breaking news
England - Italy match
-
తొలిసారి ఫైనల్లో ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈసారి కొత్త జట్టు చాంపియన్గా అవతరించనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. తద్వారా మూడో ప్రయత్నంలో ఆ జట్టు తొలిసారి ఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. 2015, 2019 టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ తరఫున ఎల్లా టూన్ (36వ ని.లో), లౌరెన్ హెంప్ (71వ ని.లో), అలెసియా రుసో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు సామ్ కెర్ (63వ ని.లో) ఏకైక గోల్ను అందించింది. ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్తో ఇంగ్లండ్ తలపడుతుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 1–0తో స్వీడన్ జట్టును ఓడించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ప్రపంచకప్ టోర్నీ జరగ్గా... నాలుగుసార్లు అమెరికా (1991, 1999, 2015, 2019)... రెండుసార్లు జర్మనీ (2003, 2007), ఒక్కోసారి నార్వే (1995), జపాన్ (2011) జట్లు టైటిల్ సాధించాయి. -
ఇప్పుడు ‘ఒంటె’ వంతు!
గత వరల్డ్కప్లో ఆక్టోపస్ ‘పాల్’ తరహాలో ఈ సారి కూడా ప్రపంచకప్ మ్యాచ్ల భవిష్యత్తు చెప్పేందుకు అనేక జంతువులు సిద్ధమయ్యాయి. బిగ్ హెడ్ అనే తాబేలు, ఫ్లాప్సీ (కంగారూ), పాండాస్ (చైనా), నెల్లీ (ఏనుగు), రూ (కుక్క)లను చాలా మంది ఈ జాబితాలో చేర్చారు. తాజాగా ఇప్పుడు ‘ఎడారి ఓడ’ కూడా నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఎమిరేట్స్కు చెందిన ఒంటె ‘షహీన్’ మ్యాచ్ల ఫలితాన్ని సరిగ్గా అంచనా వేస్తోందంటూ అక్కడి మీడియా చెబుతోంది. అది చెప్పినట్లుగా 100 శాతం ఫలితాలు వచ్చాయని, ముఖ్యంగా స్పెయిన్-నెదర్లాండ్స్, ఇంగ్లండ్- ఇటలీ మ్యాచ్ల గురించి షహీన్ ఒక్కటే సరిగ్గా చెప్పిందని, మిగిలిన జంతువులు అన్ని మ్యాచ్లను కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని ప్రచారం జరుగుతోంది.