-
ప్రభుత్వ బ్యాంకుల భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చితో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో భారీ డివిడెండ్ను చెల్లించే వీలుంది. ఇందుకు లాభదాయకత మెరుగుపడటం సహకరించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది పీఎస్యూ బ్యాంకులు రూ. 15,000 కోట్లకుపైగా డివిడెండును చెల్లించే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి మూడు త్రైమాసికాల(ఏప్రిల్–డిసెంబర్)లో 12 పీఎస్యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 98,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. గతేడాది(2022–23)లో ఉమ్మడిగా సాధించిన నికర లాభానికంటే రూ. 7,000 కోట్లుమాత్రమే తక్కువ. గతేడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 66,540 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది ప్రభుత్వం పీఎస్యూ బ్యాంకుల నుంచి 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్ను అందుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 8,718 కోట్ల డివిడెండ్ మాత్రమే చెల్లించాయి. వెరసి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి పీఎస్యూ బ్యాంకులు డివిడెండును చెల్లించనున్నట్లు అంచనా. కాగా.. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6 శాతానికంటే తక్కువగా నమోదైన బ్యాంకులు మాత్రమే డివిడెండ్ ప్రకటించేందుకు వీలుంటుంది. అయితే వచ్చే ఏడాది(2024–25) నుంచి మాత్రమే తాజా మార్గదర్శకాలు అమలుకానున్నాయి. -
డిజిన్వెస్ట్మెంట్ నిధులు రూ.53,558 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వారంలో రూ.15,379 కోట్లు గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్లో ఎస్యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్ చేశారు. గత ఏడాది జూన్లో ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది. షేర్ల బైబ్యాక్ల ద్వారా జోరుగా నిధులు... షేర్ల బైబ్యాక్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్ నుంచి రూ.992 కోట్లు, ఎన్హెచ్పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్ షిప్యార్డ్ నుంచి రూ.137 కోట్లు, ఎన్ఎల్సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్ నుంచి రూ.260 కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్ఎస్సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇక ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కోల్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్యూ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్యూల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్?
నేను అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిని. నేను భారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడి కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నా ఇన్వెస్ట్మెంట్స్ను అంగీకరించడం లేదు. దీనికి కాణమేమిటి? - మహేందర్, కాలిఫోర్నియా(ఈ మెయిల్ ద్వారా) అమెరికా, కెనడాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల నుంచి దరఖాస్తులను పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంగీకరించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైనన్స్ యాక్ట్(ఫ్యాట్కా) కారణంగానే పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్నారైల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను అంగీకరించడం లేదు. ఈ చట్టం ప్రకారం అమెరికా జాతీయుల, అమెరికాలో స్థిరపడిన విదేశీయుల అన్ని లావాదేవీలను ప్రపంచంలోని ఆర్థిక సంస్థలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాలి. అయితే ఎల్ అండ్ టీ, యూటీఐ, పీపీఎఫ్ఏఎస్, సుందరం, కెనరా రొబెకొ.. ఈ సంస్థలు ఎన్నారైల నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ను అంగీకరిస్తున్నాయి. త్వరలో మరిన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఎన్నారైల ఇన్వెస్ట్మెంట్స్ను అంగీకరించే అవకాశాలున్నాయి. నేను 2015, జూలైలో ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ను తీసుకున్నాను. ఒక ప్రీమియమ్ను చెల్లించాను. ఈ ఏడాది వార్షిక ప్రీమియమ్గా రూ.14,711 చెల్లించాల్సి ఉంది. ఈ ప్లాన్కు బీమా కవరేజ్ రూ.3,75,000గానూ, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రూ.3,75,000 గానూ ఉంది. అయితే నేను ఇప్పటికే టాటా ఏఐఏ సంస్థ నుంచి రూ.50 లక్షలకు టర్మ్ ప్లాన్ తీసుకున్నాను. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీని కొనసాగించడం సమంజసమేనా? లేకుంటే ఈ ప్లాన్ నుంచి వైదొలగమంటారా? - లోకేశ్, విశాఖపట్టణం ఎండోమెంట్ ప్లాన్ల విషయంలో పలు సంస్థలు వ్యయాలు విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్....దీనికి మినహాయింపు కాదు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ, తగిన రాబడులనివ్వలేని ప్లాన్ల్లో కొనసాగడం సరికాదు. ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయడం సముచితమని భావిస్తున్నాం. తొలి ఏడాది కట్టిన ప్రీమియమ్ను మర్చిపోండి. ఈ ప్లాన్ తీసుకొని మూడేళ్లు పూర్తికాలేదు కాబట్టి మీకు సరెండర్ ఆప్షన్ కూడా లభించదు. ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు తగిన రాబడులను ఇవ్వలేవు. అలాగే సరిఅయిన బీమా కవరేజ్ను ఇవ్వలేవు. అందుకని భవిష్యత్తులో ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్ల్లో ఇన్వెస్ట్ చేయకండి. బీమా కవరేజ్కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. వీటికి ప్రీమియమ్లు తక్కువగా ఉంటాయి. బీమా కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న మీ టర్మ్ ప్లాన్.. మీకు తగిన బీమా కవరేజ్ ఇస్తుందో లేదో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. నా వయస్సు 59 సంవత్సరాలు. వచ్చే ఏడాది జనవరిలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.60 లక్షలు వస్తాయి. కుటుంబ పెన్షన్ కింద నెలకు రూ.12,000 వస్తాయి. నేను పెట్టిన పెట్టుబడులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం, షేర్లలో రూ.18 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్లో రూ.13 లక్షలుగా ఉన్నాయి. రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా రూ.5 లక్షల బ్యాంక్ ఆఫ్ బరోడా వారి హెల్త్ ప్లాన్ ఉంది. నేను తీర్చాల్సిన అప్పులేమీ లేవు. నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. పెన్షన్ ఆదాయం కాకుండా నెలకు రూ.60,000 వరకూ ఆదాయం వచ్చేట్లుగా ఈ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - నారాయణరావు, హైదరాబాద్ ముందుగా మీరు ఏం చేస్తారంటే, స్వీప్ ఇన్ సౌకర్యం ఉన్న సేవింగ్స్ ఖాతాలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీ నెలవారీ ఖర్చులను లెక్కించి, ఏడాదికి సరిపడేలా మొత్తాన్ని ఈ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేయండి. ఇక క్రమం తప్పని ఆదాయం కోసం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. అంతే కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో మీకు 8.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకు మీకు రూ.64,500 (నెలకు రూ.21,500) వస్తాయి. ఇక పోస్ట్ ఆఫీస్ మంథ్లీఇన్కమ్ స్కీమ్లో రూ.9 లక్షలు (జాయింట్ అకౌంట్)లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్పై 7.8 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. నెలకు రూ.5,850 ఆదాయం లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లో వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటిపై వచ్చే ఆదాయాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి పన్ను లెక్కిస్తారు. ఇక వీటికి అనుబంధంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. అంతేకాకుండా ఏడాది తర్వాత వీటిని విక్రయిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. అంతేకాకుండా మీ నెలవారీ ఆదాయ అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకోవాలో, గ్రోత్ ఆప్షన్ను ఎంచుకోవాలో తెలియక తికమకపడుతున్నాను. తగిన సూచనలివ్వండి. - లక్ష్మణ్, వరంగల్ రెగ్యులర్గా డబ్బులు అవసరమైన పక్షంలో మాత్రమే డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. రిటైరైన తర్వాత మీకు రెగ్యులర్గా డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటేనే మంచిది. చక్రగతి వృద్ధి కారణంగా మంచి రాబడులు మీరు పొందవచ్చు. డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకుంటే, మీకు వచ్చే డివిడెండ్లను మీరు ఖర్చు పెట్టేయడమో, లేదా తక్కువ రాబడులు వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. మీరు గ్రోత్ ఆప్షన్ ఎంచుకున్నా, డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్నా, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాది దాటితే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement