-
కేంద్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రభుత్వాలు 15 ఏళ్లుగా ఉద్యోగుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయ ని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మం డిపడింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఏపీ ఎన్జీవో సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు, ఆదాయపన్ను పరిమితి పెంపు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్గా సాగిన ఈ ధర్నాలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నేతలు ఎండగట్టారు. తెలంగాణ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వాలు తీసుకుంటున్న వ్యతిరేక విధానాల వల్ల 1.23 లక్షల మంది ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలే ఉండటం వల్ల ఏడాదిలో 3 నెలల జీతాన్ని పన్ను కింద ఉద్యోగులు చెల్లించాల్సి వస్తోం దని పేర్కొన్నారు. అందువల్ల ఉద్యోగులకు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోపు ఉద్యోగుల పక్షాన నిలిచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ధర్నాలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చలానా తెగుద్ది!
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో పోలీసులను చూస్తే వాహనచోదకులు హడలిపోతున్నారు. మోటార్సైక్లిస్ట్ నుంచి ఆటోలు, మ్యాక్సీక్యాబ్ల నిర్వాహకుల వరకు అంతా బెంబేలెత్తిపోతున్నారు. అదేమంటే పోలీసులు దారికాచి చలానాలు రాస్తున్నారని చెబుతున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సర్వశక్తులు ధారపోసే పోలీసులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేపెట్టేందుకు శక్తియుక్తులు ప్రయోగిస్తున్నారు. దీనికోసం స్టేషన్లవారీగా టార్గెట్లు కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాలుపంచుకోవడంతో ప్రభుత్వానికి పన్నులు రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడింది. ఈ క్రమంలో పోలీసులపై ఇప్పుడు వసూళ్ల భారం పడింది. కనీసం పోలీసుల రవాణాఖర్చులు, జీతాలకైనా వస్తాయనుకున్నారో ఏమోకానీ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో పోలీస్ స్టేషన్లవారీగా టార్గెట్లు పెట్టారు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు, 49 మండలాల్లో ఇప్పుడు పోలీసులు కేసులు కట్టి చలానాలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ తదితర కాగితాలు లేకపోవడం వంటి వాటిని చూపి చలానాలు రాస్తున్నారు. ఇలా ఒక్కో స్టేషన్ పరిధిలో రోజుకు ఆరేసి కేసులు రాయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఎస్.ఐ.లు అసలు విధులు పక్కనపెట్టి జరిమానాల వసూళ్లతోనే కాలం వెళ్లబుచ్చాల్సివస్తోంది. ఈ కేసుల్లో అప్పటికప్పుడే రూ.100 నుంచి రూ. 2 వేలు వరకు చలానా రాసి వసూలు చేసే అవకాశం ఉండటంతో వాహన చోదకులు హడలిపోతున్నారు. అన్నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్లేనా? జిల్లాలో పోలీసులు రాస్తున్న చలానాలను పరికిస్తే గత కొద్ది రోజులుగా అన్నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ (రాష్ డ్రైవింగ్) లేనా.. అనే అనుమానం కలుగుతోంది. చలానాలు రాసి అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేయడానికి పోలీసులు మద్యం షాపుల సమీపంలోని ప్రధాన రహదారులపై మాటు వేస్తున్నారు. మద్యం షాపులో ఇలా మద్యం తాగి బైక్, ఆటోలపై అలా రోడ్డుపైకి రాగానే వల వేసి పట్టేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనాన్ని నడపడం) కారణంతో చలానాను తెగ్గోస్తున్నారు. వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిని పరీక్ష చేసి ఆధారాలతో కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమైక్య ఆందోళనల నేపథ్యంలో కోర్టులకు కూడా న్యాయవాదులు హాజరుకావడం లేదు. దీంతో ఈ కేసుల్ని కోర్టుకు పెడితే జరిమానా విధించడం జాప్యం జరుగుతుందనుకున్న పోలీసులు అటువంటి వాటిని కూడా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతున్నట్టుగానే చూపిస్తూ చలానాలు రాసి జరిమానాలు వసూలుచేయడం ఆశ్చర్యపరిచే అంశం. ఏది ఏమైనా పోలీసులకు అదనపు భారం పడినట్టే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement