breaking news
Division leaders
-
మరోసారి గెలిచిన వీరులు!
పార్టీలు ... డివిజన్లలో మార్పు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఇరవై మందికి పైగా గత పాలక మండలిలో, మరో పదిమంది 2002లో కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో టీడీపీ, కాంగ్రెస్లలో ఉండ గా... ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. కొందరు అవే డివిజన్ల లో రెండోసారి గెలుపొందగా... మరికొందరు ఇతర డివిజన్ల నుంచి విజయం సాధించారు. గతంలో ఉన్న కొన్ని డివిజన్లు రద్దు కావడం.. కొన్నింటిలో రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేయలేకపోవడం వంటికారణాలతో ఇతర డివిజన్ల నుంచి బరిలో దిగారు. ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ మారనప్పటికీ... కొందరి డివిజన్లు మారాయి. అలాంటి వారిలో మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. గత పాలక మం డలిలో బీజేపీ ఫ్లోర్లీడర్గా పనిచేసిన బంగారి ప్రకా శ్ ఇప్పుడు వేరే డివిజన్ నుంచి గెలుపొం దారు. ఎంఐఎం కోఆప్షన్ సభ్యురాలు అయేషారూబినా ఈసారి అహ్మద్నగర్ డివిజన్ నుంచి గెలిచారు. వీరిలో కొందరు మూడోసారి ఎన్నికైన వారు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రెండో పర్యాయం కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో జిట్టా రాజశేఖరరెడ్డి (వనస్థలిపురం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్బాగ్), మీర్ వాజి ద్ అలీఖాన్, తారాబాయి (ఫలక్నుమా), సున్నం రాజ్మోహన్ (పురానాపూల్), మహ్మద్ యూసుఫ్ (దత్తాత్రేయనగర్), కె.సత్యనారాయణ (జూబ్లీహిల్స్), జగన్ (జగద్గిరిగుట్ట) ఉన్నారు. -
కొత్తగూడెంలో ఏఐటీయూసీ ధర్నా
అధికారుల నిర్బంధం శ్రీరాంపూర్ : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఏ ఐటీయూసీ ఆందోళనకు దిగింది. చలో కొత్తగూడెoలో భాగంగా సోమవారం ఆ యూనియన్ అన్నీ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కొత్తగూడెం తరలివెళ్లి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులెవ్వరిని లోనికి వెళ్లనీయకుండా కా ర్యాలయం మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి దిగ్బంధనం చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొ న్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య మాట్లాడుతూ, కార్మికుల 31 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేపట్టామన్నారు. గు ర్తింపు సంఘం టీబీజీకేఎస్ నాయకులు అధికారం కోసం కొట్టుకుంటూ కార్మికుల సమస్యలను గాలికొదిలేశారని పేర్కొన్నారు. కంపెనీ లాభా ల నుంచి కార్మికులకు 25 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. బదిలీ ఫిల్లర్లను పర్మినెం ట్ చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, డిస్మిస్ కార్మికులందరికీ ఒక్కసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ట్రా క్ ద్వారా డిపెండెంట్లను తీసుకోవాలని, కంపెనీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. దీంతోపాటు కొత్తగా అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను కూ డా నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఐటీ మాఫీ చేయించాలని, సకల జనుల సమ్మె సందర్భంగా కార్మికులు కోల్పోయిన వేతనాన్ని వడ్డీతో సహా ఇప్పించాలని, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర నాయకులు మిర్యా ల రంగయ్య, భానుదాసు, వీరభద్రయ్య, మ ల్లారెడ్డి, రాజేశ్వర్రావు, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచీల కార్యదర్శులు ఎల్.శ్రీనివాస్, బాజీసైదా, కిషన్రావు పాల్గొన్నారు.