breaking news
Dhilli University
-
డ్రగ్స్తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ..
Model Shubham Malhotra Arrested: సినీ సెలబ్రిటీలు, మోడల్స్, అప్పుడే చిత్రసీమలోకి అడుగుపెడుతున్నవారు ఎందరో డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా మరో మోడల్ డ్రగ్స్తో ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. మోడల్ శుభమ్ మల్హోత్రా (25) అతడి స్నేహితురాలు కీర్తి (27) రూ. కోటీ విలువ చేసే మాదకద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. 'కొందరు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు ప్రారంభించాం. తర్వాత మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఈ ఇద్దరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాం' అని క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ రోహిత్ మీనా వెల్లడించారు. అయితే కీర్తి దిండు సాయంతో గర్భవతినని నమ్మించి తనిఖీ అధికారులను బురిడీ కొట్టించేదని దర్యాప్తులో తేలిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారి కారును వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. మోడల్ శుభమ్ మల్హోత్రా, కీర్తిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ఆ షాట్ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా.. -
డీయూలో ‘క్లీన్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘ క్లీన్ ఇండియా’ పిలుపునకు ఢీల్లీ యూనివర్సిటీ(డీయూ) స్పందించింది. డీయూలో పారిశద్ధ్యం- ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులల్లో అవగాహన కల్పించడానికి 20 మంది సభ్యులతో కూడిన స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనితీరును పర్యవేక్షిస్తుంది. క్యాంపస్లో ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతోనే పరిమితం కాదు, 2019 వరకూ నిరంతరం కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతిన ప్రారంభించి, 150వ గాంధీ వర్ధంతి వరకూ నిరంతరం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రణాళిక రూపొందించాం క్యాంపస్ ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించామని డీయూ మీడియా కో ఆర్డినేటర్, జాయింట్ డీన్ మాలే నీరవ్ చెప్పారు. డీయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది క్యాంపస్లో పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతారు. వీరితో కలిసి పనిచేయడానికి ఎంసీడీ కూడా పారిశద్ధ్య కార్మికులను నియమిస్తుంది. 2015, 2017, 2019 వరకు మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యూనివర్సిటీ అధికారుల నేతృత్వంలో వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఆయా కాలేజీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి రోజు శ్రీకారం: ఇందులో భాగంగానే నగర మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ పాలుపంచుకొంటోంది. ‘క్లీన్ ఇండియా’పై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టింది. ‘డీయూ స్వచ్ఛత అభియాన్’ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా వర్సిటీలోని గాంధీభవన్ వేదికగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సుమారు 100 ఎంసీడీ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యమ్రాన్ని ప్రారంభిస్తున్నామని డీయూ సమాన అవకాశాల విభాగం డిప్యూటీ డీన్ బిపిన్ తివారి చెప్పారు. క్లీన్నెస్ ఆవశ్యకత-జవాబుదారీతనం గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ధ్యేయమని చెప్పారు. క్యాంపస్లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు డీయూ సభ్యులు పాల్గొంటారు. దక్షిణ, ఉత్తర క్యాంపస్లోని అన్ని విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొంటారు. క్యాంపస్ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైస్ చాన్స్లర్ పిలుపు ఇస్తారని తివారి చెప్పారు.