-
ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!
Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది. అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా ఛానెల్స్తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్మాస్క్లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. చదవండి: షూట్ ఎట్ సైట్ ఆదేశాలపై శ్రీలంక ప్రధాని స్పందన -
మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం
హైదరాబాద్ : రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, రచయిత జోలెపాళెం మంగమ్మ (92) మృతి పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. చిత్తూరు జిల్లాకు మదనపల్లెకు చెందిన మంగమ్మ దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్రీడర్గా పదేళ్లపాటు పని చేశారు. ఆమె పలు భాషల్లో గ్రంథాలు రాయడంతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మంగమ్మ అంత్యక్రియలు ఇవాళ మదనపల్లెలో నిర్వహించనున్నారు. రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత జోలెపాళెం మంగమ్మ గారి మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/90g1fULT6E — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 2 February 2017 -
మహిళా న్యూస్రీడర్ మంగమ్మ కన్నుమూత
మదనపల్లె: ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, రచయిత, విద్యావేత్త డాక్టర్ జోలెపాళెం మంగమ్మ (92) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రెడ్డీస్కాలనీలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. స్థానిక అమ్మినేని వీధికి చెందిన సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు మంగమ్మ జన్మించారు. స్థానిక బి.టి.కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. ఢిల్లీలో ఉన్నత చదువులు అభ్యసించారు. అనంతరం ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్గా చేరారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్రీడర్గా పదేళ్లపాటు పని చేశారు. అనంతరం బి.టి.కళాశాల పాలకవర్గ సభ్యురాలిగా, రుషీవ్యాలీ పాఠశాలలో పరీక్షల విభాగంలో పని చేశారు. మంగమ్మ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. దీంతోపాటు ఆమెకు ఫ్రెంచ్, తమిళం, హిందీ, కన్నడం భాషల్లోనూ ప్రవేశం ఉంది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2002లో ఉగాది పురస్కారం, 2002లో కుప్పం రెడ్డెమ్మ సాహితీపురస్కారం, సిద్ధార్థ కళాపీఠం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. మంగమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement