు బుధవారం వెళ్లిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నట్లు వివరించారు. తీవ్ర అస్వస్థతతో రాత్రి భోజనం కూడా చేయకనే పడుకున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున ఉలుకు, పలుకు లేకపోవడంతో నిద్ర లేపేందుకు కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించగా ఫలితం లేదన్నారు. మృతునికి భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలియగానే వైద్యాధికారి లోక్నాథ్, సీహెచ్ఓ లింగమూర్తి, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్రెడ్డి, ఆరోగ్య సిబ్బంది రామాంజులరెడ్డి, అరుణమ్మ, వీఆర్ఓ నరసింహమూర్తి, వీఆర్ఏ రాముడు గ్రామానికి చేరుకునఆనరు. మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. కూడేరు మండలంలో... కూడేరు(ఉరవకొండ) : కూడేరు మండలం రామచంద్రాపురంలో దళిత రాముడు(65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రాహ్మణపల్లిలోని చౌక «ధాన్యపు డిపోలో నిత్యావసర సరుకులు తెచ్చేందుకు వెళ్లిన ఆయన ఎండకు నీరసించి కిందపడి మృతి చెందినట్లు భార్య సంగమ్మ, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందిన వెంటనే పీహెచ్సీ వైద్యాధికారి తస్లీమ్ బేగం, తహశీల్దార్ వసంతలత తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement