breaking news
disable
-
ఐఫోన్లో కొత్త బగ్..! ఇలా పరిష్కరించండి...
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు ఐఫోన్లు బగ్లకు గురైతే వెంటనే వాటికి ఆపిల్ పరిష్కారం చూపుతుంది. తాజాగా ఆపిల్ ఐఫోన్లో మరొక బగ్ను గుర్తించారు. ఈ బగ్ ఆపిల్ ఫోన్లలో వైఫై సపోర్ట్ను పూర్తిగా నిలివివేస్తోంది. ‘%secretclub%power’ అనే పేరుతో ఉన్న వైఫై నెట్వర్క్ కు ఐఫోన్ను కనెక్ట్ చేసినప్పుడు వైఫై ఆటోమెటిగ్గా డిసేబుల్ అవుతుందని కార్ల్ షౌ అనే బ్లాగర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. అతను % సింబల్ ఉన్న వైఫై నెట్వర్క్కు కనెక్ట్ కావడంతో అతని ఐఫోన్లో వైఫై పూర్తిగా డిసేబుల్ అయ్యిందని తెలిపాడు. నెట్వర్క్ సెట్టింగ్లను రిసెట్, ఫోన్ను రీస్టాట్ చేసిన తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందలేకపోయాడు. ఇలా చేస్తే..బెటర్.. ఆపిల్ ఐఫోన్లలో ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది టెక్ నిపుణులు రెండు మార్గాలను సూచించారు. వైఫై సెట్టింగ్స్ను రీసెట్ చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు. ఐక్లౌడ్ నుంచి వైఫై నెట్వర్క్ పేరును తొలగించడం ద్వారా తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ బగ్పై ఆపిల్ అధికారికంగా స్పందించ లేదు. -
హైదరాబాద్ మెట్రోరైల్లో ఆ భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ : విధి వక్రించి దివ్యాంగులుగా మారిన వారికి రైలు ప్రయాణమంటే కత్తిమీద సామే.. బస్సెక్కాలంటేనే ఆందోళన.. అలాంటిది రైలు ఎక్కాలంటే వారి ఇబ్బంది చెప్పనవసరం లేదు. ఎవరోఒకరు తోడుంటే తప్ప ప్రయాణం చేయలేరు. అయితే హైదరాబాద్ మెట్రోరైల్లో ఆ భయం అవసరం లేదు. ఈ ప్రాజెక్టులో ఇంజినీరింగ్ అద్భుతాలే కాదు..సామాజిక కోణం..ఆర్థిక కోణం..మానవీయ కోనం...ఇలా అన్ని వర్గాల వారు మన మెట్రో ..మన గౌరవం అన్న స్ఫూర్తితో ముందుకు సాగేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసిన తరవాత దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు..మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి మెట్రో స్టేషన్లు,రైళ్లలో ప్రత్యేక వసతులు,సౌకర్యాలు కల్పించారు. సౌకర్యవంతమైన ప్రయాణం.. వికలాంగులు, అంధులు, వినికిడి సామర్థ్యంలేనివారు, మాట్లాడలేని వారు కూడా ఎవరి సాయం లేకుండానే మెట్రో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేషన్ పరిసరాలు, టిక్కెట్ కలెక్షన్ గేట్లు, టిక్కెట్ జారీ యంత్రాల వద్ద దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సుమధుర స్వరంతో అనౌన్స్మెంట్.. ఇక మీరు ఎక్కాల్సిన రైలు ఆగే ప్రదేశం..దిగాల్సిన స్టేషన్ వివరాలను నిరంతరాయంగా తెలియజేసేందుకు తెలుగు, ఇంగ్లిష్ హిందీ భాషల్లో అనౌన్స్మెంట్ వినిపించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్లెవల్ నుంచి మొదటి అంతస్తు (స్టేషన్ మధ్యభాగం కాన్కోర్స్)కు చేరుకోగానే ప్రతీ ఒక్కరికీ అనౌన్స్మెంట్ మూడు భాషల్లో వినిపిస్తుంది. ఏదేని స్టేషన్ రాగానే బోగీ డోర్లు తెరచుకున్న..మూసుకున్న ప్రతీసారీ సుమధుర స్వరంతో మూడుభాషల్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. దీంతో ఎవరి సాయం అక్కరలేకుండానే ఎవ్వరైనా మెట్రో జర్నీ చేయవచ్చు. వీల్చైర్లకు ప్రత్యేక ర్యాంపులు రోడ్లెవల్ నుంచి నేరుగా ప్లాట్ఫారం మీదకు వీల్చైర్లో వెళ్లేందుకు ప్రతీ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించారు. అంతేకాదు వీల్చైర్తో సహా లిఫ్టులో ప్రయాణించేందుకు ప్రతి స్టేషన్ వద్ద విశాలమైన లిఫ్టులు ఏర్పాటుచేశారు. ఇక వీల్చైర్లో వెళ్లే ప్రయాణీకులు నేరుగా బోగీలోకి చేరుకునేందుకు ప్లాట్ఫాంకు.. ట్రాక్ను సమాన ఎత్తులో ఏర్పాటు చేశారు. తద్వారా వీల్చైర్తో నేరుగా భోగీలోకి వెళ్లి సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. ఇక బోగీలోనూ ప్రత్యేకంగా గ్రాబ్హోల్డ్లను ఏర్పాటుచేశారు. దీనికి వీల్చైర్ను లాక్చేయవచ్చు. ఇక వీరు వీల్చైర్తో సహా టాయిలెట్కు వెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రతి స్టేషన్లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అంధుల కోసం... బ్రెయిలీ లిపిలో లిఫ్టు బటన్లను ఏర్పాటుచేశారు. ఇక తమ చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ కర్ర సాయంతో ప్లాట్ఫారం పైకి చేరుకునేందుకు ప్రత్యేకమైన టైల్స్తో మార్గం ఏర్పాటు చేశారు. అంధులు ప్రమాదవశాత్తు ప్లాట్ఫాంపై కిందపడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,సౌకర్యాలు కల్పించారు. నిరక్షరాస్యుల కోసం.. స్వల్ప దృష్టిలోపం ఉన్నవారు..నిరక్షరాస్యులు సైతం స్టేషన్లో వివిధ ప్రాంతాలకు, స్టోర్లకు వెళ్లేందుకు సూక్ష్మచిత్రాలు (పిక్టోగ్రామ్స్)తో ఏర్పాటుచేసిన సైనేజి బోర్డులు, రేడియం బోర్డులు ఉపయుక్తంగా ఉంటాయి. వారు ఎవరి సాయం లేకుండానే ఈ చిత్రాలను వీక్షించి తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లవచ్చు. మెట్రో క్యా బాత్హై రాళ్లెత్తిన కూలీలు..18 వేలు... మెట్రో నిర్మాణానికి సుమారు 18 వేల మంది కార్మికులు సుమారు ఐదేళ్లపాటు అహరహం శ్రమించడంతో కలల మెట్రో ప్రాజెక్టు సాకారమైంది. ఒరిస్సా, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ఘడ్, ఏపీకి చెందిన వేలాదిమంది కార్మికులకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా ఆరునెలల పాటు శిక్షణనిచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దింది. ఇందులో బార్బెండర్స్, వెల్డర్స్, ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులున్నారు. వీరందరికీ....వసతి,భోజన,వైద్య సౌకర్యాలు సైతం డిపోలోనే కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వారికోసం వసతిసముదాయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేసింది. వీరంతా మూడు షిఫ్టులవారీగా పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు భద్రతా ఏర్పాట్లు,కార్మికులకు సేఫ్టీ ఉపకరణాలు అందజేశారు. -
వికలాంగుల అభివృద్ధికి సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ భాస్కరరెడ్డి కోరారు. ఈ యేడాది ఎంపీ నిధులతో 179 మందికి మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం యూరోపియన్ యూనియన్, లిమోనార్డ్ చెషైర్ డిజేబిలిటీ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎల్సీడీడీపీ) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో వికలాంగుల పథకాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆ సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ పారా ఒలింపిక్స్లో భారత వికలాంగుల ప్రదర్శన అత్యద్భుతమన్నారు. ఉపకార వేతనాలు పొందేందుకు వికలాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ, చంద్రన్న బీమా పథకం ప్రాజెక్టు మేనేజర్ రాజాప్రతాప్ మాట్లాడుతూ 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన బడుగు, బలహీన వర్గాల వారు ఒకేసారి రూ.15 చెల్లించి చంద్రన్న బీమాలో చేరవచ్చన్నారు. ఈ పథకంలో సభ్యుల సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. వికలాంగులు కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా తరపున కృష్ణమోహన్, ఉపాధిహామీ పథకం వికలాంగుల సమన్వయకర్త సురేష్కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆంజనేయులు, మద్దిలేటి, చంద్రశేఖర్, నిర్మల పాల్గొన్నారు.