-
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
‘ఎఫ్బీఐ మెమో బహిర్గతం చేయండి’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్బీఐ జరిపిన దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ రూపొందించిన ఒక రిపబ్లికన్ మెమోను సంపూర్ణంగా బహిర్గతం చేసేందుకు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మెమో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎఫ్బీఐ డైరెక్టర్ చేసిన హెచ్చరికలను సైతం డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్బీఐ సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘చాలామంది సిగ్గుపడాల్సి ఉంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ మెమోను రూపొందించారు. ఎలాంటి మార్పులూ చేయకుండానే ఈ మెమోను విడుదల చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. -
‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే!
‘నల్ల’కుబేరుల విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం ఫైర్ ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ ఘాటు ప్రశ్న విదేశాల్లో ఖాతాలున్న వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? కొందరి పేర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవద్దు పూర్తి సమాచారం ఇవ్వండి.. మిగిలినదంతా మేం చూసుకుంటాం ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని తీవ్ర వ్యాఖ్యలు నేడు సీల్డు కవర్లో సమర్పించాలని కేంద్రానికి ఆదేశం గత తీర్పులో ఒక్క పదాన్ని కూడా మార్చేది లేదని స్పష్టీకరణ పూర్తి జాబితా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్రం ప్రకటన దాదాపు 500 మంది పేర్లు అందినట్లు వెల్లడించిన అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది పేర్లతో కూడిన అఫిడవిట్ను సోమవారం సుప్రీంకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా కొంతమంది పేర్లనే వెల్లడించి.. మిగతావారి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ మంగళవారంనాటి విచారణ సందర్భంగా కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. దీంతో సుప్రీం ఆదేశాలను పాటిస్తామని, తమ వద్దనున్న మొత్తం పేర్లన్నింటితో పూర్తి జాబితాను కోర్టుకు సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు... విదేశాల్లో అక్రమంగా నల్లధనం ఖాతాలున్న వారందరి పేర్లు వెల్లడించాలంటూ సుప్రీం గత తీర్పులో కొన్ని మార్పులు చేయాలంటూ కేంద్రం తన తాజా అఫిడవిట్లో కోరింది. విదేశీ ఖాతాల్లో పన్ను ఎగవేతలకు సంబంధించి తగిన ప్రాథమిక రుజువులు ఉండి, చట్టపరమైన విచారణ(ప్రాసిక్యూషన్)ను ప్రారంభించిన వారి పేర్లను మాత్రమే బహిర్గతం చేస్తామని అందులో పేర్కొంది. ఇదే విషయాన్ని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్(సీజేఐ) హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం కేంద్రం వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు, ప్రభుత్వ తీరును తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘గత యూపీఏ ప్రభుత్వం మా తీర్పును ఆమోదించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కారు నల్లకుబేరుల విషయంలో ఎందుకు ఈ విధమైన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది. విదేశాల్లో అక్రమంగా బ్యాంకు ఖాతాలున్నవారిని మీరు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? గతంలో మేం తీర్పును సొలిసిటర్ జనరల్ సమక్షంలోనే వెల్లడించాం. కొత్త ప్రభుత్వం కూడా ఈ తీర్పులో ఎలాంటి మార్పులూ కోరలేదు. ఇప్పుడు మార్పులు అడగడంలో ఔచిత్యమేంటి? మా తీర్పును ఎట్టిపరిస్థితుల్లో సవరించబోం. ఒక్క పదాన్ని కూడా మార్చే ప్రసక్తే లేదు’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘మీరేమీ చేయనక్కర్లేదు... విదేశాల్లోని నల్లధనం ఖాతాలకు సంబంధించి మీదగ్గరున్న పేర్లు, సమాచారాన్నంతా కోర్టుకు సమర్పించండి. ఆ తర్వాత దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐ సహా ఎలాంటి సంస్థతో దర్యాప్తు చేయించాలనేది కోర్టు నిర్దేశిస్తుంది’ అని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ మదన్ బి లోకూర్లు ఉన్నారు. జీవితకాలంలో కూడా దర్యాప్తు పూర్తి చేయలేరు భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వానికి దాదాపు 500 మంది పేర్లు అందాయని అటార్నీ జనరల్ ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఇందులో జర్మనీసహా పలు దేశాల్లోని ఖాతాల వివరాలున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో సీజేఐ కల్పించుకొని.. ‘‘మీరు సొంతంగా ఎలాంటి దర్యాప్తూ జరపాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే గనుక దర్యాప్తు చేస్తే నా జీవితకాలంలో కూడా అది పూర్తికాదు. ఖాతాదార్లకు సంబంధించి కేవలం మీదగ్గరున్న సమాచారాన్నంతా మాకివ్వండి. ఏ విధంగా, ఎవరితో దర్యాప్తు జరిపించాలనేది మేం చూసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఖాతాలున్న భారతీయుల తరుఫున వకాల్తా పుచ్చుకోవద్దని, సిట్ అన్ని విషయాలనూ చూసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇలా కొందరు ఖాతాదారుల పేర్లను ఇచ్చి చేతులు దులుపుకోవద్దని హితవు పలికింది. మొత్తం జాబితాను బుధవారం నాడు తమ ముందుంచాలని కుండబద్దలు కొట్టింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేయలేమని కూడా తేల్చిచెప్పడం గమనార్హం. ఒప్పించేందుకు ఏజీ విశ్వప్రయత్నం గత తీర్పులో సవరణకు కోర్టును ఒప్పించేందుకు బలమైన వాదనతో అటార్నీ జనరల్ చాలా ప్రయత్నించారు. ప్రభుత్వం వద్దనున్న మొత్తం పేర్లన్నింటినీ బయటపెడితే.. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించే ప్రయత్నం దెబ్బతినొచ్చన్నారు. ఇతర దేశాలు తమ వద్దనున్న ఖాతాల సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించవచ్చని వాదించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు నియమించిన సిట్ చట్టబద్ధ సంస్థ కాదని, అందువల్ల విదేశీ ఖాతాదారులకు ఎలాంటి నోటీసులూ జారీచేయడం కుదరదని కూడా అటార్నీ వివరించారు. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ద్వారానే ఇది సాధ్యమవుతుందని.. ఇప్పటికే సమాచారాన్నంతా సిట్కు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, ఆయన వాదనలపట్ల ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ‘విదేశాలు ఇచ్చిన ఖాతాదారుల పేర్లన్నీ మాకు కావాలి. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఈ కేసును మేం టేకప్ చేసి(సిట్కు బదలాయించి).. దాని పర్యవేక్షణను కూడా మేమే చూస్తాం. అంతిమంగా సిట్ ఈ అంశానికి తగిన ముగింపునిస్తుంది. ఈ విషయంలో మీకొచ్చిన ఇబ్బందేంటి?’ అని ప్రశ్నించింది. అయితే, ఖాతాల వివరాల వెల్లడి విషయంలో గోప్యత పాటిస్తామని విదేశీ ప్రభుత్వాలు, సంస్థలకు ప్రభుత్వం హామీనిచ్చిందని కూడా ఏజీ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ అనాలోచితంగా బహిర్గతం చేస్తే... విదేశాలతో పన్ను ఒప్పందాల విషయంలో సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో సమాచార మార్పిడికీ ఇబ్బందులు తప్పవని రోహత్గీ వాదించారు. అయితే, అలాంటి హామీలేవీ మీరు(ప్రభుత్వం) ఇవ్వొద్దని, మన దేశానికి చెందిన సొమ్మును విదేశాలకు తరలించుకుపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. దీనికోసమే సిట్ను ఏర్పాటు చేశామని, అలాంటి ఇబ్బందులేవైనా తలెత్తితే అది చూసుకుంటుందని, ప్రభుత్వం ఇందుకు సహకరించాలని కూడా ధర్మాసనం కుండబద్దలు కొట్టడం గమనార్హం. చిత్తశుద్ధితో ఉన్నాం నల్లధనాన్ని భారత్కు తిరిగి రప్పించడంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని, ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని కేంద్రం పేర్కొంది. ఇందుకు దౌత్యపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటామని కూడా సుప్రీంకు సమర్పించిన 16 పేజీల అఫిడవిట్లో కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. విదేశాల్లో భారతీయులకున్న ప్రతి ఖాతా అక్రమమైనది కాదని కూడా తెలిపింది. ప్రాసిక్యూటబుల్(చట్టప్రకారం విచారణకు అర్హమైన) కేసుల్లో మరింత మంది నల్లకుబేరుల పేర్లను బహిర్గతం చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రదీప్ బర్మన్తోపాటు మొత్తం ఎనిమిది మంది నల్లకుబేరుల పేర్లను సోమవారం కేంద్రం బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రాజ్కోట్కు చెందిన బులియన్ ట్రేడర్ పంకజ్ చిమన్లాల్ లోధియా, గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్, దాని డెరైక్టర్ రాధా సతీశ్ టింబ్లోతో పాటు మరో నలుగురు డెరైక్టర్లు కూడా జాబితాలో ఉన్నారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను వీళ్లంతా ఖండించారు. ఇక విదేశాల్లో తమకు ఎలాంటి నల్లధనం ఖాతాలూ లేవని టింబ్లో ప్రైవేటు లిమిటెడ్ డెరైక్టర్ రాధా ఎస్ టింబ్లో మంగళవారం వివరణ ఇచ్చారు. అఫిడవిట్లోని అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్లాయంటూనే.. తమ వరకైతే అన్ని పన్నులనూ సక్రమంగా చెల్లిస్తున్నామని ఆమె చెప్పారు. జాబితా నేడు సమర్పిస్తాం: జైట్లీ నల్లధనం ఖాతాదారుల పేర్లతో కూడిన జాబితానంతటినీ బుధవారం సమర్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. ‘ఎవ్వరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. సుప్రీం చెప్పినట్లుగా సీల్డు కవర్లో జాబితాను ఇచ్చేస్తాం. ఇప్పటికే ఈ లిస్టును సుప్రీం నియమించిన సిట్కు జూన్ 27నే సమర్పించాం. మేం చట్టప్రకారం నడుచుకుంటాం. కోర్టుకు కూడా జాబితా ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు’ అని జైట్లీ తేల్చిచెప్పారు. అయితే, ఈ పేర్లన్నింటినీ ప్రభుత్వం ప్రజలకు బహిర్గతం చేస్తుందా లేదా అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా, విదేశాల్లో అక్రమంగా నల్లధనం పోగేసిన ఖాతాదారులందరినీ శిక్షించాలన్న దృఢనిశ్చయంతో ప్రభుత్వం ఉందని.. నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు సాయశక్తులా కృషిచేస్తామని కూడా జైట్లీ పేర్కొన్నారు. ‘జాబితాలో పేర్లున్న వారి నిగ్గు తేల్చాల్సిందే. అప్పుడే నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు వీలవుతుంది. ఏ సంస్థతో దర్యాప్తు జరిపించినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ నల్ల మహమ్మారి విషయంలో ఎవరినీ వదలిపెట్టకుండా.. చట్టప్రకారం శిక్షించాలన్న చిత్తశుద్ధితో మా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement