-
కోవిడ్–19పై శక్తివంచనలేకుండా పోరు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్ ద్వారా రీఫైనాన్షింగ్ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి: ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్ 2021 నాటికి కరోనా వైరస్ పోరులో భాగంగా 160 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్ తగిన కృషి జరపాలని బ్యాంక్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
పేదల ఆస్పత్రిపై పట్టింపేది..?
అధ్వానంగా ఎంజీఎం దవాఖానా అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న రోగులు అమలుకు నోచుకోని గత తీర్మానాలు జాడలేని అభివృద్ధి కమిటీ సమావేశం ఏడాది పాలనలో ముందుకుసాగని పనులు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా వర్ధిల్లుతున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.. సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వస్తున్న ఆస్పత్రిని అభివృద్ధి చేస్తూ, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పేదలకు వైద్య సేవలందిస్తున్న ధర్మాస్పత్రి అచేతనా వస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఎంజీఎం : తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతున్న ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తరుునా అభివృద్ధిపై దృష్టి సారించడంలేదు. ఆస్పత్రిలో నెలకొన్న అసౌకర్యాలతోపాటు వైద్య సిబ్బంది పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గతంలో సమీక్ష సమావేశం నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా, మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన హెచ్డీఎస్ సమావేశానికి ప్రజాప్రతినిధులు సమయం కేటాయించకపోవడంతోపాటు అధికారుల పట్టింపులేనితనం రోగులకు శాపంగా మారింది. ఇదిలా ఉండగా, 2014 జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కాగా, దీనికి ఐదేళ్ల ముందు 2009 నంబర్ 4న సమా వేశం నిర్వహించారు. ఏడాది పాలనలో ఏమీ లేవు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఎం జీఎం ఆస్పత్రి అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. కాగా, రూ.9 కోట్లతో నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ హెల్త్కేర్ భవనాన్ని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రారంభించినా నేటికి అమలులోకి రాలేదు. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బం ది కొరతపై మెడికల్ రిక్రూట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ‘కడియం’ నోట.. హెచ్డీఎస్ మాట.. కాకతీయ మెడికల్ కళాశాలలోని అదనపు 50 సీట్లను కాపాడుకునేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు కేఎంసీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సమయంలో హెచ్డీఎస్ సమావేశం నిర్వహించాలనే మాట.. తాజా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నోట వెలువడింది. అరుుతే ఇంత వరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై అడుగులు పడకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో సమస్యలు తాండవిస్తున్నా రోగులకు మెరుగైనా సేవలందించే దిశలో హెచ్డీఎస్ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. అప్పటి తీర్మానాల అమలేది.. ? గత ఏడాది జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన హెచ్డీఎస్ సమావేశ తీర్మాణాలు ఒక్కటి కూడా అములుకు నోచుకోలేదు. హెచ్డీఎస్ సమావేశం నిర్వహించిన ఆనంతరం ఆస్పత్రి సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమా వేశం నిర్వహించాలన్నా తీర్మాణం సైతం అమలుకు నోచుకోలేదు. కాగా, రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని, ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, క్యాజువాలిటీ విభాగంలో పడకల సంఖ్యను పెంచాలని, పేద రోగులు ప్రైవేట్కు తరలకుండా చర్యలు తీసుకోవాలని, రోగులు, వారి బంధువుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వపరంగా సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని అప్పట్లో తీర్మాణించారు. వీటితోపాటు ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించేలా చూడాలని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ప్రతిపాదించారు. పెరుగుతున్న రోగుల సం ఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement